వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం
కూలీలను తీసుకెళ్తున్న డీసీఎం లారీని వేగంగా దూసుకొచ్చిన మినీ వ్యాన్ ఢీకొట్టడంతో మహిళా కూలీ మృతి చెందారు. ఈ సంఘటన మున్సిపాలిటీ పరిధిలో మాచవరం జాతీయ రహదారిపై బుధవారం జరిగింది.
ముగ్గురికి గాయాలు
రోడ్డు పక్కనే పడి పోయిన డీసీఎం లారీ
కనిగిరి, న్యూస్టుడే: కూలీలను తీసుకెళ్తున్న డీసీఎం లారీని వేగంగా దూసుకొచ్చిన మినీ వ్యాన్ ఢీకొట్టడంతో మహిళా కూలీ మృతి చెందారు. ఈ సంఘటన మున్సిపాలిటీ పరిధిలో మాచవరం జాతీయ రహదారిపై బుధవారం జరిగింది. ఎస్ఐ త్యాగరాజు తెలిపిన వివరాల ప్రకారం..మాచవరం నుంచి బేల్దారీ కూలీలను కనిగిరికి డీసీఎం లారీలో తీసుకొస్తున్నారు. మాచవరం వద్ద డీసీఎంను, వేగంగా వచ్చిన మినీ వ్యాన్ ఢీకొట్టింది. ప్రమాద ధాటికి డీసీఎం లారీ రెండు చక్రాలు ఊడిపోగా, వాహనం బోల్తాపడింది. ఈ సంఘటనలో లారీ ముందు భాగంలో కూర్చున్న మాచవరానికి చెందిన ఉప్పు రమాదేవి (51)కి తీవ్ర గాయాలు కాగా, మినీ వ్యాన్ డ్రైవర్ సురేష్కు స్వల్ప గాయాలయ్యాయి. రమాదేవి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను ఒంగోలు తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతి చెందారు. మృతురాలి బంధువులిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వ్యాన్ చోదకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని..
కొనకనమిట్ల: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ ద్విచక్ర వాహన చోదకుడు ప్రాణాలు కోల్పోయారు. 565 జాతీయ రహదారిపై కొనక¢నమిట్ల మండలంలోని పెదారికట్ల గ్రామ సమీపంలో బుధవారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెదారికట్ల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు (32) ద్విచక్ర వాహనంపై చినారికట్ల వెళ్లి అక్కడ పని ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. పెదారికట్ల సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న ఎస్సై మాధవరావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.
మార్కాపురం: పూర్తిగా దెబ్బతిన్న ట్రాలర్ ముందు భాగం
జాతీయ రహదారిపై..
మార్కాపురం: ట్రాలర్, బొలేరో ఢీకొన్న ప్రమాదంలో ఇరు వాహన చోదకులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన బుధవారం అమరావతి- అనంతపురం జాతీయ రహదారిపై నికరంపల్లి వద్ద చోటు చేసుకుంది. మార్కాపురం గ్రామీణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కంభం నుంచి యర్రగొండపాలెం వెళ్తున్న బోలెరో, విజయవాడ నుంచి కడపకు వెళ్తున్న ట్రాలర్ అమరావతి - అనంతపురం జాతీయ రహదారిపై నికరంపల్లి వద్ద ఢీకొన్నాయి. బుధవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో రెండు వాహనాల ముందు భాగాలు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యాయి. వాహన చోదకులిద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఈ ప్రమాదంపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమాత్యుల ‘కొండ’పి.. నేతలకు అడ్డాగా గడ్డ
[ 16-06-2024]
కొండపి.. పొగాకు, శనగ పంటల సాగుకే కాదు.. ఆది నుంచీ రాజకీయ చైతన్యం కలిగిన అసెంబ్లీ నియోజకవర్గం. 1955లో నియోజకవర్గం ఆవిర్భవించింది. ఇక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలువురు అభ్యర్థులు ప్రధాన పార్టీల తరఫున పోటీ చేసి గెలుపొందారు. -
నేలకు దిగొచ్చిన నెత్తికెక్కిన కళ్లు
[ 16-06-2024]
నాయకులు ఆదేశించారని అది ఎంత అడ్డగోలు వ్యవహారమైనా, చట్ట విరుద్ధమైనా నిబంధనలకు పాతరేసి మరీ అధికారులు పాటించారు. ప్రత్యర్థులపై ఎడాపెడా కేసులు కట్టేశారు. కాలు కదిపినా, నోరు మెదిపినా స్టేషన్లలో నిర్భంధించి వేధించారు. -
నాన్న నడిపించి.. జీవితంలో గెలిపించి
[ 16-06-2024]
నాన్న.. మాట కటువు అయినా మనసు మాత్రం వెన్న. ప్రతిక్షణం తన పిల్లల భవిష్యత్తుకే పరితపిస్తుంటాడు. తాను ఏ స్థాయిలో ఉన్నా తనకంటే బిడ్డలు ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటాడు. -
మంత్రి చొరవ బడికి మళ్లీ కళ
[ 16-06-2024]
పాఠశాలల విలీనం పేరుతో వైకాపా ప్రభుత్వం పేద పిల్లల చదువులతో చెలగాటమాడింది. తక్కువ సంఖ్యలో విద్యార్థులున్నారంటూ కొన్నిచోట్ల ఏకంగా బడులను మూసేసింది. -
లంచావతారులు మాకవసరం లేదు
[ 16-06-2024]
‘పనులు చేసేందుకు ప్రజల నుంచి లంచాలు తీసుకునే అధికారులు మాకు అవసరం లేదు. అటువంటి వారు తక్షణమే సెలవు పెట్టి వెళ్లి పోవాలి. లేకుంటే నేనే పంపిస్తా’... -
తెదేపాకు ఓటేశారని కక్ష.. తాగునీరు నిలిపివేత!
[ 16-06-2024]
ఎన్నికలు ముగిశాయి. వైకాపా ఘోర పరాజయం పాలైంది. ప్రజలు తెదేపా కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని కట్టబెట్టారు. ఈ విషయాన్ని కొందరు వైకాపా సానుభూతి ఉద్యోగులు జీర్ణించుకోలేకున్నారు. -
మాలకొండలో ప్రజాప్రతినిధులు
[ 16-06-2024]
పుణ్యక్షేత్రమైన మాలకొండ లక్ష్మీనృసింహస్వామిని కందుకూరు, చీరాల, కనిగిరి ఎమ్మెల్యేలు ఇంటూరి నాగేశ్వరరావు, ఎంఎం.కొండయ్య, ఉగ్రనరసింహారెడ్డి శనివారం దర్శించుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
శ్రీలీల ‘డ్రిప్పిన్’ కల్చర్.. రోజీ చీరలో మంజిమా..
-
కౌంటింగ్ వేళ ఈవీఎం అన్లాక్ ఘటన..ఎంపీ బంధువు అరెస్ట్
-
ఐపీఎస్ అధికారి గరికపాటి బిందు మాధవ్పై సస్పెన్షన్ ఎత్తివేత
-
మార్పొస్తుందని ఆశిస్తున్నా: పవన్ కల్యాణ్పై ఉపేంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు
-
రేణుకాస్వామి హత్య కేసు.. ఆ కారు సీజ్!
-
శ్రీలంక-భారత్ ప్రతిపాదిత రోడ్డు మార్గం.. ద్వీపదేశం ఏమందంటే!