logo

గుండ్లకమ్మలో ఈతకెళ్లి యువకుడి మృతి

గుండ్లకమ్మలో ఈతకెళ్లి యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

Published : 30 Apr 2024 03:36 IST

మద్దిపాడు, న్యూస్‌టుడే: గుండ్లకమ్మలో ఈతకెళ్లి యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలులోని రాజగోపాల్‌ నగర్‌కు చెందిన గొరిపర్తి సాంబశివరావు(35) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం సాయంత్రం స్నేహితులతో కలిసి గుండ్లకమ్మ జలాశయంలో వద్ద సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి అక్కడ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. కుటుంబ సభ్యులు డ్యాం వద్దకు వెళ్లి చూడగా ఆచూకీ తెలియలేదు. సోమవారం ఉదయం మృతదేహం నీటిలో తేలియాడుతూ కనపడటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించారు. తండ్రి భద్రయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై రమేష్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని