ఫారెస్ట్ సర్వీస్లో తెలుగువారి సత్తా
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) తుది ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి మరోసారి సత్తా చాటారు. యూపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పరీక్షల ఫలితాలు బుధవారం వెల్లడయ్యాయి.
పోతుపురెడ్డి భార్గవ్కు 22.. మన్నెం అజయ్కుమార్కు 44వ ర్యాంకు
దేశవ్యాప్తంగా 147 మంది ఎంపిక..
వీరిలో 20 మంది ఏపీ, తెలంగాణ అభ్యర్థులే
ఈనాడు, హైదరాబాద్, వరంగల్; ఈనాడు డిజిటల్, జయశంకర్ భూపాలపల్లి; మిర్యాలగూడ, చిట్యాల, న్యూస్టుడే: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) తుది ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి మరోసారి సత్తా చాటారు. యూపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పరీక్షల ఫలితాలు బుధవారం వెల్లడయ్యాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం 50లోపు ర్యాంకుల్లో ముగ్గురు తెలుగు వారు ఉన్నారు. ఈసారి దేశవ్యాప్తంగా 147 మందిని ఫారెస్ట్ సర్వీస్ ఉద్యోగాలకు యూపీఎస్సీ ఎంపిక చేసింది. అందులో సుమారు 20 మంది వరకు ఏపీ, తెలంగాణ అభ్యర్థులు ఉంటారని అంచనా. విజేతల్లో ఎక్కువ మంది సివిల్స్కు సన్నద్ధమవుతున్న వారే. వీరిలో కొందరు ఏప్రిల్ 16న ప్రకటించిన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో ర్యాంకులు సాధించారు. ఐఎఫ్ఎస్లో 22వ ర్యాంకు సాధించిన పోతుపురెడ్డి భార్గవ్ (విజయనగరం)కు సివిల్స్లో 590వ ర్యాంకు వచ్చింది. 52వ ర్యాంకర్ గొబ్బిళ్ల కృష్ణ శ్రీవాత్సవ్ (కడప జిల్లా) సివిల్స్లో 444వ ర్యాంకు సాధించారు. విజేతలు తొలి మూడు నెలలు ముస్సోరిలో, ఆ తర్వాత 15 నెలలు దేహ్రాదూన్లో శిక్షణ పొందనున్నారు.
మొదటి ప్రయత్నంలో..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గుంటూరుపల్లికి చెందిన మన్నెం అజయ్కుమార్ తొలి ప్రయత్నంలోనే ఐఎఫ్ఎస్లో 44వ ర్యాంకు సాధించారు. ఐఐటీ ధన్బాద్లో ఎంటెక్ పూర్తిచేసిన అజయ్కుమార్.. సొంతంగా సివిల్స్కు సన్నద్ధం అవుతున్నారు. సివిల్స్ ప్రధాన పరీక్షలో రెండు మార్కులు తగ్గడంతో ముఖాముఖికి అర్హత సాధించలేకపోయారు. తొలి ప్రయత్నంలోనే ఐఎఫ్ఎస్లో మంచి ఫలితం రావడం సంతోషంగా ఉందని, ఐఏఎస్ సాధించడమే తన లక్ష్యమని తెలిపారు.
ఏపీ సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్న తుమ్మల కృష్ణ చైతన్య ఐఎఫ్ఎస్లో 74వ ర్యాంకు సాధించారు. కృష్ణా జిల్లా బాపులపాడుకు చెందిన ఆయన నాలుగో ప్రయత్నంలో ఈ విజయం సాధించినట్లు తెలిపారు. చిన్న చిన్న తప్పులతో సివిల్స్ 4 మార్కులతో చేజారినట్లు చెప్పారు. తనకు ఫారెస్ట్ సర్వీస్పైనే మక్కువని వివరించారు.
‘ఈనాడు’ విజేత.. అనూష
106వ ర్యాంకు సాధించిన అనూష కొల్లి ఐఐటీ ముంబయిలో 2012లో ఇంజినీరింగ్ పూర్తిచేశారు. 2018 నుంచి సివిల్స్కు సిద్ధమవుతున్నారు. ఐఎఫ్ఎస్కు ఎంపికవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పదోతరగతి చదివిన అనూష 563 మార్కులు సాధించారు. తర్వాత వరంగల్లో ఇంటర్ చదివారు. జేఈఈలో ర్యాంకు సాధించి 2008లో ముంబయి ఐఐటీలో సీటు పొందారు. అనూష తండ్రి వెంకన్న ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవారు. ఐఐటీలో చదివేందుకు కుటుంబ ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోవడంతో.. ఆమెపై ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. స్పందించిన మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్రావు.. అనూష ఇంజినీరింగ్ పూర్తయ్యే వరకూ ఖర్చులు భరించి ప్రోత్సహించారు. జర్మనీలో ఇంటర్న్షిప్నకు అవకాశం రాగా.. మరోసారి ‘ఈనాడు’ కథనం ప్రచురించింది. దీనిపై మిర్యాలగూడ సహాయ రవాణా అధికారి సురేష్రెడ్డి, పలువురు దాతలు స్పందించి, సహకారం అందించడంతో.. అనూష జర్మనీ వెళ్లి మూడు నెలల ఇంటర్న్షిప్ పూర్తిచేశారు. ఇంజినీరింగ్ పూర్తయ్యాక.. హైదరాబాద్లో ఉద్యోగంలో చేరారు. వివాహమై, ఇద్దరు సంతానం కలిగాక.. 2018 నుంచి మళ్లీ సివిల్స్పై దృష్టిపెట్టారు. తల్లిదండ్రులు, భర్త వావిళ్లపల్లి రామకృష్ణ ప్రోత్సహించినట్లు చెప్పారు. ‘ఈనాడు’ సహకారంతోనే తన జీవితంలో మార్పు వచ్చిందంటూ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలింగ్.. వైకాపా పోలీసింగ్
[ 19-05-2024]
జిల్లాలోని కొందరు పోలీసులు అధికార పార్టీ వైకాపా తొత్తులుగా మారారు. ప్రజాస్వామ్యంలో అత్యంత కీలక ప్రక్రియ అయిన పోలింగ్లో తమ ముసుగు తొలగించారు. నిసిగ్గుగా ఓ వర్గం వైపు నిలిచి కొమ్ము కాశారు. -
పెట్టిందే తిను.. అడక్కు మెనూ
[ 19-05-2024]
ఒంగోలు సర్వజన ఆసుపత్రిలో రోగులకు ఆకలి కేకలు తప్పడం లేదు. గుత్తేదారు పెట్టిందే భోజనం. ఆయన ఎప్పుడు పెడితే అప్పుడు.. ఏది ఇస్తే అదే తినాలి తప్ప మెనూ అమలు పట్టదు. కారం పొడితే అల్పాహారం అందించినా అదేమని అధికారులు అడగరు. -
2,14,832 మంది ఓటుకు దూరం
[ 19-05-2024]
2024 సార్వత్రిక ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. కొందరు గత అయిదేళ్లుగా జిల్లాలో అధికార పార్టీ నాయకులు సాగించిన అరాచకాలు, భూ ఆక్రమణలు, దందాలు, అక్రమ కేసులు, బెదిరింపులు తట్టుకోలేక ఓటేశారు. -
గెలుపోటముల్లో చెరి సగం
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకున్నారు. ఈవీఎంలు స్ట్రాంగ్ రూములకు చేరాయి. -
ఒంగోలుకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
[ 19-05-2024]
ఎన్నికల విధుల్లో ఉంటూ ఇతర జిల్లాలో ఓటు వేసిన పోస్టల్ బ్యాలెట్లు శనివారం ఒంగోలుకు చేరాయి. జిల్లాకు చేరిన బ్యాలెట్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ప్రకాశం భవన్లోని స్పందన సమావేశ మందిరంలో తెరిచారు. -
సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
[ 19-05-2024]
ఈ నెల 24 నుంచి నిర్వహించనున్న ఇంటర్, 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు; జూన్ ఒకటో తేదీ నుంచి జరగనున్న ఏపీ ఓపెన్ స్కూల్స్ ఇంటర్, 10వ తరగతి పరీక్షలు సజావుగా సాగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. -
నిమ్మ.. నష్టాలే మిగిల్చెనమ్మా!
[ 19-05-2024]
జిల్లాలో అత్యధికంగా నిమ్మ సాగు చేసే ప్రాంతాల్లో కనిగిరి ఒకటి. ఒకప్పుడు అధిక విస్తీర్ణంలో తోటలు సాగయ్యేవి. ఈ ప్రాంతాన్ని నిమ్మ వనంగా అభివర్ణించేవారు. -
దైవ దర్శనానికి వెళ్లొస్తూ ఒకరి మృతి.. ముగ్గురికి గాయాలు
[ 19-05-2024]
ఆటో మినీలారీ ఎదురెదురుగా ఢీ కొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడిన సంఘటన శనివారం పొదిలి మండలం కంభాలపాడు సమీపంలో జరిగింది. -
బోలెరో ఢీకొని వాహన చోదకుడి మృతి
[ 19-05-2024]
ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని బొలోరో ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం మండలంలోని తర్లుపాడు, సీతానాగులవరం గ్రామాల మధ్య చోటు చేసుకుంది. -
తెలంగాణ మద్యం సీసాలు స్వాధీనం
[ 19-05-2024]
తెలంగాణ మద్యం సీసాలను అక్రమంగా తీసుకువెళుతున్న వ్యక్తిని శుక్రవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై బి.ప్రేమ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం -
చెంపపై కొట్టి.. జుట్టు పట్టుకుని లాగి...
[ 19-05-2024]
అధికార పార్టీకి ఓటేయాలంటూ ఓ సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శి దురుసుగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ముండ్లమూరు మండలం ఉమామహేశ్వరపురం సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శిగా కె.అనూష పనిచేస్తున్నారు. -
గురుకులాల్లో ఇంటర్ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్
[ 19-05-2024]
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు ప్రవేశ పరీక్ష రాసి ఎంపికైన విద్యార్థులకు మెరిట్ ప్రకారం
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఒకప్పుడు న్యాయం కోసం వీధుల్లోకి వచ్చాం.. ఇప్పుడు?.. ఆప్ నిరసనపై మాలీవాల్
-
కర్నూలులో చెరువు వద్ద ముగ్గురు ట్రాన్స్జెండర్ల అనుమానాస్పద మృతి
-
ఆకాశంలో రాకాసి ఉల్క.. రాత్రిని పగలుగా మార్చేంత వెలుగు..!
-
18 ఏళ్ల ‘గోదావరి’.. సుమంత్కు ముందు అనుకున్న హీరోలేవంటే?
-
లీగ్ స్టేజ్లో చివరి రోజు.. ‘నంబర్ 2’ ఎవరిది..?