బ్రహ్మపురలో బహుముఖ పోటీ
రాష్ట్రంలో ప్రధాన వాణిజ్య, విద్యా కేంద్రమైన బ్రహ్మపుర అసెంబ్లీ నియోజకవర్గం కీలకమైనది.
బ్రహ్మపుర నగరం, న్యూస్టుడే: రాష్ట్రంలో ప్రధాన వాణిజ్య, విద్యా కేంద్రమైన బ్రహ్మపుర అసెంబ్లీ నియోజకవర్గం కీలకమైనది. కేవలం పట్టణ ఓటర్లున్న ఈ సెగ్మెంట్ గతంలో కాంగ్రెస్కు కంచుకోటగా ఉండేది. తర్వాత జనతాదళ్, అనంతరం 2000 నుంచి 2019 వరకూ వరుసగా బిజద గెలుస్తూ వస్తున్నాయి. బ్రహ్మపుర అసెంబ్లీ నియోజకవర్గం బిజదకు కంచుకోటగా మారింది. మరోవైపు బ్రహ్మపుర లోక్సభ పరిధిలోని కొణిసి వద్ద సోమవారం ప్రధాని మోదీ విజయ సంకల్ప సమావేశంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆయన బ్రహ్మపుర నగరం ప్రధాన వాణిజ్య కేంద్రమని, పట్టు నగరమని పేర్కొన్న సంగతి తెలిసిందే. భాజపాకు అధికారం కట్టబెడితే దీన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంపై విజయం సాధించేందుకు అన్ని పార్టీల నాయకులు ప్రత్యేక దృష్టిపెట్టారు.
స్వతంత్రుల పోరు
బ్రహ్మపుర మున్సిపల్ కార్పొరేషన్ (బీఈఎంసీ) పరిధిలో మొత్తం 42 వార్డులున్నాయి. బ్రహ్మపుర అసెంబ్లీ సెగ్మెంట్లో 36 వార్డులుండగా, మిగిలినవి గోపాలపూర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తున్నాయి. ఈసారి బ్రహ్మపురలో పోటీకి పదిహేడు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో స్వతంత్రులు ఎక్కువ. బిజద అభ్యర్థిగా ఆ పార్టీ సీనియరు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రమేష్చంద్ర చ్యవుపట్నాయక్ మరోసారి పోటీకి దిగారు. ఇటీవల బిజదను వీడిన యువ నాయకుడు కె.అనిల్కుమార్ భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, న్యాయవాది, రాజకీయ నేపథ్యమున్న దీపక్ పట్నాయక్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. వీరితోపాటు బీఈఎంసీ మాజీ మేయరు శివశంకర్ దాస్ (పింటు దాస్) స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆప్, భారతీయ వికాస్ పరిషత్, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్, బహుజన సమాజ్ పార్టీ, నబ భారత నిర్మాణ సేవా పార్టీ, సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్టు) తదితర పార్టీలతోపాటు పలువురు స్వతంత్రులు పోటీ చేస్తున్నారు. బ్రహ్మపుర అసెంబ్లీ నియోజకవర్గంలో 2,22,749 మంది ఓటర్లు (ఈ ఏడాది మార్చి 17వ తేదీ)న్నారు. వీరిలో 1,10,560 మంది పురుషులు, 1,12,121 మంది మహిళా ఓటర్లు, 68 మంది ట్రాన్స్జెండర్లున్నారు. బిజద, భాజపా, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులతో పోటీగా స్వతంత్ర అభ్యర్థి శిబ శంకర దాస్ (పింటు దాస్) ముమ్మర ప్రచారం చేస్తున్నారు. అన్ని పార్టీల అభ్యర్థులకు స్వతంత్ర అభ్యర్థుల పోరు వెంటాడుతుండగా, బ్రహ్మపుర అసెంబ్లీ సెగ్మెంట్ను దక్కించుకునేదెవరన్నది వేచి చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిడుగు పడి మహిళ మృతి
[ 20-05-2024]
రాయగడ జిల్లా కాసిపూర్ సమితి సనమతికొన గ్రామంలో సోమవారం సాయంత్రం పిడుగు పడి మహిళ మృతి చెందింది. -
లారీ ఢీకొని ఇద్దరి మృతి
[ 20-05-2024]
గంజాం జిల్లా ఛమ్మాఖండి ఠాణా పరిధిలోని టాటా ప్లాంట్ సమీపంలో 16వ నెంబరు జాతీయ రహదారిపై సోమవారం బైకును ఒక లారీ ఢీకొంది. -
రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
[ 20-05-2024]
ఢంహరీత ధివల ప్రసాంది రాగా పరిధిలోని దింగురా జియన్ వద్ద పల్సర్ బైకును లారీ ఢీకొట్టింది. -
నోట్ల కట్టలతో బ్యాగు కలకలం
[ 20-05-2024]
నోట్ల కట్టలతో ఒక బ్యాగు లభించడం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖరగ్పూర్ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఓ హోటల్ గదిలో ఓ కేసుకు సంబంధించిన వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎన్నికలు బహిష్కరించిన గుడియాపట్నా గ్రామస్థులు
[ 20-05-2024]
ఒడిశాలోని గంజాం జిల్లా కన్నొకెముండి అసెంబ్లీ నియోజవర్గం పరిధిలోని గుడియా పట్నా గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు. -
చెట్టును ఢీకొట్టిన మినీ ట్రక్.. డ్రైవర్ మృతి
[ 20-05-2024]
ఒడిశాలోని కొరాపుట్ జిల్లా పొట్టంగి సమీపంలోని పుకిలి కూడలి వద్ద ఓ మినీ ట్రక్ అదుపుతప్పి చెట్టు ను ఢీకొట్టింది. -
రెండో విడత పోలింగ్.. ప్రిసైడింగ్ అధికారిణికి అస్వస్థత
[ 20-05-2024]
ఒడిశాలో రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. సుందర్గఢ్ జిల్లాలోని 211వ పోలింగ్కేంద్రంలో ప్రిసైడింగ్ అధికారిణి అస్వస్థతకు గురై కింద పడిపోయారు. -
నేడు రెండో విడత పోలింగ్
[ 20-05-2024]
రాష్ట్రంలో సోమవారం రెండోవిడత పోలింగ్ నిర్వహించనున్నారు. అస్కా, కొంధమాల్, బొలంగీర్, బరగఢ్, సుందర్గఢ్ లోక్సభ స్థానాలు, వాటి పరిధుల్లోని 35 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరగనుంది. -
33 వేల మంది పోలీసులతో బందోబస్తు
[ 20-05-2024]
రాష్ట్రంలో రెండోవిడత పోలింగ్ నేపథ్యంలో 33 వేల మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని, ఈ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ అరుణ్ షడంగి చెప్పారు. -
రాష్ట్రాభివృద్ధే మా అజెండా: నవీన్
[ 20-05-2024]
రాష్ట్రాభివృద్ధే అజెండాగా తాము ముందుకెళుతున్నామని, విపక్షాల మాదిరిగా ఆడి తప్పబోమని, చెప్పింది చేస్తున్నామని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వివరించారు. -
ప్రజాశీస్సులు భాజపాకే ఉన్నాయి: ధర్మేంద్ర
[ 20-05-2024]
ఎన్నికల ధర్మయుద్ధంలో విజయావకాశాలు భాజపాకే ఉన్నాయని, అన్ని చోట్లా ప్రజలు ఆశీర్వదిస్తున్నారని కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్ చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ రాక నేపథ్యంలో ముందుగా శనివారం రాత్రి భువనేశ్వర్లోని పార్టీ కార్యాలయంలో కార్యవర్గ ప్రతినిధుల సమావేశం జరిగింది. -
చారిత్రక నగరం.. ఎవరికి అందేనో విజయం?
[ 20-05-2024]
చారిత్రక నగరం కటక్ ఈసారి ఎవరి సొంతమవుతుంది? ఓటర్లు ఎవర్ని ఆదరిస్తారు?.. ఇద్దరు ఉద్ధండులు నువ్వా? నేనా? అన్న రీతిలో తల పడుతున్నారు. విజ్ఞతకు నిలువుటద్దమైన ప్రజల తీర్పు ఈసారి ఎలా ఉంటుందన్నదిప్పుడు చర్చనీయాంశమైంది. -
మీ ముద్దు బిడ్డ దేశం గర్వించదగ్గ యువనేత
[ 20-05-2024]
ఈ రాష్ట్రానికి చెందిన మీ ముద్దుబిడ్డ దేశం గర్వించదగిన నేతగా ఎదిగారని, తన సామర్థ్యం నిరూపించుకున్నారని, ఆయన పనితీరు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను ప్రశంసించారు. -
సమీర్ రాజీనామా...
[ 20-05-2024]
పూరీ జిల్లాకు చెందిన బిజద అగ్రనేత, విద్యాశాఖ మాజీ మంత్రి సమీర్ రంజన్ దాస్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆదివారం ఉదయం బిజద ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ముఖ్యమంత్రి నవీన్కు లేఖ పంపించారు. -
నేడు పూరీలో మోదీ రోడ్షో
[ 20-05-2024]
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం 7 గంటలకు భువనేశ్వర్ నుంచి పూరీకి వస్తారు. తాలబణియా తాత్కాలిక హెలిప్యాడ్లో దిగనున్న ఆయన నేరుగా శ్రీక్షేత్రానికి చేరుకుని జగన్నాథుని సన్నిధిలో పూజలు చేస్తారు. -
నలుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్
[ 20-05-2024]
నలుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి బసంత కుమార్ నాయక్ ఓ ప్రకటనలో ఆదివారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నలుగురు ఐసీస్ అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల
-
ప్రశాంతమైన పల్నాడుని వల్లకాడు చేశారు: ధూళిపాళ్ల
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నానికి కౌంట్డౌన్ షురూ..: ప్రధాని మోదీ