‘దీవెన’ పేరుతో దగా!
జడ్పీ, ఇతర సమావేశాల్లో ప్రజాప్రతినిధులకు అధికారులు ఇచ్చే వివరాల్లో వసతి దీవెన రెండు విడతలకు ఒకసారే ఇచ్చారని నమోదు చేస్తున్నారు. ప్రభుత్వం విద్యార్థులందరికీ రెండో విడత జమ చేయనట్లే లెక్క.
ఒక విడతకే పరిమితం చేసిన జగనన్న
న్యూస్టుడే, పాతశ్రీకాకుళం
జడ్పీ, ఇతర సమావేశాల్లో ప్రజాప్రతినిధులకు అధికారులు ఇచ్చే వివరాల్లో వసతి దీవెన రెండు విడతలకు ఒకసారే ఇచ్చారని నమోదు చేస్తున్నారు. ప్రభుత్వం విద్యార్థులందరికీ రెండో విడత జమ చేయనట్లే లెక్క. రెండేళ్ల ఐటీఐ కోర్సు అభ్యసించే విద్యార్థులకు రూ.10 వేల చొప్పున బాకీ పడినట్లే. పాలిటెక్నిక్ విద్యార్థులకు మూడేళ్లకు కలిపి రూ.22,500 చొప్పున అందజేయాలి. డిగ్రీ, ఇంజినీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులకు ఏడాదికి రూ.10 వేలు చొప్పున ఒక్కొక్కరికి రూ.30 వేలు ఇవ్వాలి. ‘బాకీ సొమ్ము ఎప్పుడు ఇస్తావు జగనన్నా’ అంటూ లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. ఇస్తానని చెప్పడం ఎందుకు..ఇవ్వకుండా జాప్యం చేయడంలో ఆంతర్యం ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు.
చెప్పిందొక్కటి..: పదో తరగతి, ఇంటర్మీడియట్ తరువాత ఉన్నత, వృత్తి విద్యా కోర్సులు అభ్యసించే విద్యార్థులకు పుస్తకాలు, ఇతరత్రా అవసరాల నిమిత్తం వసతి దీవెన పేరిట ఉపకార వేతనం రెండు విడతల్లో తల్లుల ఖాతాలకు జమ చేస్తామని వైకాపా ఎన్నికల ప్రణాళికలో ప్రకటించింది. ఐటీఐ విద్యార్థులకు ఏడాదికి రూ.10 వేలు, పాలిటెక్నిక్ చదువుతున్న వారికి రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ, ఇతర వృత్తి విద్యా కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేలు జమ చేస్తామని స్పష్టం చేసింది.
చేసిందొకటి..: విద్యార్థులకు అందుతోంది ఒక విడతే. సగం మాత్రమే ఇస్తున్నారు. మూడేళ్లుగా ఇదే పద్ధతి అనుసరిస్తున్నారు. 2023-24 విద్యా సంవత్సరం మొత్తానికి వసతి దీవెన కింద ఒక విడత కూడా ఇవ్వలేదు. పేద విద్యార్థుల చదువుకు అవసరమైన పుస్తకాలు, రవాణా, ఇతర ఖర్చుల నిమిత్తం జగన్ ప్రభుత్వం వసతి దీవెన పేరిట సంక్షేమ పథకం ప్రవేశపెట్టింది. విద్యా సంవత్సరం పూర్తయి సంస్థలను వదిలి బయటకు వెళ్లిపోతున్నా సొమ్ము మాత్రం అందలేదు. కొంత ఆలస్యమైనా డబ్బులు వస్తాయని ఆశతో ఉన్న వారు ఎదురుచూస్తూనే ఉన్నారు.
డిగ్రీ పూర్తయినా డబ్బులు రాలేదు..
- జి.ప్రవీణ్కుమార్, శ్రీకాకుళం
నేను గత విద్యా సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేశా. మూడేళ్లలో వసతి దీవెన కింద ఏడాదికి రూ.10 వేల చొప్పున జమైంది. రెండో విడత కోసం అధికారులను సంప్రదిస్తే ఇస్తారని చెబుతున్నారు. మూడేళ్లకు కలిపి రూ.30 వేలు రావాలి. చదువు పూర్తయినా డబ్బులు రాలేదు. ఆ సొమ్ము విడుదల చేస్తే పోటీ పరీక్షలకు తర్ఫీదు పొందడానికి ఉపయోగపడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీడని గ్రహణం..!
[ 18-05-2024]
దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న గంగాసాగరం జలాశయం పనులు ఐదేళ్లుగా ముందుకు కదలకపోవడంతో రైతులు సాగుకి దూరమయ్యే పరిస్థితి నెలకొంది. -
పోలీసు వలయంలో మూలపేట
[ 18-05-2024]
సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్టు పరిసర ప్రాంతాలు శుక్రవారం పోలీసుల ఆధీనంలోకి వెళ్లాయి. -
పారిశుద్ధ్య కార్మికుడి దారుణహత్య
[ 18-05-2024]
జిల్లా కేంద్రంలో దారుణ హత్య జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు నిద్రిస్తున్న యువకుడి గొంతు కోసి హతమార్చిన ఘటన శ్రీకాకుళం నగరంలో గురువారం అర్ధరాత్రి దాటాక చోటు చేసుకుంది. -
ఓటెత్తిన ఉద్యోగులు
[ 18-05-2024]
ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు, ఇతర సిబ్బంది పెద్దఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలో పని చేస్తున్న ఉద్యోగులు, ఇతర సిబ్బంది కలిపి 25,448 మంది ఉన్నారు. -
కట్టడం కుదరనప్పుడు ఎందుకు కూల్చేశారు..?
[ 18-05-2024]
అనువుగాని ప్రదేశంలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ మైదానం నిర్మిస్తామని చెప్పి అధికార పార్టీ నాయకులు మాయమాటలు చెప్పారు. -
పుట్టెడు శోకంలోనూ ఔదార్యం!
[ 18-05-2024]
ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబ సభ్యులు పుట్టెడు శోకంలోనూ ఔదార్యం చాటుకున్నారు. -
నత్తనడకన నీటి తీరువా పనులు
[ 18-05-2024]
వంశధార కాలువల పరిస్థితి రోజురోజుకీ అత్యంత దయనీయంగా మారుతోంది. దశాబ్దాల కాలంగా అవి నిర్వహణకు నోచుకోకపోవడంతో కునారిల్లుతున్నాయి.