logo

తెదేపా, భాజపాలోకి భారీగా చేరికలు

లావేరు మండలం పెద్దలింగాలవలస సర్పంచి ప్రతినిధి, లుకలాపు అప్పలనాయుడు, ఇతర నేతలు శుక్రవారం భాజపాలో చేరారు.

Published : 20 Apr 2024 04:48 IST

పురందేశ్వరి సమక్షంలో భాజపాలో చేరిన లావేరు నేతలు

లావేరు, నరసన్నపేట, గుజరాతీపేట(శ్రీకాకుళం), మెళియాపుట్టి, న్యూస్‌టుడే: లావేరు మండలం పెద్దలింగాలవలస సర్పంచి ప్రతినిధి, లుకలాపు అప్పలనాయుడు, ఇతర నేతలు శుక్రవారం భాజపాలో చేరారు. రాజమహేంద్రవరంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సమక్షంలో భాజపా తీర్థం పచ్చుకున్నారు. ్య  కరగాం, గొట్టిపల్లి పంచాయతీల నుంచి 600 కుటుంబాలు వైకాపాను వీడి నరసన్నపేట కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి రమణమూర్తి సమక్షంలో తెదేపాలో చేరాయి. ్య తులసీ వరప్రసాద్‌ ఆధ్వర్యంలో కేరాసింగి గిరిజన గ్రామానికి చెందిన 80కి పైగా కుటుంబాలు తెదేపాలో చేరాయి.్య విశాఖ ఏ కాలనీలోని గొండు శంకరరావు కార్యాలయంలో గూడెం పంచాయితీకి చెందిన 25 కుటుంబాలు తెదేపాలో చేరాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని