సార్వత్రిక రణం.. హోరెత్తుతున్న ప్రచారం
సార్వత్రిక ఎన్నికలకు మరో 11 రోజులే గడువుంది. దీంతో అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. వీరికితోడుగా ఆయా పార్టీల అధినేతలు జిల్లాకు వరుస కడుతున్నారు.
గిద్దలూరుకు జనసేనాని, కనిగిరికి జగన్
3, 4 తేదీల్లో పొదిలి, దర్శికి చంద్రబాబు
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే
సార్వత్రిక ఎన్నికలకు మరో 11 రోజులే గడువుంది. దీంతో అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. వీరికితోడుగా ఆయా పార్టీల అధినేతలు జిల్లాకు వరుస కడుతున్నారు. దీంతో ఒక్కసారిగా ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పేరిట మంగళవారం ఒంగోలులో యువత, విద్యార్థులతో ముఖాముఖి సమావేశమయ్యారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుతోపాటు, ఒకే ప్రకటనతో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. ఆయా వర్గాల్లో భరోసా నింపారు. అదే రోజు మర్రిపూడి, సంతనూతలపాడులో తెదేపా హిందూపురం ఎమ్మెల్యే, సినీ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ బహిరంగ సభ, రోడ్డు షోలతో శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి కూడా టంగుటూరులో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. నగదు, మద్యం వంటి తాయిలాలు ఎర వేసినా అంచనాలో సగం మేర కూడా జనం జగన్ సభకు రాలేదు. దీంతో మరోసారి ఆయన జిల్లా పర్యటనపై దృష్టి పెట్టినట్లు సమాచారం.
జిల్లాకు వరుస కడుతున్న అధినేతలు...: అన్ని పార్టీల అధినేతలు తమ అభ్యర్థుల గెలుపుపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా జిల్లా పర్యటనకు వరుస కడుతున్నారు.
ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఈ నెల 3న జనసేనాని పవన్ కల్యాణ్ గిద్దలూరు వస్తున్నారు. ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం హెలీకాప్టర్లో నెల్లూరు బయలుదేరి వెళ్తారు. అదే రోజు దర్శి, ఒంగోలులో కూడా ప్రచారంలో పాల్గొనేలా తొలుత షెడ్యూల్ ప్రకటించినప్పటికీ.. ఆ రెండు చోట్ల మరోసారి నిర్వహించేలా ప్రణాళిక చేశారు.
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి కనిగిరిలో ఏర్పాటు చేయనున్న సభలో అదే రోజు పాల్గొననున్నారు.
3న మార్కాపురం నియోజకవర్గం పొదిలిలో, 4న దర్శిలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభల్లో తెదేపా అధినేత చంద్రబాబు పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాకు ఓటేశాడని.. కొడవలితో చెవి కోసేశాడు
[ 17-05-2024]
తెదేపాకు ఓటు వేశాడన్న ఆక్రోశంతో ఓ యువకుడిపై వైకాపా నాయకుడు కొడవలితో దాడి చేశాడు. -
కదులుతుందా యంత్రాంగం!
[ 17-05-2024]
ముందుగానే వర్షాలు కురుస్తుండటంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. -
పేదల జాగాలు.. దళారుల బేరాలు
[ 17-05-2024]
ప్రభుత్వం మీకు ఊరికి 5 కి.మీటర్ల దూరంలో స్థలాలిచ్చింది. అక్కడ రోడ్లు లేవు, విద్యుత్తు స్తంభాలు ఏర్పాటు చేయలేదు. -
ఊపిరి ఆగిపోతోందయ్యా!
[ 17-05-2024]
తాగునీరే వారి పాలిట శాపమైంది. ఫ్లోరైడ్ మహమ్మారి కోరలకు చిక్కి మూత్రపిండాల రోగులుగా మారారు. -
బకింగ్ హాంఫట్
[ 17-05-2024]
రహదారుల నిర్వహణ, మరమ్మతులు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదనేందుకు ఈ దృశ్యాలే నిదర్శనం. -
అనునిత్యం అప్రమత్తత అవసరం
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. -
నిధులు లాగేసి.. నీళ్లు నిలిపేసి
[ 17-05-2024]
ప్రస్తుతం గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పశ్చిమంలో భూగర్భ జలాలు ఇప్పటికే అడుగంటాయి. -
వక్ఫ్బోర్డు భూములకు రక్షణేదీ!
[ 17-05-2024]
పొదిలిలో కోట్లాది రూపాయల విలువైన వక్ఫ్బోర్డు భూములు క్రమంగా ఆక్రమణలకు గురవుతున్నా రక్షించాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. -
నరసింహా.. పాలక వర్గం లేకుండానే వేలమా!
[ 17-05-2024]
దక్షిణ సింహాచలంగా ప్రసిద్ధి చెందిన మండలంలోని పాతసింగరాయకొండ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు జూన్ 16 నుంచి 26 వ తేదీ వరకు నిర్వహించనున్నారు. -
పేలిన టైరు.. అదుపు తప్పిన కారు
[ 17-05-2024]
మండలంలోని రాయవరం గ్రామ శివారులోని వైద్యకళాశాలకు సమీపంలో కారు బోల్తాపడిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. -
ఆస్తి గొడవ అంత్యక్రియల నిలిపివేత
[ 17-05-2024]
ప్రాణం ఉన్నంతవరకూ పట్టించుకోని ఆప్తులు..ఆ తర్వాత ఆస్తి కోసం పరుగు పరుగున వచ్చారు. -
ట్రాక్టర్ కింద పడి చిన్నారి మృతి
[ 17-05-2024]
అభం శుభం తెలియని చిన్నారికి నాలుగేళ్లకే నిండు నూరేళ్లు నిండాయి.
తాజా వార్తలు (Latest News)
-
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
-
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే