logo

కూటమిదే పక్కా విజయం

‘సభకు వచ్చిన జనం చూపుతున్న ఉత్సాహం.. యువత, మహిళల కేరింతలు చూస్తుంటే దర్శిలో మన విజయం పక్కా అని తేలిపోయింది. ఈ సారి కచ్చితంగా తెదేపా జెండా ఎగరేస్తాం.

Published : 05 May 2024 02:49 IST

దర్శి ఎన్నికల ప్రచారంలో తెదేపా అధినేత చంద్రబాబు

ప్రసంగిస్తున్న చంద్రబాబు.. చిత్రంలో తెదేపా, జనసేన నేతలు వెంకట్‌, పాపారావు, రవికుమార్‌, అభ్యర్థులు గొట్టిపాటి లక్ష్మి, మాగుంట

‘సభకు వచ్చిన జనం చూపుతున్న ఉత్సాహం.. యువత, మహిళల కేరింతలు చూస్తుంటే దర్శిలో మన విజయం పక్కా అని తేలిపోయింది. ఈ సారి కచ్చితంగా తెదేపా జెండా ఎగరేస్తాం. అందుకు వారమే సమయం ఉంది. నాయకులు, కార్యకర్తలు అజాగ్రత్త వహించొద్దు. సూపర్‌ సిక్స్‌ పథకాలు, కూటమి మ్యానిఫెస్టోను జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలి’ అని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు కోరారు. దర్శిలో శనివారం నిర్వహించిన ప్రజాగళం ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. తెదేపా, జనసేన, భాజపా కలిసి బరిలో నిలిచిన తర్వాత ఇక మరో పార్టీకి అవకాశం లేనే లేదన్నారు. మండుటెండలో గంటలపాటు నిరీక్షించి.. ఎంతో ఓపికగా తన ప్రసంగాన్ని విన్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు చూపిన అభిమానానికి మురిసిపోయారు. మిమ్మల్ని చూసి ఎండే భయపడిపోతోందని సభకు హాజరైన వారిని చూసి ప్రశంసించారు. చంద్రబాబు మాట్లాడుతున్నంత సేపు సభికుల కేరింతలు కొడుతూ ఉత్సాహాన్ని ప్రదర్శించారు.

ఈనాడు, ఒంగోలు; దర్శి, న్యూస్‌టుడే

సభకు హాజరైన జన సందోహం

 

ప్రచార సభలో జనసేనాని చిత్రంతో సందడి...

 

ప్లకార్డులు ప్రదర్శిస్తూ తెలుగు తమ్ముళ్లు, మహిళల ఉత్సాహం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని