కోడ్ కూసి నెలవుతున్నా మొద్దునిద్రే..!
పోలాకిలో ఎంపీడీవో కార్యాలయం సమీపంలో ఉన్న శిథిల తుపాను భవనంలో కొన్ని నెలలుగా రైతు భరోసా కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. వైకాపా రంగులతో భవనం ఉన్నా అధికారులు పట్టించుకోలేదు.
మందసలో వైకాపా రంగులతో ఆర్బీకే భవనం
న్యూస్టుడే, పోలాకి, మందస: పోలాకిలో ఎంపీడీవో కార్యాలయం సమీపంలో ఉన్న శిథిల తుపాను భవనంలో కొన్ని నెలలుగా రైతు భరోసా కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. వైకాపా రంగులతో భవనం ఉన్నా అధికారులు పట్టించుకోలేదు. ఎన్నికల కోడ్ అమలు చేయాల్సిన వారు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఏవో చిరంజీవి మాట్లాడుతూ రంగులు మార్చడానికి చర్యలు తీసుకుంటామన్నారు.
- మందస మండల కేంద్రంలోని రైతు భరోసా కేంద్రం- 2 భవనంపై వైకాపా రంగులు దర్శనమిస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా అధికారులు స్పందించ లేదని పలువురు వాపోతున్నారు. చర్యలు తీసుకుంటామని తహసీల్దారు తిరుమలబాబు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!