logo

భాజపా సీఎం ఎవరన్నది ప్రజలు నిర్ణయిస్తారు

రాష్ట్రంలో భాజపా అధికారానికి వస్తుందని, సీఎం ఎవర్నది ప్రజలు నిర్ణయిస్తారని కేంద్రమంత్రి, సంబల్‌పూర్‌ లోక్‌సభ అభ్యర్థి ధర్మేంద్ర ప్రధాన్‌ చెప్పారు.

Published : 07 May 2024 01:14 IST

వేదికపై ధర్మేంద్ర, జయశంకర్‌

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో భాజపా అధికారానికి వస్తుందని, సీఎం ఎవర్నది ప్రజలు నిర్ణయిస్తారని కేంద్రమంత్రి, సంబల్‌పూర్‌ లోక్‌సభ అభ్యర్థి ధర్మేంద్ర ప్రధాన్‌ చెప్పారు. ఆదివారం రాత్రి సంబల్‌పూర్‌లో జరిగిన సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్‌.జయశంకర్‌తో కలసి పాల్గొన్న ధర్మేంద్ర రాష్ట్రానికి ధృడమైన నాయకత్వం అవసరమన్నారు. అది ప్రధాని నరేంద్రమోదీ వల్లే సాధ్యమన్నారు. జయశంకర్‌ మాట్లాడుతూ... 2036 నాటికి స్వతంత్ర ఒడిశా వందేళ్ల వేడుకలు జరుపుకోనుందని, దీనికి ముందుగా రాష్ట్రం స్వయం సమృద్ధి సాధించాల్సి ఉందని, న్యాయనిర్ణేతలైన ప్రజలు ఈ దిశగా దృష్టి సారించాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని