logo

పోలింగ్‌ కేంద్రంలో కలెక్టర్‌ నిశిత పరిశీలన

పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ కేంద్రాలను ఆదివారం జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ పరిశీలించారు.

Published : 06 May 2024 05:49 IST

ఏర్పాట్లపై అసహనం

సిబ్బందితో మాట్లాడుతున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌

నరసన్నపేట, న్యూస్‌టుడే: పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ కేంద్రాలను ఆదివారం జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ పరిశీలించారు. స్థానిక జూనియర్‌ కళాశాల ఆవరణలో నాలుగు మండలాలకు చెందిన 5 పోలింగ్‌  కేంద్రాలను ఆయన నిశితంగా పరిశీలించారు. ఓటర్లు, పోలింగ్‌ ఉద్యోగులతో ఆయన మాట్లాడారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి పలు సూచనలిచ్చారు. పోలింగ్‌ ఏర్పాట్లపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. దాదాపు గంటంపావు కాలం పాటు పోలింగ్‌ కేంద్రాల వద్దే ఉన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో అధిక సంఖ్యలో ఉద్యోగ ఓటర్లు ఉండటాన్ని ఆయన గమనించి పరిస్థితిని చక్కదిద్దారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన చర్యలపై ఆర్వో రామ్మోహనరావుకు పలు సూచనలు చేశారు. కాలేజీ రోడ్డులో రాజకీయ పార్టీల ప్రచారం లేకుండా చూడాలని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని