logo

విశాఖ ఎంపీగా భరత్‌ను గెలిపించండి

విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గం తెదేపా ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన తన భర్త ఎం.శ్రీభరత్‌ను గెలిపించాలంటూ అతని భార్య, నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజశ్విని కోరారు.

Published : 10 May 2024 03:06 IST

లలితకుమారితో కలిసి నందమూరి బాలయ్య కుమార్తె తేజస్విని ప్రచారం

వేపాడ, న్యూస్‌టుడే: విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గం తెదేపా ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన తన భర్త ఎం.శ్రీభరత్‌ను గెలిపించాలంటూ అతని భార్య, నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజశ్విని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె గురువారం ఎస్‌.కోట ఎమ్మెల్యే అభ్యర్థిని కోళ్ల లలితకుమారితో కలిసి వేపాడ మండలంలోని వావిలపాడు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ గుర్తును చూపించి ప్రతి ఒక్కరూ ఎంపీగా తన భర్తను, ఎమ్మెల్యేగా లలిత కుమారిని గెలిపించాలని కోరారు. ప్రజలు ఆమెకు పూలతో స్వాగతం పలికి, హారతులిచ్చారు. కార్యక్రమంలో గోగాడ జగన్నాథం నాయుడు, దేముడునాయుడు, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని