logo

కొత్తపట్నంలో భద్రతా ఏర్పాట్ల పరిశీలన

సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కొత్తపట్నం మండలం రెడ్డిపాలెం, కె.పల్లెపాలెం, ఈతముక్కలలోని పోలింగ్‌ కేంద్రాలను శనివారం జిల్లా పోలీసు పరిశీలకులు హసిబ్‌ ఉర్‌ రెహమాన్‌ పరిశీలించారు.

Published : 05 May 2024 02:33 IST

పోలింగ్‌ కేంద్రాల్లో వసతులపై ఆరా తీస్తున్న జిల్లా పోలీసు పరిశీలకులు హసిబ్‌ ఉర్‌ రెహమాన్‌

కొత్తపట్నం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కొత్తపట్నం మండలం రెడ్డిపాలెం, కె.పల్లెపాలెం, ఈతముక్కలలోని పోలింగ్‌ కేంద్రాలను శనివారం జిల్లా పోలీసు పరిశీలకులు హసిబ్‌ ఉర్‌ రెహమాన్‌ పరిశీలించారు. ఆయా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, భౌగోళిక పరిస్థితులు, మౌలిక సదుపాయాలు పరిశీలించి పలు సూచనలు చేశారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో శాంతిభద్రతల సమస్యలు, ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులపై ప్రజలు తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఫిర్యాదులుంటే 92810 34495కు సమాచారమివ్వాలని ఆయన కోరారు. ఆయన వెంట కొత్తపట్నం ఎస్సై సాంబశివరావు, పోలీసు సిబ్బంది ఉన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని