యువతా మేలుకో.. భవిత మార్చుకో!
ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది! ఇది నిజమో కాదో.. కాసేపు పక్కన పెడితే.. మరో అయిదు రోజుల్లో మీరు వేసే రెండు ఓట్లు మాత్రం మీ జీవితాలను మార్చుతాయి. చీకట్లను తరిమేసి వెలుగుల మయం చేస్తాయి.
కారు చీకట్లలో కాంతిపుంజంలా ఎన్డీయే హామీలు
లక్షల ఉద్యోగాలతో నిరుద్యోగులకు ఊరట
మెగా డీఎస్సీతో భావి గురువుల జీవిత కల సాకారం
వాలంటీర్లకు రెట్టింపు జీతాలతో గౌరవం
న్యూస్టుడే- రాజాం
ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది! ఇది నిజమో కాదో.. కాసేపు పక్కన పెడితే.. మరో అయిదు రోజుల్లో మీరు వేసే రెండు ఓట్లు మాత్రం మీ జీవితాలను మార్చుతాయి. చీకట్లను తరిమేసి వెలుగుల మయం చేస్తాయి. ఏళ్లుగా ఎదురుచూస్తున్న కలలను సాకారం చేస్తాయి. యువత తన కాళ్లపై తాము నిలబడేలా తీర్చిదిద్దుతాయి. మెరుగైన జీవితానికి బాటలు వేస్తాయి. గడిచిన అయిదేళ్లలో యువత, నిరుద్యోగులను వైకాపా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యానికి గురిచేసింది. ఉద్యోగాలు, ఉపాధి కల్పించకుండా వీరిని రోడ్డున పడేసింది. ఈ కారు చీకట్లో కాంతిపుంజంలా కూటమి ప్రకటించిన మేనిఫెస్టో వీరికి కొండంత ధైర్యాన్ని ఇస్తోంది. వీరు అధికారంలోకి వస్తే అయిదేళ్ల నిర్లిప్తత, నిరీక్షణకు తెరపడుతుంది. యువత చేయాల్సిందల్లా సరైన నిర్ణయంతో ఈవీఎంల్లో రెండు మీట్లను నొక్కి ఓటేయడమే. దీన్ని కాదని ప్రలోభాలకో, పచ్చనోటుకో, కులానికో, మతానికో సాగిలపడి తప్పు చేస్తే మరో అయిదేళ్లు శిక్ష అనుభవించేందుకు బాటలు వేసుకున్నట్లే!
20 లక్షల ఉద్యోగాలు
తెదేపా కూటమి అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించారు. ఉద్యోగం వచ్చే వరకూ నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. చదువుకున్న నిరుద్యోగ యువతకు ఇది సువర్ణవకాశం. అందుకే తెదేపా శ్రేణులు ‘జాబు రావాలంటే.. బాబు రావాలని’ దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత అయిదేళ్లలో వీరికి దక్కిన ఉద్యోగాలు పెద్దగా ఏమీ లేవు. ఉన్నత చదువులు చదివిన వారు సైతం వారి స్థాయికి తగిన ఉద్యోగాలు లభ్యం కాక చిన్నా, చితకా ఉద్యోగాల కోసం పాకులాడి నిరుత్సాహానికి గురవుతున్నారు. సచివాలయాల ఉద్యోగాల పేరుతో వైకాపా డప్పుకొట్టుకోవడం తప్ప కొత్తగా ఒరిగిందేమీ లేదు. వీరిని సకాలంలో రెగ్యులర్ చేయకపోగా అవస్థలకు గురిచేస్తూ వచ్చారు. ఇదేదో గొప్పగా ప్రచారం చేసుకుని ఓట్లు కొల్లగొట్టేందుకు వైకాపా నాయకులు ఊదరగొడుతుండటాన్ని యువత గమనిస్తోంది. మరి మిగిలినవారి పరిస్థితి ఏమిటనేదానికి అధికార పార్టీ నాయకుల నుంచి మౌనమే సమాధానం అవుతోంది. యువత, నిరుద్యోగులు సరైన నిర్ణయం తీసుకోవాల్సిన తరుణమిది. దీనికి భిన్నంగా వ్యవహరించి ఓటేస్తే బతుకు బస్టాండవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
- ఒక్క విజయనగరం జిల్లాలోనే 18-39 ఏళ్ల వయసున్న వారు 7,03,380 మంది ఉన్నారు. వీరిలో 18-19 వయసు వారు 39,612 కాగా 20-29 వయసున్న వారు 2,45,813 మంది ఉన్నారు. లక్షల మంది యువత ఉద్యోగాలు కోసం నిరీక్షిస్తుంటే ఈ అయిదేళ్లలో విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో కలిపి సచివాలయాల్లో 16,322 మందిని ఎంపిక చేశారు. ఇవన్నీ చిరుద్యోగాలే.
వాలంటీర్లకు రూ.10 వేలు
విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 1,085 సచివాలయాల పరిధిలో 16,125 మంది వాలంటీర్లు పనిచేస్తూ వచ్చారు. సేవా దృక్పథంతో పనిచేయాలనే షరతుతో వీరిని ఎంపిక చేశారు. ఇంజినీరింగ్ వంటి ఉన్నత చదువుల్లో డిగ్రీలు సాధించిన వారు సైతం వాలంటీర్ల పోస్టుల కోసం దరఖాస్తులు చేసుకుని ఎంపికయ్యారు. నెలంతా ప్రభుత్వం చెప్పిన పనులన్నీ చేస్తే వీరికి ఇస్తున్న గౌరవ వేతనం కేవలం రూ.5 వేలు. అంటే రోజుకు సగటున రూ.166. ఉపాధి పనులకు వెళ్తున్న నిరక్షరాస్యులు సైతం రూ.250-300 తెచ్చుకుంటున్నారు. పనులు దొరికితే భవన నిర్మాణ కార్మికులకు రూ.500-650 గిట్టుబాటు అవుతోంది. చదువుకున్న యువతను మాత్రం వాలంటీర్లుగా నియమించి ఊహల్లో తిప్పుతూ వారి జీవితాలను నాశనం చేసి పార్టీ బలోపేతానికి జగన్ వినియోగించుకుంటూ వచ్చారు. ఇప్పుడు వీరితో రాజీనామాలు చేయించి ఎన్నికల్లో తురుపు ముక్కలుగా ప్రయోగిస్తున్నారు. వీరంతా విజ్ఞతతో వ్యవహరించి రాజకీయాలకు దూరంగా ఉండి పోలింగ్ రోజున సరైన నిర్ణయం తీసుకుంటే జీవితాలను వారికి వారే చక్కదిద్దుకున్న వారవుతారు.
- వాలంటీర్ల అవస్థలను గుర్తించిన కూటమి గౌరవ వేతనాలను రెట్టింపు చేస్తూ నెలకు రూ.10 వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇటీవల వరకూ రెండు జిల్లాల్లో నెలకు వీరికి రూ.8.06 కోట్లు అందుతుండగా కూటమి అధికారంలోకి వస్తే రూ.16.12 కోట్లు నెలకు వేతనాల రూపంలో అందుతాయి. వీరిలో నైపుణ్యాలకు పదును పెట్టి లక్షాధికారులను చేయాలని చంద్రబాబు పరితపిస్తున్నారు.
మెగా డీఎస్సీ
ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని అధికారంలోకి వచ్చిన జగన్ అయిదేళ్లలో ఆ విషయాన్నే విస్మరించారు. ఉమ్మడి జిల్లాలో హేతుబద్ధీకరణకు ముందు 9,800 పోస్టులను చూపగా, తరువాత ఈ సంఖ్య 8,082కు పడిపోయింది. తీరా ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయ లబ్ధి కోసం ఆదరాబాదరాగా జగన్ డీఎస్సీ ప్రకటించారు. ఉన్న పోస్టులను తగ్గించి చూపి ప్రకటించడంతో అభ్యర్థుల్లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఎన్నికల ముందు ఆడిన రాజకీయ క్రీడకు ఎన్నికల సంఘం అడ్డుకట్ట వేయడంతో ప్రక్రియ నిలిచిపోయింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మెగా డీఎస్సీతో వేల మందికి మేలు కలగనుందనే అభిప్రాయం శిక్షణ పొందిన నిరుద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
- తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక తొలి సంతకం మెగా డీఎస్సీపైనే అని ఇప్పటికే మేనిఫెస్టోలో ప్రకటించారు. ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న వేలాది మంది భావి గురువులకు ఇది సంజీవనిలా నిలవనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజల గొంతులో గరళం!
[ 20-05-2024]
ఉమ్మడి జిల్లాలోని పుర, నగర పాలక, నగర పంచాయతీల ప్రజలకు స్వచ్ఛజలం అందడం లేదు. చాలా చోట్ల రంగుమారి.. మురుగు వాసన, నలకలతో సరఫరా అవుతోంది. తాగునీటి పథకాలను, రిజర్వాయర్లను శుభ్రం చేయకపోవడం, -
ముంచెత్తిన వర్షం
[ 20-05-2024]
పార్వతీపురంలో భారీ వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. శనివారం రాత్రి నుంచి ఏకధాటిగా నాలుగు గంటల పాటు ఉరుములు, పిడుగులతో ఎడతెరిపి లేకుండా పడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. -
కాలువలకు గండ్లు.. రైతులకు కడగండ్లు
[ 20-05-2024]
ఏటా వర్షాభావంతో కరవు దోబూచులాడుతోంది. ప్రకృతిసిద్ధంగా వనరులు అపారంగా ఉన్నా.. సాగుజలం వట్టిమాటే అవుతోంది. ఓ వైపు ఖరీఫ్ ముంచుకొస్తున్నా.. ప్రాజెక్టుల ఆధునికీకరణపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. -
నాలుగేళ్లయినా బాలారిష్టాలే!
[ 20-05-2024]
ఉత్తరాంధ్రకు సంబంధించి గరివిడిలో ఏర్పాటైన పశు వైద్య (వెటర్నరీ సైన్స్) కళాశాల వైకాపా పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా సమస్యలతో మూలుగుతోంది. కళాశాలను ప్రారంభించి నాలుగేళ్లు కావస్తున్నా.. -
వారధి కిందే అక్రమ తవ్వకాలు
[ 20-05-2024]
ఎన్నికల అనంతరం అధికార యంత్రాంగంలో నెలకొన్న స్తబ్ధతను సైతం అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. సంతకవిటి మండలం రంగరాయపురం సమీపంలోని నాగావళి నదిపై ఉన్న వంతెన కాంక్రీటు పిల్లర్ల వద్ద యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నారు. -
కేజీబీవీల్లో అక్రమాలు..!
[ 20-05-2024]
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో(కేజీబీవీలు) అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. ప్రభుత్వ నిధులు సైతం దుర్వినియోగం అవుతున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తేల్చింది. -
ఆయకట్టు ఆయువు తీసేశారు
[ 20-05-2024]
అధికారికంగా 2,200 ఎకరాల ఆయకట్టు.. అనధికారికంగా మరో 500 ఎకరాలు.. వందలాది మంది రైతులకు ప్రధాన నీటి వనరు.. 40కు పైగా చెరువులకు దిక్కైన ఎస్.కోట మండలంలోని చిలకలగెడ్డ ఆనకట్ట పాలకుల తీరుతో నేడు అధ్వాన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. -
పట్టాలిచ్చినా ప్రయోజనం శూన్యం
[ 20-05-2024]
విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని పేద, మధ్యతరగతి ప్రజలకు గ్రామీణ మండలంలోని కొండకరకం సమీపంలోని ఓ కొండపై జగనన్న కాలనీ ఏర్పాటు చేశారు. ఇక్కడ నాలుగేళ్ల కిందట దాదాపు 2,500 మందికిపైగా లబ్ధిదారులకు పట్టాలిచ్చారు. -
సాగుకు సమాయత్తం
[ 20-05-2024]
తొలకరికి ముందే వరి నాట్లు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈమేరకు విత్తనాలను అందించేందుకు విత్తనాభివృద్ధి సంస్థ సైతం సమయాత్తమవుతోంది. -
నారాయణపురం ఆనకట్ట వెలవెల
[ 20-05-2024]
సంతకవిటి మండలంలోని నాగావళి నదిపై ఉన్న నారాయణపురం ఆనకట్ట ఇది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని 50 వేల ఎకరాలకు సాగునీరుతో పాటు పలు మండలాల ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడంలో ఈ ప్రాజెక్టుది కీలక భూమిక.
తాజా వార్తలు (Latest News)
-
కొనసాగుతోన్న ఐదో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది: ఎన్టీఆర్ గురించి ఈ సంగతులు తెలుసా?
-
మల్లారెడ్డి ఆస్తులపై విచారణ కోరతాం: ప్రభుత్వ విప్ లక్ష్మణ్కుమార్
-
ఒక్కోసారి ‘వన్ పర్సెంట్’ ఛాన్స్ ఉన్నా చాలు..: విరాట్ కోహ్లీ
-
ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
-
రసకందాయంలో పీర్జాదిగూడ రాజకీయం