logo

చేనేత కార్మికులకు తెదేపాతోనే భవిత

చేనేత కార్మిక కుటుంబాలకు కూటమి అండగా ఉంటుందని రాజాం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్‌ అన్నారు. పట్టణానికి చెందిన చేనేత కార్మికుల నాయకుడు నల్లశ్రీను ఆధ్వర్యంలో లచ్చయ్యపేట,

Published : 06 May 2024 03:13 IST

వైకాపా నుంచి 200 కుటుంబాల చేరిక

కోండ్రు సమక్షంలో తెదేపాలోకి చేరిన చేనేత కార్మికులు

రాజాం గ్రామీణం, న్యూస్‌టుడే: చేనేత కార్మిక కుటుంబాలకు కూటమి అండగా ఉంటుందని రాజాం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్‌ అన్నారు. పట్టణానికి చెందిన చేనేత కార్మికుల నాయకుడు నల్లశ్రీను ఆధ్వర్యంలో లచ్చయ్యపేట, కాకర్లవీధి, మల్లికార్జున కాలనీలకు చెందిన 200 కుటుంబాలు వైకాపా నుంచి  తెదేపాలోకి చేరాయి. వీరికి కోండ్రు మురళీమోహన్‌ పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం చేనేత కుటుంబాలకు అండగా ఉంటుందని తెలిపారు. తెదేపా పట్టణ అధ్యక్షుడు నంది  సూర్యప్రకాశ్‌, పొట్టా చిట్టిబాబు, గురవాన నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని