కొరాపుట్ ఎవరికి సొంతం?
కొరాపుట్, రాయగడ జిల్లాల్లో ప్రతిష్ఠాత్మక కొరాపుట్ లోక్సభ స్థానంలో విజయంపై అందరి దృష్టి పడింది. ఇక్కడ కాంగ్రెస్, బిజద, భాజపాల మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉండగా, విజయం ఎవరిదో అన్న ఉత్కంఠ నెలకొంది.
మూడు పార్టీల మధ్య తీవ్ర పోటీ
సిమిలిగుడ, న్యూస్టుడే
కొరాపుట్, రాయగడ జిల్లాల్లో ప్రతిష్ఠాత్మక కొరాపుట్ లోక్సభ స్థానంలో విజయంపై అందరి దృష్టి పడింది. ఇక్కడ కాంగ్రెస్, బిజద, భాజపాల మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉండగా, విజయం ఎవరిదో అన్న ఉత్కంఠ నెలకొంది. గుణుపూర్, బిసంకటక్, రాయగడ, లక్ష్మీపూర్, కొరాపుట్, పొట్టంగి, జయపురం విధానసభ నియోజకవర్గాలతో కూడిన లోక్సభ నియోజకవర్గం 1957లో ఏర్పాటైంది. ఎస్టీల కోసం కేటాయించిన ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 18 సార్లు జరిగిన ఎన్నికల్లో 16 సార్లు కాంగ్రెస్సే గెలిచింది. రెండుసార్లు (2009, 2014లో) బిజద గెలుపొందింది. 2019లోను బిజద, కాంగ్రెస్, భాజపా అభ్యర్థుల మధ్య ఉత్కంఠ పోరు నెలకొన్నా కాంగ్రెస్ అభ్యర్థి సప్తగిరి ఉలక విజయ పతాకం ఎగరేశారు. దీంతో ఆయన రాష్ట్రంలో 21 స్థానాలకుగాను కాంగ్రెస్ నుంచి ఎంపికైన ఏకైక ఎంపీగా నిలిచారు.
9 సార్లు గెలుపొందిన ఘనత
కొరాపుట్ లోక్సభ స్థానం నుంచి 9 సార్లు గెలుపొందిన ఘనత గిరిధర్ గమాంగ్ది. ఆయన 1972లో తొలిసారిగా ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. 1998 వరకు వరుసగా ఓటమెరుగని వీరుడిగా గుర్తింపు పొందారు. 1999లో గిరిధర్కు బదులు ఆయన సతీమణి హేమా ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2004లో గిరిధర్ మళ్లీ బరిలో దిగి విజయ బావుటా ఎగరేశారు. 2009లో బిజూ జనతా దళ్ అభ్యర్థి జయరామ్ పంగి గిరిధర్ను ఓడించి సంచలనం సృష్టించారు. 2014లోనూ గిరిధర్ ఓటమి పాలయ్యారు. ఆ ఏడాది బిజద అభ్యర్థి జీను హికాక గెలుపొందారు. 2019లో మాజీ మంత్రి, మాజీ ఎంపీ రామ్చంద్ర ఉలక కుమారుడు సప్తగిరి ఉలక రాజకీయ ప్రవేశం చేసి ఎంపీ స్థానానికి బరిలో దిగారు. ఆయనకు ప్రత్యర్థులుగా జీను భార్య కౌసల్య, భాజపా తరఫున జయరామ్ పంగి పోటీ చేయగా, సప్తగిరి విజయ శంఖం పూరించారు. ఈ నియోజకవర్గంలో జగన్నాథరావు (1957), టి.సంగన్న (1957)లు ఇద్దరు తెలుగు అభ్యర్థులు కావడం విశేషం. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఎక్కువసార్లు రాయగడ జిల్లా అభ్యర్థులే ఈ స్థానంలో గెలుపొందడం మరో విశేషమని చెప్పొచ్చు. కేవలం జయరామ్ పంగి, జీను హికాకలు మాత్రమే కొరాపుట్ జిల్లాకు చెందినవారు.
రసవత్తర పోరు
తాజా ఎన్నికల్లో కొరాపుట్లో రసవత్తర పోరు జరుగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి సప్తగిరి, బిజద తరఫున కౌసల్య హిక్కాకలు తలపడుతుండగా, కొత్త అభ్యర్థి భాజపా నుంచి కాళీరామ్ మాఝి తలపడుతున్నారు. రెండోసారి ఈ స్థానం చేజిక్కించుకోవాలని సప్తగిరి చూస్తుండగా, గతసారి ఓటమిని ఓ పాఠంగా మలుచుకుని విజయమే లక్ష్యంగా కౌసల్య ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఒక్క విజయమూ తన ఖాతాలో వేసుకోని భాజపా ఎలాగైనా ఈ పీఠం అధిష్ఠించాలని, కాళీరామ్ గెలుపు కోసం ప్రణాళికలు రచిస్తోంది. వీరితోపాటు మరో ఏడుగురు పోటీ పడుతున్నారు. స్వతంత్రులు రఘుమణి గమాంగ్, లాసు హంతల్, అవినాష్ గమాంగ్, ప్రకాష్ హికాక (కమ్యూనిస్టు పార్టీ), దామిని మాఝి (బీఎస్పీ), సంతోష్కుమార్ బిడిక (రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా), ప్రమీలా పూజారి (సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా) బరిలో ఉన్నారు. ఇందులో అవినాష్ కాంగ్రెస్ తిరుగుబాటుదారుడు కావడంతో కాంగ్రెస్కు తలనొప్పి వ్యవహారంగా మారింది. ఓట్లు చీలే అవకాశం లేకపోలేదు. పదిమంది అభ్యర్థులు బరిలో ఉన్నా, ప్రధాన పార్టీల మధ్యే తీవ్ర పోటీ ఉంటుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నలుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్
[ 19-05-2024]
రాయగడ జిల్లా కాసిపూర్ సమితి పరిధిలో విద్యార్థుల మృతి ఘటనలకు సంబంధించి నలుగురు ఉపాధ్యాయులను విధుల నుంచి సస్పెండ్ చేశారు. -
పాతకక్షలతో దాడి.. చికిత్స పొందుతూ యువకుడి మృతి
[ 19-05-2024]
పాతకక్షల నేపథ్యంలో తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
కమలమా.. శంఖమా ?
[ 19-05-2024]
పశ్చిమ ఒడిశాలోని బరగఢ్ లోక్సభ స్థానంలో ఎన్నికల వేడి పెరిగింది. భాజపా, బిజద అభ్యర్థుల మధ్య ముఖాముఖి పోరు నువ్వా? నేనా? అన్న రీతిలో సాగుతోంది. -
రెండోవిడత ప్రచారానికి తెర
[ 19-05-2024]
అస్కా, కొంధమాల్, బొలంగీర్, బరగఢ్, సుందర్గఢ్ లోక్సభ స్థానాలు, వాటి పరిధుల్లో 35 అసెంబ్లీ సెగ్మెంట్లలో సోమవారం (20న) రెండోవిడత పోలింగ్ జరగనుంది -
చివరి రోజు ముమ్మరంగా ప్రచారం
[ 19-05-2024]
గంజాం జిల్లా అస్కా లోక్సభ నియోజకవర్గం, దాని పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారానికి శనివారం చివరి రోజు కావడంతో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు -
ఈసారి కాంగ్రెస్కు అనుకూల ఫలితాలు: సచిన్ పైలెట్
[ 19-05-2024]
ఈసారి దేశంలో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధిస్తుందన్న ఆశాభావంతో ఉన్నామని ఆ పార్టీ నేత సచిన్ పైలెట్ చెప్పారు. -
ప్రజాహితం కోరే సీఎం అవసరం: భజన్లాల్
[ 19-05-2024]
ఒడిశా ప్రజల హితం కోరే సీఎం రాష్ట్రానికి అవసరమని, నవీన్ ఔట్సోర్సింగ్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్శర్మ చెప్పారు. -
డబుల్ ఇంజిన్ పాలనతో రాష్ట్ర ప్రగతి: అశ్వినీ
[ 19-05-2024]
డబుల్ ఇంజిన్ పాలనతో రాష్ట్ర ప్రగతి తథ్యమని, ప్రధాని మోదీ హయాంలో భారత్ అన్ని రంగాల్లో ముందంజ వేసినట్లు రైల్వే, కమ్యూనికేషన్, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. -
పంటను కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులదే
[ 19-05-2024]
ఆరుగాలం శ్రమించి పండించిన పంటను విక్రయించేంతవరకు కాపాడుకోవాల్సిన బాధ్యత రైతన్నలదేనని సహకార సంఘం డిప్యూటీ డైరెక్టర్ మన్మధకుమార్ దాస్ అన్నారు. -
బిజద పక్షానే రాష్ట్ర ప్రజలు: సీఎం
[ 19-05-2024]
ఒడిశాలో ఎన్నికల ప్రచారం చేస్తున్న భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలపై ముఖ్యమంత్రి నవీన్ విమర్శలు గుప్పించారు. -
రాష్ట్రానికి మోదీ, రాజ్నాథ్, అమిత్షాల రాక
[ 19-05-2024]
ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం రాత్రి భువనేశ్వర్ చేరుకోనున్నారు. 9 గంటలకు భాజపా అగ్రనేతలతో ఎన్నికల ప్రచార వ్యూహం, ఏర్పాట్లు పర్యవేక్షిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ కేబినెట్ భేటి.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ
-
అందుకే భారత్తో వాణిజ్య బంధం తెగిపోయింది: పాక్
-
పట్టభద్రులారా ఆలోచించి ఓటు వేయండి: కేటీఆర్
-
ఎంపీగా గెలిస్తే.. బాలీవుడ్ను వీడుతారా? కంగనా ఏం చెప్పారంటే..
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!