కొండలు కరిగిపోతున్నాయ్..!
కంకర కొండలు అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి. అధికార పార్టీ నాయకుల అండతో యంత్రాలు ఉపయోగించి కొల్లగొడుతున్నారు.
అధికార పార్టీ నేతల అండతో యథేచ్ఛగా కంకర తవ్వకాలు
న్యూస్టుడే హరిపురం (మందస)
కంకర కొండలు అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి. అధికార పార్టీ నాయకుల అండతో యంత్రాలు ఉపయోగించి కొల్లగొడుతున్నారు. అనుమతులు లేకుండా యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. ట్రాక్టర్లలో ప్రైవేటు నిర్మాణాల కోసం తరలించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
మందస, మకరజోల, సిద్ధిగాం, హరిపురం, సిరిపురం, పొత్తంగి, అంబుగాం పరిధిలో అనుమతికి మించి లేఅవుట్లు వెలిశాయి. వాటికి అవసరమైన కంకరను ఆయా ప్రాంతాలకు దగ్గరలోని ప్రభుత్వ, రైతుల డీ పట్టా భూముల్లో తవ్వుతున్నారు. నల్లబొడ్డులూరు వద్ద తొమ్మిది ఎకరాల కొండను మూడొంతులు కొల్లగొట్టేశారు. అధికార పార్టీకి చెందిన కొందరు దీనిపై కన్నేసి రూ.లక్షల్లో వ్యాపారం చేశారు. భైౖరిసారంగపురం వద్ద రుద్రభూమి కొంత భాగంలో కంకర తవ్వకాలు చేపట్టారు. పది అడుగుల లోతు తవ్వడంతో ఆ ప్రదేశం చెరువులా మారింది. రట్టి, గుడ్డిభద్ర, అల్లిమెరక ప్రాంతాల్లో డీపట్టా భూములు, మరికొన్ని చోట్ల చెరువు గట్టులను కొల్లగొడుతున్నారు. రోజుకు వందల సంఖ్యలో ట్రాక్టర్లతో మట్టి తరలిపోతోంది.
ప్రభుత్వ ఆదాయానికి గండి.. ప్రభుత్వ నిర్మాణాలకు కంకర వినియోగించినప్పుడు క్యూబిక్ మీటరుకు రూ.50 సీనరేజీ కింద ఖజానాకు జమ అవుతుంది. ట్రాక్టర్కు రూ.125 చొప్పున సీనరేజీ కింద ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. ప్రైవేటు నిర్మాణాలకు పెద్దఎత్తున తరలిస్తుండటంతో నష్టం వాటిల్లుతోంది.
నిఘా పెంచుతాం..
- ఆర్.జైభీం, సీఐ, ఎస్ఈబీ, సోంపేట
అనుమతి లేకుండా ఇసుక, కంకర, మట్టి తవ్వకాలు చేపట్టకూడదు. అక్రమంగా ఎవరు తరలించినా నేరమే. దీనిపై నిఘా పెంచుతాం. పట్టుబడిన వాహనాలను పోలీసులకు అప్పగించి సీజ్ చేయిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
[ 27-04-2024]
‘పల్లెల్లో అందరూ కలిసి ముందడుగు వేయండి. ఒకే మాటపై నిలబడండి. స్థానిక సంస్థల ఎన్నికలు ఏకగ్రీవం చేసుకుంటే ప్రోత్సాహక నిధులు మంజూరు చేస్తాం’ అని వైకాపా ప్రభుత్వం మూడేళ్ల కిందట పంచాయతీ ఎన్నికల సమయంలో ప్రకటించింది. -
95 ఆమోదం.. 28 తిరస్కరణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లావ్యాప్తంగా దాఖలైన నామపత్రాల పరిశీలన శుక్రవారం జరిగింది. 8 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్ స్థానాలకు సంబంధించి వచ్చిన నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల పరిశీలకులు, అభ్యర్థుల సమక్షంలో పరిశీలించారు. -
వైకాపా అభ్యర్థుల నామపత్రాలపై అభ్యంతరాలు
[ 27-04-2024]
-
కలమట బాధ్యతల స్వీకరణ
[ 27-04-2024]
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. -
ఓటర్లు 18,75,934 మంది
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా ఓటర్ల కొత్త జాబితా ఖరారైంది. ఈ నెల 15 నాటికి నమోదైనవారికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. -
మృత్యువులోనూ వీడని బంధం!
[ 27-04-2024]
వారిద్దరూ వివాహ బంధంతో ఒకటయ్యారు. పిల్లల్ని పెంచి పెద్ద చేసి.. పెళ్లిళ్లు కూడా జరిపించారు. -
దశాబ్దాల వ్యధ.. శంకుస్థాపనకే పరిమితమైన కథ..!
[ 27-04-2024]
మూడు వైపులా మహేంద్రతనయ నది నీరు, మరో వైపు పంట పొలాలు. గ్రామం నుంచి బయటకు రావాలంటే నాటు పడవే శరణ్యం ఇదీ హిరమండలంలోని జిల్లేడుపేట గ్రామస్థుల పరిస్థితి. -
చుక్కలు చూపిస్తున్నారు
[ 27-04-2024]
పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలోని కొండి, పూజారి వీధులకు బోరు నీరే తాగు నీరు. బోరు వేసే సమయంలో 100 అడుగులు మాత్రమే తవ్వి వదిలేయడంతో క్రమేపీ నీటి లభ్యత తగ్గిపోయింది. -
ఇది మీ పాలనకు మచ్చు తునక
[ 27-04-2024]
వైకాపా పాలనలో రోడ్లు ఎలాంటి దీన స్థితిలో ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఇచ్ఛాపురంలోని పలు గ్రామాల్లోని రోడ్లు ఛిద్రమై వాహనదారులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. -
నగరమంతా.. ట్రాఫిక్ తంటా
[ 27-04-2024]
రోజురోజుకు పెరుగుతున్న జనాభా దృష్ట్యా నగరంలో నిత్యం ట్రాఫిక్ సవస్యలు అధికమవుతున్నాయి. డేఅండ్నైట్, రామలక్ష్మణ, సూర్యమహల్, అరసవల్లి మిల్లు, పొట్టిశ్రీరాములు, ఏడురోడ్ల కూడళ్లలో వాహనాల రద్దీతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
అరాచక పాలనకు చరమగీతం పాడాలి
[ 27-04-2024]
రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని భాజపా ఎచ్చెర్ల ఎమ్మెల్యే అభ్యర్థి నడుకుదటి ఈశ్వరరావు అన్నారు. -
కూటమి విజయం ఖాయం
[ 27-04-2024]
కొద్ది రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి అఖండ విజయం ఖాయమని తెదేపా ఆమదాలవలస ఎమ్మెల్యే అభ్యర్థి కూన రవికుమార్ ధీమా వ్యక్తం చేశారు. -
జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాం
[ 27-04-2024]
అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకరరావు పేర్కొన్నారు. -
వచ్చే ఎన్నికల్లో కూటమి విజయం ఖాయం
[ 27-04-2024]
వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని ఎంపీ రామ్మోహన్నాయుడు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా