వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో హత్య చేయించిన భార్యను, మరో ముగ్గురు నిందితులను గుంటూరులోని కొత్తపేట పోలీసులు అరెస్టు చేశారు.
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య
నిందితుల అరెస్టు
నెహ్రూనగర్(గుంటూరు), న్యూస్టుడే : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో హత్య చేయించిన భార్యను, మరో ముగ్గురు నిందితులను గుంటూరులోని కొత్తపేట పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వివరాలను సోమవారం ప్రత్యేక విచారణాధికారి, డీఎస్పీ వీవీ నాయుడు, కొత్తపేట సీఐ అన్వర్ బాషా తెలిపారు. పుల్లలచెరువు మండలం ఆర్ ఉమ్మడివరం గ్రామానికి చెందిన ప్రేమ్కుమార్(35) తన భార్య పిల్లలతో బతుకు దెరువుకు గుంటూరు వచ్చి బుచ్చయ్యతోటలో నివాసం ఉంటున్నాడు. అతను పండ్ల వ్యాపారం చేస్తుంటాడు. అతని భార్య భారతి సమోసాలు తయారు చేసే షాపునకు వెళుతుండేది. షాపు యజమాని గౌస్తో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలుసుకున్న ప్రేమ్కుమార్ మందలించాడు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య స్పర్థలు వచ్చి గొడవలు జరుగుతుండేవి. ఈక్రమంలో ఏప్రిల్ 28వ తేదీ రాత్రి ప్రేమ్కుమార్ ఓ పెళ్లికి వెళుతున్నానని చెప్పి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని భార్య భారతి 29వ తేదీన కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుందని, భర్త కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొంది. సీఐ అన్వర్ బాషా అదృశ్యం కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి విచారించగా భారతి తన భర్తను చంపించినట్లు గుర్తించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను హతమార్చడానికి భారతి తన ప్రియుడు గౌస్తో కలిసి కుట్ర పన్నింది. ప్రియురాలి కోరిక మేరకు గౌస్ తన తమ్ముడు షేక్ ఖాసిం, అతని స్నేహితుడు పఠాన్ రెహమాన్తో కలిసి పథకం రచించాడు. ప్రేమ్కుమార్కు మాయమాటలు చెప్పి కొర్నెపాడులోని జగనన్నకాలనీ లేఔట్ దగ్గరకు తీసుకువెళ్లారు. బాగా మద్యం తాగించి కర్రతో కొట్టి, తర్వాత కత్తులతో పీకకోసి కిరాతకంగా హత మార్చి అక్కడే పడేసి వెళ్లారు. ఇంటికి వచ్చి భారతితో తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయించారు. నిందితులు భారతి, గౌస్, ఖాసిం, పఠాన్ రెహమాన్లను సోమవారం అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. హత్య కేసు ఛేదించి నిందితులను అరెస్టు చేసిన సీఐ అన్వర్బాషా, ఎస్సై హనుమంతురావు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దొరికినా నేరం కాదట.. విమర్శలకు తావిస్తున్న పోలీసుల తీరు
[ 18-05-2024]
ఎన్నికల వేళ కొందరు పోలీసులు అధికార పార్టీకి ఎంత తొత్తులుగా పనిచేశారో అనేందుకు యర్రగొండపాలెంలో చోటుచేసుకున్న ఘటనే ఓ నిదర్శనం. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈ నెల 13న పోలింగ్ బూత్లకు వెళ్తున్న ఓటర్లకు వైకాపా నాయకుడు శ్రీను డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ అధికారులకు తెదేపా నాయకులు ఫిర్యాదు చేశారు. -
పెళ్లికి నిరాకరించిందని పగ.. కాళ్లు పట్టుకున్నా కనికరించని కక్ష
[ 18-05-2024]
పెళ్లికి నిరాకరించిందనే కక్షతో ఓ యువకుడు యువతితో పాటు ఆమె తల్లిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన దారుణ సంఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరులోని పాతూరులో శుక్రవారం చోటుచేసుకుంది. -
పండగలా సొంతూళ్లకొచ్చారు
[ 18-05-2024]
2024 సార్వత్రిక రణంలో ఓటర్లు ‘స్థానిక’ సమరం తరహా ఉత్సాహం చూపారు. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ శాతం ఓటింగ్ నమోదవుతుంటుంది. తక్కువ ఓట్లు ఉండటంతో ప్రతి ఒక్కటీ కీలకంగా భావిస్తారు. -
కొలువులకు చదువే సరిపోదు
[ 18-05-2024]
ఇది పోటీ ప్రపంచం.. నెగ్గుకు రావాలంటే అన్నింటా ఇతరులను మించి అదనపు అర్హతలు తప్పనిసరి. అందులోనూ కొలువులు సాధించాలంటే చదువొక్కటే సరిపోదు. పనిలో నేర్పు, నైపుణ్యమూ అవసరం. అది సాధించిన విద్యార్థులు కళాశాల నుంచే నేరుగా ఉద్యోగ, ఉపాధి పొందవచ్చు. -
ఓటు వరకే నీళ్ల నాటకం
[ 18-05-2024]
ఎన్నికలు ముగియడంతో ఓటర్లతో ఇక పనేముందని వైకాపా అభ్యర్థులు, నేతలు అనుకుంటున్నారు కాబోలు. ఇన్ని రోజులు వారి చుట్టూ తిరిగిన వారు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి ట్యాంకర్ల సంఖ్య పెంచి నీళ్లు సరఫరా చేయించారు. -
స్ట్రాంగ్రూమ్లను రోజూ సందర్శించండి
[ 18-05-2024]
ఈవీఎంలకు పటిష్ఠమైన భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ భద్రత, ఓట్ల లెక్కింపు కేంద్రాల ఏర్పాట్లపై సచివాలయం నుంచి జిల్లా అధికారులతో ఆయన శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. -
ఘాట్లో ప్రమాద ఘంటికలు
[ 18-05-2024]
ఎతైన కొండలు, లోతైన లోయలు, వంపులతో కూడిన మలుపులు ఉన్న నల్లమల లోని శ్రీశైలం రహదారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. మూల మలుపుల వద్ద చోదకులు వాహనాల వేగాన్ని నియంత్రించ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. -
ఓట్లు వేయలేదనే వైకాపా దాడులు
[ 18-05-2024]
-
ఉపాధి చూపే బండే ఊపిరి తీసింది..
[ 18-05-2024]
ఐస్క్రీం బండిలో ఐస్క్రీంలు అమ్ముకుంటూ జీవనం సాగించే ఆ యువకుడిని అదే బండి ప్రాణం తీసింది. ఐస్క్రీం బండికి విద్యుత్తు సరఫరా కావడంతో విద్యుదాఘాతానికి గురైన యువకుడు మృతి చెందిన సంఘటన త్రిపురాంతకం మండలంలోని గణపవరంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. -
బాలికపై అత్యాచారం
[ 18-05-2024]
బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసిన సంఘటన చిన్నదోర్నాలలో శుక్రవారం వేకువజామున జరిగింది. ఎస్సై అంకమ్మరావు తెలియజేసిన వివరాల మేరకు.. ఆ గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన బాలిక శుక్రవారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లింది.
తాజా వార్తలు (Latest News)
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు..!’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రాహుల్ వద్ద ఉన్నది చైనా రాజ్యాంగం : బిశ్వశర్మ పోస్ట్
-
పుతిన్ పర్యటన వేళ.. చైనాకు జెలెన్స్కీ అభ్యర్థన