logo

Andhra News: ఇంటికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు చోరీ

పాలకొండ ఆర్టీసీ డిపోనకు చెందిన స్టూడెంట్స్‌ బస్సు సోమవారం అర్ధరాత్రి చోరీకి గురవడంతో ఉత్కంఠ నెలకొంది. సోమవారం రాత్రి రాజాం నుంచి వంగర వచ్చి విద్యార్థులను దింపేసిన తరువాత బస్సును డ్రైవర్‌ పి.బుజ్జి వంగర పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా నిలిపారు.

Updated : 10 Aug 2022 07:21 IST

వాహనాన్ని పరిశీలిస్తున్న అధికారులు

వంగర, న్యూస్‌టుడే: పాలకొండ ఆర్టీసీ డిపోకు చెందిన స్టూడెంట్స్‌ బస్సు సోమవారం అర్ధరాత్రి చోరీకి గురవడంతో ఉత్కంఠ నెలకొంది. సోమవారం రాత్రి రాజాం నుంచి వంగర వచ్చి విద్యార్థులను దింపేసిన తరువాత బస్సును డ్రైవర్‌ పి.బుజ్జి వంగర పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా నిలిపారు. ఉదయం నాలుగు గంటల సమయంలో కనిపించకపోవడంతో సహచరుల సహాయంతో గ్రామంలో వెతికారు. అనంతరం వంగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సమాచారాన్ని పాలకొండ ఆర్టీసీ డిపో మేనేజర్‌ వెంకటేశ్వరరావుతో పాటు డిపో సీఐ లక్ష్మణరావుకు తెలియజేయడంతో వారు వంగర పోలీస్‌ స్టేషన్‌కు మంగళవారం వెళ్లారు. కొన్ని గంటల తరువాత రేగిడి ఆమదాలవలస మండలం మీసాల డోలపేట సమీపంలో ఉన్నట్లు తెలుసుకొని వంగర పోలీసులతో రాజాం సీఐ కె.రవికుమార్‌, ఆర్టీసీ అధికారులు చేరుకున్నారు. వేలిముద్రల సేకరణ అనంతరం బస్సును వంగర ఠాణాకు తీసుకువచ్చారు. అనుమానితులను రాజాం పోలీస్‌ స్టేషన్‌లో విచారించారు. పొందూరు మండలం గోకర్ణపల్లికి చెందిన చౌదరి సురేష్‌ మద్యం తాగి సోమవారం రాత్రి సదరు బస్సులో వంగర చేరుకుని.. తిరిగి ఇంటికి వెళ్లడానికి అదే వాహనాన్ని తీసుకువెళ్లినట్లు పోలీసుల ముందు నిందితుడు ఒప్పుకొన్నాడు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ కె.రవికుమార్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని