వైకాపా మద్యమా.. మాకేం కనిపించదు
‘రాష్ట్రంలో దశలవారీగా మద్య నిషేధం విధిస్తాం. మద్యం ముట్టుకోవాలంటేనే భయం పుట్టేలా చేస్తాం. కేవలం ఫైవ్ స్టార్ హోటళ్లకే పరిమితం చేస్తాం. పూర్తిగా మద్యనిషేధం విధించిన తర్వాతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు మీ ముందుకొస్తాం..
సీఎం సభలోనే ఏరులై పారిన మందు
చోద్యం చూసిన సెబ్, పోలీసు అధికారులు
ఒంగోలు, న్యూస్టుడే
‘రాష్ట్రంలో దశలవారీగా మద్య నిషేధం విధిస్తాం. మద్యం ముట్టుకోవాలంటేనే భయం పుట్టేలా చేస్తాం. కేవలం ఫైవ్ స్టార్ హోటళ్లకే పరిమితం చేస్తాం. పూర్తిగా మద్యనిషేధం విధించిన తర్వాతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు మీ ముందుకొస్తాం..
గత ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్.జగన్
అందరూ అక్కడే ఉన్నా...: టంగుటూరులో మంగళవారం నిర్వహించిన సీఎం జగన్ సభలో మద్యం ఏరులై పారింది. జిల్లాస్థాయి అదికార యంత్రాంగంతో పాటు క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది అదే ప్రాంతంలో విధి నిర్వహణలో ఉన్నారు. అయినా విచ్చలవిడిగా మద్యం పంపిణీ చేశారు. ఉన్నతస్థాయి నుంచి చిన్నాచితకా అధికారుల వరకు అంతా అక్కడే ఉన్నా.. ఎవరూ ఆ వైపు కన్నెత్తి చూసేందుకు సాహసించలేదు. అదే సమయంలో ఒక అధికారి తనిఖీలు చేపట్టారు. ఏకంగా రాష్ట్రంలో నిషేధించిన గోవా, పుదుచ్చేరిలకు చెందిన నాన్ పెయిడ్ డ్యూటీ లిక్కర్ను పట్టుకున్నారు.
టంగుటూరు మండలం జమ్ములపాలెం శివారులో వాహనాలను తనిఖీ చేస్తున్న అధికారులు(పాత చిత్రం)
హెలీప్యాడ్ చెంతనే పంపిణీ...: సీఎం జగన్ టంగుటూరులో నిర్వహించిన సభకు జిల్లా పోలీసు శాఖ పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసింది. సుమారు 800 మందికి పైగా అధికారులు, సిబ్బంది ఈ విధులకు హాజరయ్యారు. కొండపి నియోజకవర్గంలోని కొండపి, సింగరాయకొండ, టంగుటూరు, జరుగుమల్లి, పొన్నలూరు, మర్రిపూడి మండలాల నుంచి ఈ సభకు జనాన్ని తరలించారు. గ్రామాలకు పంపిన ప్రతి కారు, బస్సు, ఆటోలకు పెద్దఎత్తున మద్యం అందించారు. ఈ తతంగమంతా బహిరంగంగానే సాగింది. సాక్షాత్తూ అధికారుల కళ్లెదుటే హెలీప్యాడ్ సమీపంలోనూ పెద్దఎత్తున మద్యం పంపిణీ చేశారు. అయినా అధికార యంత్రాంగం కిక్కురుమనలేదు. కనీసం వారించే ప్రయత్నం కూడా చేయలేదు.
సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభ సందర్భంగా టంగుటూరులో వైకాపా కార్యకర్తల
నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్న గోవా మద్యం సీసాల సంచులు
స్వాధీనం చేసుకున్న ఐఏఎస్ అధికారి...: బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులతో పాటు మద్యం అక్రమ రవాణాపై దృష్టి సారించాల్సిన సెబ్ అధికారులు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అదే సమయంలో ట్రైనీ ఐఏఎస్ అదికారి శౌర్యమన్ పటేల్ తమ సిబ్బందితో దాడులు నిర్వహించారు. పలు కార్లలో పెద్దఎత్తున మద్యం అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. గోవా, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన మద్యాన్ని స్వాధీనం చేసుకుని నాలుగు కార్లను జప్తు చేశారు. తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేయించారు. ఇప్పుడీ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. విధి నిర్వహణలో ఉన్న పోలీసు, సెబ్ సిబ్బంది అలసత్వంపై జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ తీవ్రంగా ఆగ్రహించినట్లు తెలిసింది. క్షేత్రస్థాయిలో అంతమంది ఉన్నా, విచ్చలవిడిగా మద్యం పంపిణీని పట్టించుకోలేదని.. రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకుని దాడులు చేసే వరకు మీరేం చేశారని ఆయన అధికారులపై మండిపడినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాకు ఓటేశాడని.. కొడవలితో చెవి కోసేశాడు
[ 17-05-2024]
తెదేపాకు ఓటు వేశాడన్న ఆక్రోశంతో ఓ యువకుడిపై వైకాపా నాయకుడు కొడవలితో దాడి చేశాడు. -
కదులుతుందా యంత్రాంగం!
[ 17-05-2024]
ముందుగానే వర్షాలు కురుస్తుండటంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. -
పేదల జాగాలు.. దళారుల బేరాలు
[ 17-05-2024]
ప్రభుత్వం మీకు ఊరికి 5 కి.మీటర్ల దూరంలో స్థలాలిచ్చింది. అక్కడ రోడ్లు లేవు, విద్యుత్తు స్తంభాలు ఏర్పాటు చేయలేదు. -
ఊపిరి ఆగిపోతోందయ్యా!
[ 17-05-2024]
తాగునీరే వారి పాలిట శాపమైంది. ఫ్లోరైడ్ మహమ్మారి కోరలకు చిక్కి మూత్రపిండాల రోగులుగా మారారు. -
బకింగ్ హాంఫట్
[ 17-05-2024]
రహదారుల నిర్వహణ, మరమ్మతులు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదనేందుకు ఈ దృశ్యాలే నిదర్శనం. -
అనునిత్యం అప్రమత్తత అవసరం
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. -
నిధులు లాగేసి.. నీళ్లు నిలిపేసి
[ 17-05-2024]
ప్రస్తుతం గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పశ్చిమంలో భూగర్భ జలాలు ఇప్పటికే అడుగంటాయి. -
వక్ఫ్బోర్డు భూములకు రక్షణేదీ!
[ 17-05-2024]
పొదిలిలో కోట్లాది రూపాయల విలువైన వక్ఫ్బోర్డు భూములు క్రమంగా ఆక్రమణలకు గురవుతున్నా రక్షించాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. -
నరసింహా.. పాలక వర్గం లేకుండానే వేలమా!
[ 17-05-2024]
దక్షిణ సింహాచలంగా ప్రసిద్ధి చెందిన మండలంలోని పాతసింగరాయకొండ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు జూన్ 16 నుంచి 26 వ తేదీ వరకు నిర్వహించనున్నారు. -
పేలిన టైరు.. అదుపు తప్పిన కారు
[ 17-05-2024]
మండలంలోని రాయవరం గ్రామ శివారులోని వైద్యకళాశాలకు సమీపంలో కారు బోల్తాపడిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. -
ఆస్తి గొడవ అంత్యక్రియల నిలిపివేత
[ 17-05-2024]
ప్రాణం ఉన్నంతవరకూ పట్టించుకోని ఆప్తులు..ఆ తర్వాత ఆస్తి కోసం పరుగు పరుగున వచ్చారు. -
ట్రాక్టర్ కింద పడి చిన్నారి మృతి
[ 17-05-2024]
అభం శుభం తెలియని చిన్నారికి నాలుగేళ్లకే నిండు నూరేళ్లు నిండాయి.
తాజా వార్తలు (Latest News)
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లే బాలుడి మృతి.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ