వైకాపా నుంచి తెదేపాలో చేరికలు
కోటబొమ్మాళి మండలంలోని నిమ్మాడలోని టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు కార్యాలయంలో సోమవారం ఆయన సమక్షంలో వైకాపా నుంచి పలువురు తెదేపాలో చేరారు.
కోటబొమ్మాళి, సారవకోట, న్యూస్టుడే: కోటబొమ్మాళి మండలంలోని నిమ్మాడలోని టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు కార్యాలయంలో సోమవారం ఆయన సమక్షంలో వైకాపా నుంచి పలువురు తెదేపాలో చేరారు. టెక్కలి, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి మండలాల నుంచి సుమారు రెండు వందల కుటుంబాలు తెదేపాలో చేరాయి. సంతబొమ్మాళి మండలం మేఘవరం పంచాయతీ వాసులు, బోరుభధ్ర పంచాయతీ గొదలాం గ్రామ ఉప సర్పంచి కూన భాస్కరరావు, మరికొందరితో పాటు నలభై కుటుంబాలు వైకాపా నుంచి తెదేపాలో చేరాయి. టెక్కలి మండలం అయోధ్యపురం నుంచి వార్డు సభ్యులు కంచరాన యోగి, బగాది శ్రీనివాసరావు, వాలంటీర్లు చిన్నారావు, బగాది ప్రదీప్, కంచరాన కవిత, సహకార డైరెక్టర్ అశోక్కుమార్ తదితరులతో పాటు నలభై కుటుంబాలు, ముఖలింగాపురానికి చెందిన వాలంటీరు జెన్ని కాంతారావుతో పాటు 25 కుటుంబాలు చేరాయి. కోటబొమ్మాళి మేజర్ పంచాయతీ ప్రకాష్నగర్ కాలనీకు చెందిన యాభై మంది యువకులు, కురుడు పంచాయతీ ఎరకయ్యపేటకు చెందిన సూర్యనారాయణ తదితరులతో పాటు 25 కుటుంబాలు తెదేపాలో చేరాయి.
సారవకోట మండలంలోని పద్మాపురం గ్రామానికి చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యుడు రావాడ చెంచయ్యతో పాటు కేలవలస ఉప సర్పంచి చింతు లక్ష్మణరావు పంచాయతీకి చెందిన 150 కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలో చేరాయి. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బగ్గు రమణమూర్తి వీరికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా స్వాగతించారు.
త్రైత సిద్ధాంత భగవద్గీతపై ప్రచారం..
సారవకోట, న్యూస్టుడే: మండలంలోని వాండ్రాయి, చిన్నగుజ్జువాడ, బెజ్జి, మూగుపురం, కొమ్ముసరియాపల్లి తదితర గ్రామాల్లో త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి ఇందూ జ్ఞానవేదిక సత్రాం కమిటీ అధ్యక్షుడు గుండ జనార్దనరావు ఆధ్వర్యంలో భగవద్గీత ప్రచార కార్యక్రమం సోమవారం జరిగింది. సభ్యులు లక్ష్మీకుమారి, తాతయ్య, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆక్రమణలకు అడ్డేది.. అడిగేవారేరి..?
[ 19-05-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నేతలు అండదండలతో సహజ వనరులు అన్యాక్రాంతమయ్యాయి.. -
అన్నదాతను వీడని గండం..!
[ 19-05-2024]
వంశధార కుడి, ఎడమ కాలువలపై ఆధారపడి సాగు చేస్తున్న రైతులకు ఏటా కష్టాలు తప్పట్లేదు. గుర్రపుడెక్క రూపంలో గండం వారిని వేధిస్తోంది. -
నంబర్ 1 కుర్రోడు
[ 19-05-2024]
అకుంఠిత దీక్ష.. పట్టుదలతో శ్రమించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఉత్తమ ఇంజినీర్గా స్థిరపడాలనే ఉద్దేశంతో గమ్యం వైపు పయనిస్తున్నాడు ఈ సిక్కోలు కుర్రాడు. -
స్ట్రాంగ్రూంల వద్ద పటిష్ఠ భద్రతా చర్యలు తీసుకోవాలి
[ 19-05-2024]
ఎన్నికల అనంతరం ఈవీఎంలు, వీవీప్యాట్లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా అన్నారు. -
గోవిందా.. హరి గోవిందా..
[ 19-05-2024]
శ్రీకాకుళం నగరంలోని నారాయణ తిరుమల వెంకటేశ్వరస్వామి, నరసన్నపేటలోని వెంకన్న స్వామి ఆలయాలు శనివారం ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.. -
వైభవంగా శ్రీకూర్మనాథుని కొట్నం దంపు
[ 19-05-2024]
గార మండలం శ్రీకూర్మంలోని కూర్మనాథ క్షేత్రంలో వార్షిక కల్యాణోత్సవంలో భాగంగా శనివారం నిర్వహించిన సుగంధ ద్రవ్య మర్ధన (కొట్నం దంపు) కార్యక్రమం వైభవంగా జరిగింది. -
అటకెక్కిన ప్లాస్టిక్ నిషేధం..!
[ 19-05-2024]
పర్యావరణ పరిరక్షణ, భావితరాల మనుగడను దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పాటు పడుతున్నాయి. -
పారామెడికల్ ఫలితాల్లో ప్రతిభ
[ 19-05-2024]
పారామెడికల్ ఫలితాల్లో పలువురు విద్యార్థులు ప్రతిభ చూపారు. -
పట్టాలు తప్పిన ఇంజినీరింగ్ స్పెషల్ రైలు
[ 19-05-2024]
గంజాం జిల్లాలోని ఛత్రపురం-జగన్నాథపూర్ రైల్వే స్టేషన్ల మధ్యలో శనివారం ఖుర్దావైపు (డౌన్ లైను) వెళుతున్న ఓ ఇంజినీరింగ్ స్పెషల్ రైలు (పట్టాలు, ఇతర సామగ్రి ఉండే రైలు) మూడు చక్రాలు పట్టాలు తప్పాయి. -
విద్యార్థులు సురక్షితంగా స్వదేశానికి వచ్చేలా చూడండి
[ 19-05-2024]
కిర్గిజిస్థాన్లో ఉన్న జిల్లాకు చెందిన విద్యార్థులు సురక్షితంగా స్వదేశానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్కు శ్రీకాకుళం ఎంపీ కె.రామ్మోహన్నాయుడు శనివారం లేఖ రాశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్
-
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!
-
ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్గేల్తో రిషబ్ ఫొటో
-
ఎయిర్లైన్స్ లాభాల్లో బిగ్ జంప్.. ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్..
-
బలహీనపడిన ఆవర్తనం.. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు
-
తెలంగాణ కేబినెట్ భేటీ.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ