logo

చంద్రబాబుతోనే ప్రగతి సాధ్యం

తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును ముఖ్యమంత్రి చేస్తేనే రాష్ట్రం ప్రగతి బాటలో పయనిస్తుందని సినీ నటుడు నారా రోహిత్‌ పేర్కొన్నారు. జిల్లాలో శనివారం ఆయన పర్యటించారు.

Published : 05 May 2024 04:55 IST

తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును ముఖ్యమంత్రి చేస్తేనే రాష్ట్రం ప్రగతి బాటలో పయనిస్తుందని సినీ నటుడు నారా రోహిత్‌ పేర్కొన్నారు. జిల్లాలో శనివారం ఆయన పర్యటించారు. మందస మండలంలో పలాస కూటమి అభ్యర్థి గౌతు శిరీషతో పాటు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆమెతో కలిసి పిడిమందస, నర్సింగపురం, మందస, హొన్నాలి, జిల్లుండ పంచాయతీల్లోని ఇంటింటికీ వెళ్లి శిరీషను గెలిపించాలని కోరారు. అంతకుముందు కూటమి ఎచ్చెర్ల ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్‌.ఈశ్వరరావు, ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడి తరఫున రణస్థలంలో ప్రచారం చేశారు. అధిక మెజారిటీతో ఇద్దరినీ గెలిపించాలని అభ్యర్థించారు.

న్యూస్‌టుడే, మందస, రణస్థలం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని