వైకాపాను ఓడించకపోతే.. యువతకు ఉపాధి కష్టమే
వైకాపా ఆరాచక పాలనకు అంతం పలకాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. గిద్దలూరులో శుక్రవారం నిర్వహించిన బహిరంగసభలో ప్రసంగించారు.
గిద్దలూరు బహిరంగ సభలో జనసేన అధినేత పవన్కల్యాణ్
ఓపెన్ టాప్ కారులో ర్యాలీగా వేదిక వద్దకు వస్తున్న పవన్కల్యాణ్కు స్వాగతం పలుకుతున్న కార్యకర్తలు, అభిమానులు
గిద్దలూరు పట్టణం, కంభం, న్యూస్టుడే : వైకాపా ఆరాచక పాలనకు అంతం పలకాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. గిద్దలూరులో శుక్రవారం నిర్వహించిన బహిరంగసభలో ప్రసంగించారు. వైకాపాను ఓడించే సమయం ఆసన్నమైందని ఆపార్టీని ఓడించకపోతే యువత ఉపాధి ఉండదన్నారు. జిల్లా వెనుకబడి ఉందని, వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే గిద్దలూరు, మార్కాపురం, నెల్లూరు జిల్లాలకు మేలు జరుగుతుందన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. గిద్దలూరులో ఒంటరిగా పోటీచేసే సత్తా జనసేనకు ఉన్నా 5 కోట్ల ప్రజల క్షేమం కోరి తెదేపాకు సీటు ఇచ్చామని పేర్కొన్నారు. గిద్దలూరు మండలంలోని గుండ్లమోటుకు తెలుగుగంగ ప్రాజెక్టు నీటిని అనుసంధానం చేయాలన్నది దశాబ్దాల కల అని అనుసంధానం చేస్తామని హామీ ఇచ్చారు. వైశ్య సామాజిక వర్గానికి చెందిన పొట్టిశ్రీరాములు బలిదానం వల్ల వచ్చిన రాష్ట్రం మనదని, కన్యకాపరమేశ్వరి బలిదానాన్ని అధికారిక దినోత్సవంగా జరుపుతామన్నారు. జిల్లాలో 2013 బ్యాచ్కు చెందిన కానిస్టేబుల్ ఉదయకృష్ణారెడ్డి ఇటీవల సివిల్స్లో 780 ర్యాంకు సాధించాడని, యువత లోని ప్రతిభకు నిదర్శనమన్నారు. అందరూ కుల గణాంకాలు తీసుకుంటారు, నేను కోరుకునేది ప్రతిభా గణాంకాలని పేర్కొన్నారు.. శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన కంభం చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ఎంతో మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. జగన్ పింఛన్ ఇచ్చేది ఏమిటి? దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య వీటిని ప్రారంభించారని చెప్పారు. గిద్దలూరు ప్రాంతంలో నల్లమల అడవులు ఉన్నాయి, దీనిని టూరిజం హబ్గా చేయేందుకు కృషిచేయాలని మాగుంటకు సూచించారు. వెనుకబడిన ఈ ప్రాంతంలో వలసలు ఆగేందుకు పరిశ్రమలు తేవాలన్నారు. జగన్కు ఎప్పుడూ పచ్చని చెట్లను నరికివేయడం తెలుసు వాటిని పెంచడం తెలియదన్నారు. గిద్దలూరులో అశోక్రెడ్డిని గెలిపించండి, నియోజకవర్గ అభివృద్ది బాధ్యత తీసుకుంటామన్నారు. నియోజకవర్గానికి చెందిన జన సైనికుడు వెంగయ్యనాయుడుని వేధించి ఆత్మహత్య చేసుకోనేలా చేశారని,. వెంగయ్యనాయుడు భార్య పసుపు కుంకుమలు తుడిపేసిన వారిని మళ్లీ గెలిపించాలా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్రెడ్డి, జనసేన ఇన్ఛార్జి బెల్లకొండ సాయిబాబు, జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్, భాజపా నియోజకవర్గ ఇన్ఛార్జి బ్రహ్మేశ్వరప్రసాద్, దర్శి ఇన్ఛార్జి వెంకట్, జడ్పీటీసీ మాజీ సభ్యుడు కుప్పా రంగనాయకులు, అశోక్రెడ్డి తనయుడు దివ్వేష్రెడ్డి, మాగుంట తనయుడు రాఘవరెడ్డి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దొరికినా నేరం కాదట.. విమర్శలకు తావిస్తున్న పోలీసుల తీరు
[ 18-05-2024]
ఎన్నికల వేళ కొందరు పోలీసులు అధికార పార్టీకి ఎంత తొత్తులుగా పనిచేశారో అనేందుకు యర్రగొండపాలెంలో చోటుచేసుకున్న ఘటనే ఓ నిదర్శనం. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈ నెల 13న పోలింగ్ బూత్లకు వెళ్తున్న ఓటర్లకు వైకాపా నాయకుడు శ్రీను డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ అధికారులకు తెదేపా నాయకులు ఫిర్యాదు చేశారు. -
పెళ్లికి నిరాకరించిందని పగ.. కాళ్లు పట్టుకున్నా కనికరించని కక్ష
[ 18-05-2024]
పెళ్లికి నిరాకరించిందనే కక్షతో ఓ యువకుడు యువతితో పాటు ఆమె తల్లిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన దారుణ సంఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరులోని పాతూరులో శుక్రవారం చోటుచేసుకుంది. -
పండగలా సొంతూళ్లకొచ్చారు
[ 18-05-2024]
2024 సార్వత్రిక రణంలో ఓటర్లు ‘స్థానిక’ సమరం తరహా ఉత్సాహం చూపారు. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ శాతం ఓటింగ్ నమోదవుతుంటుంది. తక్కువ ఓట్లు ఉండటంతో ప్రతి ఒక్కటీ కీలకంగా భావిస్తారు. -
కొలువులకు చదువే సరిపోదు
[ 18-05-2024]
ఇది పోటీ ప్రపంచం.. నెగ్గుకు రావాలంటే అన్నింటా ఇతరులను మించి అదనపు అర్హతలు తప్పనిసరి. అందులోనూ కొలువులు సాధించాలంటే చదువొక్కటే సరిపోదు. పనిలో నేర్పు, నైపుణ్యమూ అవసరం. అది సాధించిన విద్యార్థులు కళాశాల నుంచే నేరుగా ఉద్యోగ, ఉపాధి పొందవచ్చు. -
ఓటు వరకే నీళ్ల నాటకం
[ 18-05-2024]
ఎన్నికలు ముగియడంతో ఓటర్లతో ఇక పనేముందని వైకాపా అభ్యర్థులు, నేతలు అనుకుంటున్నారు కాబోలు. ఇన్ని రోజులు వారి చుట్టూ తిరిగిన వారు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి ట్యాంకర్ల సంఖ్య పెంచి నీళ్లు సరఫరా చేయించారు. -
స్ట్రాంగ్రూమ్లను రోజూ సందర్శించండి
[ 18-05-2024]
ఈవీఎంలకు పటిష్ఠమైన భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ భద్రత, ఓట్ల లెక్కింపు కేంద్రాల ఏర్పాట్లపై సచివాలయం నుంచి జిల్లా అధికారులతో ఆయన శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. -
ఘాట్లో ప్రమాద ఘంటికలు
[ 18-05-2024]
ఎతైన కొండలు, లోతైన లోయలు, వంపులతో కూడిన మలుపులు ఉన్న నల్లమల లోని శ్రీశైలం రహదారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. మూల మలుపుల వద్ద చోదకులు వాహనాల వేగాన్ని నియంత్రించ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. -
ఓట్లు వేయలేదనే వైకాపా దాడులు
[ 18-05-2024]
-
ఉపాధి చూపే బండే ఊపిరి తీసింది..
[ 18-05-2024]
ఐస్క్రీం బండిలో ఐస్క్రీంలు అమ్ముకుంటూ జీవనం సాగించే ఆ యువకుడిని అదే బండి ప్రాణం తీసింది. ఐస్క్రీం బండికి విద్యుత్తు సరఫరా కావడంతో విద్యుదాఘాతానికి గురైన యువకుడు మృతి చెందిన సంఘటన త్రిపురాంతకం మండలంలోని గణపవరంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. -
బాలికపై అత్యాచారం
[ 18-05-2024]
బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసిన సంఘటన చిన్నదోర్నాలలో శుక్రవారం వేకువజామున జరిగింది. ఎస్సై అంకమ్మరావు తెలియజేసిన వివరాల మేరకు.. ఆ గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన బాలిక శుక్రవారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లింది.
తాజా వార్తలు (Latest News)
-
బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది సజీవ దహనం
-
మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పిన సోనాక్షి సిన్హా.. ఎందుకంటే!
-
కెమెరామన్.. ప్లీజ్ ఆడియో ఆన్ చేయొద్దు: రోహిత్ శర్మ
-
కిర్గిస్థాన్లో అల్లర్లు.. భారత విద్యార్థులకు కేంద్రం అలర్ట్
-
నేడు స్టాక్మార్కెట్ ప్రత్యేక సెషన్.. దూసుకెళ్లిన సూచీలు
-
షికారు చేశారు... అద్దె బకాయిలు కట్టేదెవరు?