Crime News: అడవి పందిగా భావించి..నాటు తుపాకీతో కాల్చి?
ఎస్.కోట మండలంలోని కొత్త అడ్డతీగ గ్రామంలో గిరిజనుడి హత్య కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. నాటు తుపాకీతో కాల్పులే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. గురువారం మధ్యాహ్నం గ్రామానికి చెందిన పాంగి అర్జున్ (35) తుప్పల్లో పుట్టగొడుగులు ఏరుతుండగా అడవి పందిగా భావించి వేటగాళ్లు కాల్చినట్లు సమాచారం.
గిరిజనుడి హత్య కేసులో కొత్తకోణం
అర్జున్ (పాతచిత్రం)
శృంగవరపుకోట, న్యూస్టుడే: ఎస్.కోట మండలంలోని కొత్త అడ్డతీగ గ్రామంలో గిరిజనుడి హత్య కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. నాటు తుపాకీతో కాల్పులే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. గురువారం మధ్యాహ్నం గ్రామానికి చెందిన పాంగి అర్జున్ (35) తుప్పల్లో పుట్టగొడుగులు ఏరుతుండగా అడవి పందిగా భావించి వేటగాళ్లు కాల్చినట్లు సమాచారం. పొట్టభాగంలో గుండు తగిలి తీవ్ర రక్తస్రావం కావడంతో చనిపోయినట్లు భావించి భయంతో పారిపోయారు. కొన ఊపిరితో ఉన్న బాధితుడు నెమ్మదిగా పాకుతూ కొంత దూరం వచ్చి పడిపోయాడు. ఆ దారిన వెళ్లేవారు గమనించి సమాచారం అందించగా ఇతన్ని 108 అంబులెన్సులో తరలించేలోగా మృతి చెందాడు. ఈ ప్రాంతంలో కొత్త అడ్డతీగ, కరకవాని జోరు, దెప్పూరు గ్రామాలకు చెందిన కొందరు నాటు తుపాకులతో అడవి పందులు, కుందేళ్లు, కొండ మేకలు తదితరాలను వేటాడుతుంటారు. అయితే పగటిపూట జంతువును చూడకుండా ఎలా కాల్చారన్న దానిపై చర్చ సాగుతోంది. ఈ కేసులో పోలీసులు ఏమీ చెప్పడం లేదు. శనివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తామని చెబుతున్నారు. ఇప్పటి వరకు 12 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు, రెండు నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. విజయనగరం డీఎస్పీ ఆర్.గోవిందరావు, ఇన్ఛార్జి సీఐ చంద్రశేఖర్ ఎస్.కోటలో ఉండి కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు ఇక్కడికి చేరుకున్నారు. భార్య కాంతం తెలుగు సరిగా మాట్లాడలేకపోతోంది. ప్రస్తుతం ఈమె గర్భిణి. రెండేళ్ల కుమార్తె శ్రావణిని ఎత్తుకున్న ఆమెను చూసి, స్థానికులు కంటతడి పెట్టారు.
రోదిస్తున్న కుటుంబ సభ్యులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిబంధనలు తొక్కి‘పెట్టే’శారు
[ 18-05-2024]
విజయనగరం అర్బన్, గ్రామీణం: గురువారం మధ్యాహ్నం 3 గంటలు.. విజయనగరం తహసీల్దారు కార్యాలయం.. ఈ ఎన్నికల్లో నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఆఫీసు. ఇక్కడే పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్రూమ్ ఉంది. -
ప్రజలకు అందుబాటులో ఉంటాం
[ 18-05-2024]
కూటమిదే విజయమని, నియోజకవర్గ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని కురుపాం కూటమి అభ్యర్థిని తోయక జగదీశ్వరి అన్నారు. -
19 నుంచి తోటపల్లిలో కల్యాణ వేడుకలు
[ 18-05-2024]
తోటపల్లి వేంకటేశ్వర కోదండ రామాలయం దేవస్థానంలో ఈ నెల 19 నుంచి 23 వరకు సీతారామస్వామి వార్షిక కల్యాణ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈవో వి.వి.సూర్యనారాయణ తెలిపారు. -
ఏటా రూ.కోట్లు.. పనులకు తూట్లు
[ 18-05-2024]
సాలూరు పట్టణంలోని గాంధీనగర్ నుంచి కొంకివీధి, వేదసమాజం, నాయుడువీధి, శివాజీ, బోసుబొమ్మ కూడలి వరకు ఉండే వన్వే దారి ఇది. అడుగడుగునా గుంతలతో అధ్వానంగా మారింది. -
ఇదే.. సాలూరు స్మార్ట్ టౌన్షిప్
[ 18-05-2024]
జగనన్న స్మార్ట్ టౌన్షిప్లో మధ్య ఆదాయ వర్గాలు, ఉద్యోగులు, ప్రభుత్వ పింఛనుదారులకు తక్కువ ధరకే ఇళ్ల స్థలాలను ప్రభుత్వం సాలూరులో పట్టణ జాతీయ రహదారి పక్కన కేటాయించింది -
ఆందోళనకు గురువులు సిద్ధం
[ 18-05-2024]
పోలింగ్ విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సంఘాలు ఆందోళనకు సిద్ధమయ్యాయి. -
రాష్ట్రంలో ఈవీఎంలకు భద్రత లేదు
[ 18-05-2024]
రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, దౌర్జన్యకాండను దృష్టిలో ఉంచుకొని ఓట్ల లెక్కింపు రోజున ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ డిమాండు చేశారు. -
బొగ్గు వ్యాగన్ నుంచి పొగలు
[ 18-05-2024]
ఆగి ఉన్న గూడ్స్ రైలు నుంచి పొగలు రావడంతో రైల్వే సిబ్బంది అప్రమత్తమై ప్రమాదాన్ని నిలువరించిన సంఘటన శుక్రవారం గజపతినగరం రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది -
చిరుధాన్యాల సరస్వతికి జాతీయస్థాయి గుర్తింపు
[ 18-05-2024]
సబల స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి, చిరుధాన్యాల చెల్లెళ్ల సంఘం వ్యవస్థాపకురాలు మల్లువలస సరస్వతికి జాతీయస్థాయి గుర్తింపు దక్కింది. -
కన్నీటి సంద్రం
[ 18-05-2024]
ఉమ్మడి జిల్లాలో శుక్రవారం జరిగిన వివిధ ఘటనల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. గజపతినగరం, జియ్యమ్మవలస, బొండపల్లి మండలాల్లో రోడ్డు ప్రమాదాల కారణంగా ముగ్గురు మృత్యువాత పడ్డారు. -
దిబ్బలపాలెంలో పులి సంచారం..?
[ 18-05-2024]
భోగాపురం మండలంలోని దిబ్బలపాలెం, కవులవాడ పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ప్చ్..ఇదేం నిర్వహణ?
[ 18-05-2024]
ఉమ్మడి జిల్లాలోని నగరపాలక సంస్థ, పురపాలక, నగర పంచాయతీల్లో కాలువల తీరు ఆందోళన కలిగిస్తోంది. నిర్వహణ, పారిశుద్ధ్య పనులకు ఏటా రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నా పరిస్థితి మారడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం: జీవన్రెడ్డి
-
స్వాతి మాలీవాల్పై దాడి ఘటన.. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ అరెస్ట్
-
మళ్లీ ట్రెండింగ్లోకి రాజమౌళి - మహేశ్ల ప్రాజెక్ట్.. కారణమిదే!
-
23 వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
-
ఐదేళ్లుగా పవిత్రతో నా భర్త సహజీవనం: చందు భార్య శిల్ప
-
బెంగళూరు-చెన్నై కీలక పోరు.. వాతావరణ పరిస్థితి ఎలా ఉండనుందంటే?