icon icon icon
icon icon icon

AP News: ఎన్నికల అధికారిని బెదిరించిన మంత్రి అప్పలరాజు..

మంత్రి అప్పలరాజు పలాస నియోజకవర్గంలో ఎన్నికల అధికారులతో వాగ్వాదానికి దిగారు. నిబంధనలకు విరుద్ధంగా ఉందని నిన్న వైకాపా ప్రచార రథాన్ని ఎన్నికల అధికారి ఆశాలత ఆపారు.

Updated : 27 Apr 2024 13:25 IST

పలాస: మంత్రి అప్పలరాజు పలాస నియోజకవర్గంలో ఎన్నికల అధికారులతో వాగ్వాదానికి దిగారు. నిబంధనలకు విరుద్ధంగా ఉందని శుక్రవారం వైకాపా ప్రచార రథాన్ని ఎన్నికల అధికారి ఆశాలత ఆపారు. దీంతో మంత్రి ఆగ్రహానికి గురయ్యారు. ప్రచార రథం, రూ.లక్ష ఆమెకు ఇచ్చేయండంటూ తన అనుచరులను ఆదేశించారు. మీ ఇష్టమొచ్చినట్లు తయారు చేసి వాహనాన్ని ఇవ్వాలని అధికారితో మాటల యుద్ధానికి దిగారు. నిబంధనలు చెబుతుంటే గొడవ పెట్టుకుంటారేంటని అధికారి మంత్రిని ప్రశ్నించారు. దీంతో మంత్రి ఆవేశంతో ఇంకోసారి వైకాపా ప్రచార రథం ఆపితే బాగోదని హెచ్చరించారు. ఎవరికి ఫిర్యాదు చేసుకుంటారో చేసుకోండని.. మీరొక్కరే విధులు నిర్వర్తిస్తున్నారా అని అధికారిని బెదిరించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img