logo

సైకిల్‌.. యమ జోరు

తెదేపాలోకి వలసల జోరు కొనసాగుతోంది. సోమవారం 95 కుటుంబాలు వైకాపా వీడి సైకిలెక్కారు. ముండ్లమూరుకు చెందిన వైకాపా కీలక నేత పార్టీని వీడారు.

Published : 16 Apr 2024 03:53 IST

వైకాపాను వీడిన 215 కుటుంబాలు
వందమంది కార్యకర్తలు, కీలక నేతలు

తెదేపాలో చేరిన పసుపుగల్లుకు చెందిన వారితో నూకసాని బాలాజీ, లలిత్‌సాగర్‌, రాఘవరెడ్డి తదితరులు

దర్శి, న్యూస్‌టుడే: తెదేపాలోకి వలసల జోరు కొనసాగుతోంది. సోమవారం 95 కుటుంబాలు వైకాపా వీడి సైకిలెక్కారు. ముండ్లమూరుకు చెందిన వైకాపా కీలక నేత పార్టీని వీడారు. ఈ సందర్భంగా స్థానిక తెదేపా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ముండ్లమూరు మండల వైకాపా కన్వీనర్‌ బిజ్జం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పసుపుగల్లుకు చెందిన 95 కుటుంబాలు తెదేపా తీర్థం తీసుకున్నాయి. ఒంగోలు పార్లమెంట్‌ తెదేపా అధ్యక్షుడు నూకసాని బాలాజీ, ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి తనయుడు రాఘవరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి భర్త డా.లలిత్‌సాగర్‌ సమక్షంలో వారికి పార్టీ కండువాలు కప్పారు. ఉల్లగల్లు, కెల్లంపల్లి, భీమవరం, రమణారెడ్డిపాలెం, నూజిళ్లపల్లి, పులిపాడు, ముండ్లమూరు నుంచి పలువురు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు.

ఎమ్మెల్యే స్వామి సమక్షంలో..: సింగరాయకొండ గ్రామీణం : రాష్ట్రంలో జగనాసుర పాలనకు అంతిమ ఘడియలు దాపురించాయని ఎమ్మెల్యే స్వామి అన్నారు. సోమవారం పాకలలో నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి ముఖ్య అనుచరుడు గోళ్లమూడి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వంద కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలో చేరగా, వారిని ఎమ్మెల్యే స్వామి, రాష్ట్ర తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి సత్య, ఒంగోలు తెదేపా పార్లమెంటు అధ్యక్షుడు బాలాజీ పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
రావెళ్లవారిపాలెం సర్పంచి...:  మర్రిపూడి: రావెళ్లవారిపాలెం వైకాపా సర్పంచి బొట్లగుంట రాంబాబుతో పాటు 20 కుటుంబాలు సోమవారం తెదేపాలో చేరాయి. ఈ సందర్భంగా సుధాకర్‌, రామబ్రహ్మయ్య, పాలెపు తిరుపాలు, శ్రీను, ఏడుకొండలు, నరేష్‌ తదితరులకు కొండపి ఎమ్మెల్యే డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, దామచర్ల పూర్ణచంద్రరావు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. మండల నాయకులు వీరనారాయణ, నరసారెడ్డి, నరసింహారావు, శ్రీనివాసులు, హనుమారెడ్డి పాల్గొన్నారు.
త్రోవగుంట ఎస్సీ కాలనీలో..:  ఒంగోలు గ్రామీణం : ఒంగోలు నగర పరిధిలోని త్రోవగుంట గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన వైకాపా నాయకులు జొన్నడ సామేలు, రాయపాటి చంద్ర, జి.గోపి, టి.అజయ్‌తోపాటు వంద మంది కార్యకర్తలు సోమవారం మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ ఆధ్వర్యంలో తెదేపాలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువాలు కప్పి స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ కామేపల్లి శ్రీనివాసరావు, పీడీసీసీ బ్యాంక్‌ ఛైర్మన్‌ కండె శ్రీనివాసులు, నాయకులు యర్రంనేని లక్ష్మీనారాయణ, నావూరి కుమార్‌, కండే బాబురావు  తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని