అడ్డదారిలో అద్దెకు..!
కాశీబుగ్గ నడిబొడ్డున రూ.కోట్లు విలువ చేసే స్థలమది. గతంలో గ్రామ పరిపాలనాధికారుల (వీఆర్వో) సంఘానికి కేటాయించారు.
రూ.కోట్లు విలువ చేసే భవనం అప్పగించేందుకు సన్నాహాలు
కాశీబుగ్గలోని వీఆర్వోల సంఘ భవనం
కాశీబుగ్గ, న్యూస్టుడే: కాశీబుగ్గ నడిబొడ్డున రూ.కోట్లు విలువ చేసే స్థలమది. గతంలో గ్రామ పరిపాలనాధికారుల (వీఆర్వో) సంఘానికి కేటాయించారు. అక్కడ భవనాన్ని నిర్మించి కొన్నేళ్లు లీజుకు ఇచ్చారు. గడువు తీరడంతో ఏడాది క్రితం రెవెన్యూ అధికారులను ఖాళీ చేయించారు. తాజాగా పురపాలక సంఘంలోని ఓ కౌన్సిలర్ బంధువుకు అద్దె పేరుతో అప్పగించే పని జరుగుతోంది. అందుకు కొంతమంది రెవెన్యూ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
గుట్టుచప్పుడు కాకుండా..
కాశీబుగ్గ ఎస్సీ కాలనీ (న్యూకాలనీ)లో సుమారు 30 ఏళ్ల కిత్రం వీఆర్వోల సంఘానికి స్థలం కేటాయించారు. అందులో భాగంగా భవన నిర్మాణం చేపట్టి లీజు పద్ధతిలో 1999లో స్థానికంగా ఓ వ్యక్తికి అప్పగించారు. గడువు పూర్తవడంతో 2022 డిసెంబరులో అప్పటి జిల్లా అధికారుల ఆదేశాల మేరకు తహసీల్దారు మధుసూదన్ ఆధ్వర్యంలో భవనం స్వాధీనం చేసుకున్నారు. భవనానికి మరమ్మతులు చేసి వినియోగంలోకి తెచ్చేందుకు రెవెన్యూ అధికారులు సన్నాహాలు చేశారు. ఇంతలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. తాజాగా కొంతమంది రెవెన్యూ ఉద్యోగుల సహకారంతో కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన ఓ మున్సిపల్ కౌన్సిలర్ బంధువుకు అద్దెకు ఇచ్చేందుకు పావులు కదిపారు. రూ.3 లక్షలు అడ్వాన్స్ తీసుకుని నెలకు రూ.7,500 అద్దె ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్లు తెలిసింది. రూ.కోట్లు విలువ చేసే భవనాన్ని ఇతరులకు అప్పగించేటప్పుడు స్థానికంగా ఉండే ఆర్డీవో, తహసీల్దారు వంటి అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే డివిజన్ పరిధిలోని వీఆర్వోల అభిప్రాయం తీసుకోవాలి. ఇవేమీ జరగకుండా భవనాన్ని అప్పగించినట్లు తెలిసింది. మరో వైపు ఈ భవనంలో ఒక గదిని గత కొంత కాలంగా అనధికారికంగా ఇతరులకు అప్పగించినట్లు స్పష్టమవుతోంది. దీనిపై రెవెన్యూ ఉన్నతాధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
మూడేళ్లకు ఒప్పందం
నెలకు రూ.7,500 అద్దె ప్రాతిపదికన మూడేళ్లకు ఒప్పందం కుదిరింది. అడ్వాన్స్ విషయం నా దృష్టిలో లేదు. వృథాగా ఉండటంతో అద్దెకు ఇవ్వాలని నిర్ణయించాం. భవనం పై భాగం మరమ్మతులు చేయాల్సి ఉంది.
సోమేశ్వరరావు, వీఆర్వోల సంఘ నాయకుడు, పలాస మండలం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉప్పొంగిన వనితోత్సాహం..!
[ 15-05-2024]
జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. గత ఎన్నికల కంటే ఓటింగ్ శాతం పెరగడమే అందుకు నిదర్శనం. ఈసారి మహిళలు పెద్ద ఎత్తున ఓటేసేందుకు తరలి వచ్చారు. నేతల తలరాతలను నిర్ణయించడంలో వారి తీర్పే శాసనం కానుంది. పురుషుల కంటే వారి ఓట్లే ఎక్కువగా పోలయ్యాయి. -
గాలి కూటమి వైపే..!
[ 15-05-2024]
జిల్లా వ్యాప్తంగా సోమవారం అర్ధరాత్రి దాటే వరకు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగింది. పలుచోట్ల ఉద్రిక్తతల నడుమ ప్రక్రియ ముగిసింది. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది.. అభ్యర్థులు ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. -
మార్టులన్నారు.. మాట మార్చారు..!
[ 15-05-2024]
స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక స్వావలంబనకు మండలానికో మహిళా మార్టు ఏర్పాటు చేస్తామని గతంలో వైకాపా ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేసింది. ఆ తరువాత నియోజకవర్గానికి ఒకటేనని ప్రకటించింది. చివరకు పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన శ్రీకాకుళం, నరసన్నపేట నియోజకవర్గాల్లో మాత్రమే ఏర్పాటు చేసి ఊరుకుంది. -
తెదేపా కార్యకర్తపై దాడి
[ 15-05-2024]
మందస మండలం హరిపురంలో మంగళవారం తెదేపా కార్యకర్త కనగల రామారావుపై అదే గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్త కర్ర అనిల్ దాడి చేశాడు. హరిపురంలోని 162 పోలింగ్ కేంద్రంలో రామారావు తెదేపా తరఫున ఏజెంటుగా ఉన్నారు. -
తెదేపాకు ఓటేశారని ఇంటికి తాళం
[ 15-05-2024]
తెదేపాకు ఓటేశారనే అక్కసుతో వైకాపా శ్రేణులు ఓ కుటుంబంపై కక్ష కట్టిన ఉదంతమిది. పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధి చినబడాంకు చెందిన పి.మన్మధరావు భార్య సుజాతతో కలిసి ఓటు వేయడానికి విజయనగరం నుంచి వచ్చారు. -
తీర్పు భద్రం
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లా ఓటర్ల తీర్పును ఎన్నికల అధికారులు భద్రపరిచారు. ఈవీఎంలు, వీవీప్యాట్లను ఎచ్చెర్ల మండలం చిలకపాలెం సమీపంలోని శ్రీ శివాని ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంల్లో మూడంచెల భద్రత నడుమ ఉంచారు. -
ముందే మేల్కొనకుంటే ముప్పే..!
[ 15-05-2024]
జాతీయ రహదారిలో లావేరు మండలం బుడుమూరు కూడలి సమీపంలో 2023 జూన్లో వ్యాన్ టైరు పేలి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో విజయనగరం జిల్లా డెంకాడ మండలానికి చెందిన ముగ్గురు మృత్యవాత పడ్డారు. ఇందులో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. -
మోదీకి శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రత్యేక వస్త్రం
[ 15-05-2024]
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మూడోసారి పీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని, ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు మోదీ, చంద్రబాబు, పవన్కల్యాణ్, లోకేశ్ ముఖ చిత్రాలతో ప్రత్యేక వస్త్రాన్ని తయారు చేస్తున్నట్లు లావేరు మండలంలోని వస్త్రపురికాలనీకి చెందిన బాసిన నాగేశ్వరరావు, లక్ష్మీ తెలిపారు. -
పాము కాటుకు యువకుడి బలి
[ 15-05-2024]
మండలంలోని పెద్దలవునిపల్లి గ్రామానికి చెందిన లఖినాన శివానందం (24) పాము కాటుకు గురై మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి భోజనాలు ముగిసిన తర్వాత శివానందం తల్లి పార్వతి, సోదరుడు పవన్ ఇంట్లో నిద్రపోయారు. అర్ధరాత్రి కట్ల పాము అతడిని కరిచింది. -
వైకాపా నేతలపై ఫిర్యాదు
[ 15-05-2024]
టెక్కలి పంచాయతీ కార్యాలయంలో సోమవారం ఎన్నికల సమయంలో జరిగిన ఘర్షణపై తెదేపా బూత్ ఏజెంట్ రెయ్యి ప్రీతిష్ చంద్ర టెక్కలి పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
తుపాకీతో కాల్చుకొని.. సచిన్ సెక్యూరిటీగార్డు ఆత్మహత్య..!
-
ప్రాజెక్ట్ అస్త్ర.. జీమెయిల్లో జెమినీ.. లెక్కల్లో సాయం.. గూగుల్ కొత్త అప్డేట్స్!
-
చెట్టును ఢీకొన్న కారు.. మంటలు చెలరేగి వృద్ధ దంపతులు మృతి
-
‘ఒక్కటి’ దక్కాలంటే.. రాజస్థాన్ ‘రెండు’ గెలవాల్సిందే!
-
నేను బెంగళూరుపై ఆడుంటే.. ఈ పాటికే ప్లేఆఫ్స్కు చేరేవాళ్లమేమో!: పంత్
-
తప్పుడు వార్తలపై మెహరీన్ అసహనం.. క్షమాపణ చెప్పాలని డిమాండ్