logo

ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య

నవరంగ్‌పూర్‌ జిల్లా ఉమా మార్కెట్ సమితి చికిలిపోదర పంచాయతీలో ఓ యువకుడు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Published : 10 May 2024 16:33 IST

నవరంగ్‌పూర్: నవరంగ్‌పూర్‌ జిల్లా ఉమా మార్కెట్ సమితి చికిలిపోదర పంచాయతీలో ఓ యువకుడు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అధికారి గుండ గ్రామానికి చెందిన లక్కీధర్ మంతి (25) గురువారం రాత్రి భోజనం చేసి నిద్రించేందుకు స్నేహితుడికి ఇంటి వెళ్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. శుక్రవారం ఉదయం గ్రామ శివారులో చింత చెట్టుకు వేలాడుతూ కనిపించటంతో స్థానికులు పోలిసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందజేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని