logo

మనస్తాపంతో వృద్ధుడి బలవన్మరణం

భార్య మృతిచెందిందన్న మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన భోగాపురం మండలంలోని దల్లిపేట గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.

Published : 09 May 2024 03:13 IST

భోగాపురం, న్యూస్‌టుడే: భార్య మృతిచెందిందన్న మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన భోగాపురం మండలంలోని దల్లిపేట గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన దల్లి అప్పలనాయుడు(65) కూలి పనులు చేస్తుంటారు. పిల్లలు పట్టణాలకు వెళ్లారు. అతని భార్య 11 నెలల క్రితం మృతిచెందింది. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపానికి గురై మద్యానికి బానిసయ్యాడు. ఈయన బాగోగులు అక్క వెంపాడ నర్సయ్యమ్మ చూస్తూ ఉండేది. మంగళవారం ఉదయం టీ ఇచ్చేందుకు ఇంట్లోకి వెళ్లి ఆమె చూడగా నోటి నుంచి నురగ రావడాన్ని గమనించి స్థానికుల సాయంతో సుందరపేట పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి నుంచి జిల్లా కేంద్రాసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందారు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సూర్యకుమారి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు