AP News: అమ్మో.. అన్ని రోజులా?ఖర్చుల భారంపై నేతల తర్జనభర్జన..!
ఎన్నికల కోడ్ కూసింది.. నెల రోజుల్లో ప్రక్రియ ముగిసిపోతుందని.. గతసారి మాదిరిగానే మొదటి విడతలో ఎన్నికలు జరుగుతాయని అంతా లెక్కలేశారు.
ఇటీవల జరిగిన ఆత్మీయ సమావేశంలో వైద్య సిబ్బందికి కానుకలు అందజేస్తున్న ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిరణ్కుమార్
న్యూస్టుడే, టెక్కలి : ఎన్నికల కోడ్ కూసింది.. నెల రోజుల్లో ప్రక్రియ ముగిసిపోతుందని.. గతసారి మాదిరిగానే మొదటి విడతలో ఎన్నికలు జరుగుతాయని అంతా లెక్కలేశారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఎన్నికల సంఘం మే 13 పోలింగ్ తేదీగా ప్రకటించడంతో ఒక్కసారిగా రాజకీయ పార్టీల్లో వేడి చల్లారింది. దాదాపుగా రెండు నెలల పాటు సమయం ఉండటంతో అన్ని రకాలుగా ఆలోచనలో పడ్డారు. ఇంకా పోలింగ్కు 50 రోజులకుపైగా వేచి ఉండాల్సిన నేపథ్యంలో అప్పటి వరకు ఎలా నెట్టుకురావాలనే ఆందోళన మొదలైంది. అధికార వైకాపాలోనూ అంతర్మథనం ప్రారంభమైంది.
జిల్లాలో ఇప్పటికే ప్రధాన పార్టీల్లో అభ్యర్థుల ప్రకటన కొలిక్కివచ్చింది. వైకాపాలో జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పార్లమెంట్ స్థానానికి సైతం బరిలో నిలిచేవారి పేర్లు ప్రకటించారు. తెదేపా, జనసేన, భాజపా కూటమిలోనూ నాలుగు స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. వారంతా ఎన్నికల వరకు ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చలు జరుపుతున్నారు. ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం ఎన్నికల వ్యయం భరించలేనంతగా మారడం అభ్యర్థులకు భారంగా మారింది. పార్టీల అధిష్ఠానం కొంత మేర సమకూరుస్తున్నప్పటికీ స్థానిక నేతలకు సర్దుబాటు, శ్రేణులు, ఇతర అంశాలకు పోటీదారులు అదనంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో గతంతో పోలిస్తే ఎన్నికల ఖర్చు పదింతలు పెరిగిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
అధికార పార్టీకి తడిసిమోపెడు
నెలరోజుల్లోనే ఎన్నికలు ఉండే అవకాశముందని అంచనా వేసిన అధికార వైకాపా ప్రక్రియను ముందే ప్రారంభించింది. కోడ్ రాకముందే అభ్యర్థులకు అధిష్ఠానం నుంచి ఫండింగ్ కూడా వచ్చిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఓ వైపు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులకు రూ.లక్ష చొప్పున ఇవ్వాలని పై నుంచి సూచనలు రావడంతో నియోజకవర్గాల్లో ఆ మేరకు పంచేశారు. పురపాలక సంఘాల్లో కౌన్సిలర్లు, మేజర్ పంచాయతీల్లో వార్డు సభ్యులకు సైతం నజరానాలు అందించారు. ఇవి కాక వాలంటీర్లకు రూ.10 వేల చొప్పున పంపిణీ చేశారు. కొన్ని చోట్ల మహిళలకు చీరలు, కానుకలు అందించారు. కార్యకర్తలకు విందు భోజనాలు పెట్టించారు. నియోజకవర్గాల్లో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఇప్పటి వరకు రూ.2-6 కోట్ల వరకు ఖర్చు చేశారు. నియోజకవర్గ కేంద్రాలు, మేజర్ పంచాయతీల్లో ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. అక్కడ స్థానిక నాయకులు రోజువారీ కార్యకలాపాలు నిర్వహించడంతో పాటు వాలంటీర్లకు ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు అందిస్తున్నారు. ఖర్చును అలవాటు చేసేశారు. మరోవైపు అధిష్ఠానం తాము చెప్పేవరకు పంపిన మొత్తాన్ని కదిలించవద్దని ఆదేశించడంతో అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పుడు ఖర్చు ఆపుదామంటే కుదరని పరిస్థితి నెలకొంది. ఎంతమంది ఎటు జారిపోతారోనని ఆందోళన అభ్యర్థుల్లో ప్రారంభమైంది.
కూటమికి సమయం దొరికినట్లే..!
భిన్న ఆలోచనలు కలిగిన రాజకీయ పార్టీల శ్రేణులు ఒకే పంథాలో నడవడం అంత తేలిక కాదు. ఎన్నికల గడువు ఎక్కువగా ఉండటంతో తెదేపా, జనసేన, భాజపా కూటమి మధ్య సమన్వయానికి తగినంత సమయం దొరికిందని ఆయా పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు. కొంతకాలంగా తెదేపా, జనసేన నేతలు కలసి పని చేస్తున్నప్పటికీ.. తాజాగా వారికి భాజపా జత కట్టడంతో మూడు పార్టీలు ప్రజల్లోకి వెళ్లేందుకు అవసరమైన కసరత్తు ఎలా చేయాలనే దానిపై సమీక్షించుకునేందుకు వీలు కుదిరింది. ఇంతలో అధికార పార్టీ దూకుడు కొంత తగ్గుతుందని, మరోవైపు వాలంటీర్లను నియంత్రించేందుకు సమయం దొరుకుతుందని ప్రణాళిక చేస్తున్నారు. ఇంటింటికీ మరోసారి వెళ్లేందుకు, మేనిఫెస్టో వివరించడంతో పాటు అధికార పార్టీ వైఫల్యాలను వివరించేందుకు ఈ సమయాన్ని వినియోగించుకోవాలని కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు.
అందరిలోనూ అదే ఆలోచన..
ఎన్నికలంటే పోటీ చేసే అభ్యర్థులతో పాటు విధులు నిర్వహించే ఉద్యోగులకూ అగ్ని పరీక్షే. ఎన్నికల విధులు, ఏర్పాట్లు, కోడ్ అమలు, నిర్వహణ పర్యవేక్షించే రెవెన్యూ, పోలీసు సిబ్బంది సైతం రెండు నెలల సమయాన్ని ఎలా నెట్టుకురావాలో అని సతమతమవుతున్నారు. శాంతి భద్రతలతో పాటు రాజకీయ వర్గాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం పెద్ద సవాలుగా మారింది. ఇప్పటికే సెక్టార్, రూట్ అధికారులు, సిబ్బందిని నియమించారు. కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. రెండు నెలలపాటు వాటిని కొనసాగించడం.. పోలింగ్, కౌంటింగ్కు ఏర్పాట్లు చేయడమంటే సుదీర్ఘ ప్రయాణమే అవుతుందని తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికల్లో కీలక భూమిక పోషించే ఉపాధ్యాయులు ఇదే సమయంలో పరీక్షలు, మూల్యాంకనం విధులు కూడా నిర్వహించాల్సి ఉంది. ఇవన్నీ ఒకేసారి నిర్వహించడం ఎలా అని వారిలోనూ ఒత్తిడి నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
[ 27-04-2024]
‘పల్లెల్లో అందరూ కలిసి ముందడుగు వేయండి. ఒకే మాటపై నిలబడండి. స్థానిక సంస్థల ఎన్నికలు ఏకగ్రీవం చేసుకుంటే ప్రోత్సాహక నిధులు మంజూరు చేస్తాం’ అని వైకాపా ప్రభుత్వం మూడేళ్ల కిందట పంచాయతీ ఎన్నికల సమయంలో ప్రకటించింది. -
95 ఆమోదం.. 28 తిరస్కరణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లావ్యాప్తంగా దాఖలైన నామపత్రాల పరిశీలన శుక్రవారం జరిగింది. 8 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్ స్థానాలకు సంబంధించి వచ్చిన నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల పరిశీలకులు, అభ్యర్థుల సమక్షంలో పరిశీలించారు. -
వైకాపా అభ్యర్థుల నామపత్రాలపై అభ్యంతరాలు
[ 27-04-2024]
-
కలమట బాధ్యతల స్వీకరణ
[ 27-04-2024]
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. -
ఓటర్లు 18,75,934 మంది
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా ఓటర్ల కొత్త జాబితా ఖరారైంది. ఈ నెల 15 నాటికి నమోదైనవారికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. -
మృత్యువులోనూ వీడని బంధం!
[ 27-04-2024]
వారిద్దరూ వివాహ బంధంతో ఒకటయ్యారు. పిల్లల్ని పెంచి పెద్ద చేసి.. పెళ్లిళ్లు కూడా జరిపించారు. -
దశాబ్దాల వ్యధ.. శంకుస్థాపనకే పరిమితమైన కథ..!
[ 27-04-2024]
మూడు వైపులా మహేంద్రతనయ నది నీరు, మరో వైపు పంట పొలాలు. గ్రామం నుంచి బయటకు రావాలంటే నాటు పడవే శరణ్యం ఇదీ హిరమండలంలోని జిల్లేడుపేట గ్రామస్థుల పరిస్థితి. -
చుక్కలు చూపిస్తున్నారు
[ 27-04-2024]
పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలోని కొండి, పూజారి వీధులకు బోరు నీరే తాగు నీరు. బోరు వేసే సమయంలో 100 అడుగులు మాత్రమే తవ్వి వదిలేయడంతో క్రమేపీ నీటి లభ్యత తగ్గిపోయింది. -
ఇది మీ పాలనకు మచ్చు తునక
[ 27-04-2024]
వైకాపా పాలనలో రోడ్లు ఎలాంటి దీన స్థితిలో ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఇచ్ఛాపురంలోని పలు గ్రామాల్లోని రోడ్లు ఛిద్రమై వాహనదారులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. -
నగరమంతా.. ట్రాఫిక్ తంటా
[ 27-04-2024]
రోజురోజుకు పెరుగుతున్న జనాభా దృష్ట్యా నగరంలో నిత్యం ట్రాఫిక్ సవస్యలు అధికమవుతున్నాయి. డేఅండ్నైట్, రామలక్ష్మణ, సూర్యమహల్, అరసవల్లి మిల్లు, పొట్టిశ్రీరాములు, ఏడురోడ్ల కూడళ్లలో వాహనాల రద్దీతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
అరాచక పాలనకు చరమగీతం పాడాలి
[ 27-04-2024]
రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని భాజపా ఎచ్చెర్ల ఎమ్మెల్యే అభ్యర్థి నడుకుదటి ఈశ్వరరావు అన్నారు. -
కూటమి విజయం ఖాయం
[ 27-04-2024]
కొద్ది రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి అఖండ విజయం ఖాయమని తెదేపా ఆమదాలవలస ఎమ్మెల్యే అభ్యర్థి కూన రవికుమార్ ధీమా వ్యక్తం చేశారు. -
జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాం
[ 27-04-2024]
అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకరరావు పేర్కొన్నారు. -
వచ్చే ఎన్నికల్లో కూటమి విజయం ఖాయం
[ 27-04-2024]
వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని ఎంపీ రామ్మోహన్నాయుడు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం