సముద్రమంత కష్టం.. వలస బతుకులే శరణ్యం
మత్స్యకారుడైన అప్పలరాజు మత్స్య శాఖకు మంత్రి కాగానే ఆ సామాజిక వర్గీయులు సంబరపడ్డారు. కష్టాలు తీరుతాయని ఆశించారు. వీలున్నప్పుడల్లా ఆయనను కలిసి సమస్యలు విన్నవించారు.
జెట్టీల ఊసే లేదు.. ఫిషింగ్ హార్బర్ పట్టాలెక్కదు
హామీలకే పరిమితమైన మంత్రి అప్పలరాజు
న్యూస్టుడే, సోంపేట, సంతబొమ్మాళి
మత్స్యకారుడైన అప్పలరాజు మత్స్య శాఖకు మంత్రి కాగానే ఆ సామాజిక వర్గీయులు సంబరపడ్డారు. కష్టాలు తీరుతాయని ఆశించారు. వీలున్నప్పుడల్లా ఆయనను కలిసి సమస్యలు విన్నవించారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చినా ఐదేళ్లలో మంత్రిగా చేసిందేమీ లేకపోవడంతో ఉసూరుమనడం వారి వంతైంది. జీవనోపాధి నిమిత్తం ఎప్పటిలాగే ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి బతుకు పోరాటం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ‘అధికారంలోకి వస్తే తీర ప్రాంతం రూపురేఖలు మారుస్తాం.. ఇక్కడి నుంచి వలసలు లేకుండా చేస్తాం’ అని చెప్పిన జగన్ ఆ ఊసే మరిచారు. ఒక జెట్టీ నిర్మించకపోగా ఫిషింగ్ హార్బర్ నిర్మాణం అతీగతీ లేకుండా ఉంది. ఉపాధి దిశగా చర్యలు తీసుకోక పోవడంతో మత్స్యకారులు స్వగ్రామాలను వదిలి వెళ్తున్నారు.
ఇదీ పరిస్థితి..
సోంపేట మండలం ఉప్పలాం పంచాయతీలో రెండు వేలకు పైగా మత్స్యకార కుటుంబాలకు చేపల వేటే ఆధారం. సంప్రదాయ వేటతో తగినంత ఆదాయం రాక 900 మందికి పైగా అండమాన్, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, గోవా, కేరళ తదితర రాష్ట్రాలకు వలస వెళ్లి ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ నెలలో 25 రోజుల వరకు సముద్రంపై ఉండి వేట సాగించినా రూ.30 వేల లోపు ఆదాయం సమకూరుతోంది. స్టీమర్లు వినియోగించే అవకాశం ఉంటే రూ.70 వేలకు పైగా సంపాదించవచ్చు.
- జిల్లాకు చెందిన 32 వేల మందికి పైగా మత్స్యకారులు ఇతర ప్రాంతాల్లో ఉన్నారు. స్టీమర్లు, ఆధునిక మర పడవల్లో వేటకు వెళ్లి రెండు, మూడు వారాల పాటు సముద్రంపై ఉంటున్నారు. ప్రమాదవశాత్తు మృతి చెందితే కుటుంబ సభ్యులు ఆఖరి చూపునకు నోచుకోలేని దుస్థితి నెలకొంది.
- ఆధునిక వేటకు సిక్కోలు తీరంలో కనీస వసతులు లేవు. సముద్రం పైకి పడవ పంపాలన్నా.. వేట నుంచి తిరిగి ఒడ్డుకు చేరాలన్నా ఆపసోపాలు పడాల్సి వస్తోంది. సాధారణ పడవలపై ఎనిమిది నాటికల్ మైళ్ల లోపే వేట సాగిస్తుండటంతో పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు.
- తమిళనాడు, కేరళ, కర్ణాటక, గుజరాత్, పుదుచ్చేరి, గోవా, అండమాన్-నికోబార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర తదితర తీర ప్రాంత రాష్ట్రాల్లో సగటున 30 కి.మీ.కు ఒక జెట్టీ నిర్మించారు. ఫిషింగ్ హార్బర్లు ఉండటంతో వేట సాగించేందుకు అనువైన పరిస్థితి ఉంటుంది.
కొందరికే భరోసా..మత్స్యకారులకు వేట విరామ సమయంలో అందించే భరోసా, పింఛన్లు అరకొరగా ఇస్తున్నారు. వివిధ నిబంధనలతో మత్స్యకార భరోసా కొందరికే పరిమితం చేశారు. ఇంజిన్ పడవపై 18 మంది వేటకు వెళ్తుండగా కేవలం ఆరుగురికి, చిన్న పడవలో ఆరుగురు వేటకు వెళ్తుండగా ముగ్గురికే భృతి చెల్లిస్తున్నారు. జిల్లాలో చిన్న, ఇంజిన్ పడవలు ఐదు వేల వరకు ఉన్నాయి.
ప్రకటనలకే పరిమితం
జిల్లాలో ఆరేడు జెట్టీలు ఏర్పాటు చేస్తే వలసల నివారణతో పాటు 1.5 లక్షల కుటుంబాలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే అవకాశముంది. ఇచ్ఛాపురం ప్రాంతంలో రెండు, మూడు జెట్టీల ఏర్పాటుకు అవకాశం ఉంది. మిగిలిన చోట్ల నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేస్తే మత్స్యకారులు, ఇతర వర్గాలకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. ఎన్నికల ముందు పాలకులు ఇచ్చిన హామీలు ప్రకటనలకే పరిమితం అయ్యాయి.
పలాస నియోజకవర్గంలో నువ్వలరేవు వద్ద ఏర్పాటు చేయతలపెట్టిన టి.జెట్టీ పునాదుల దశ కూడా దాటలేదు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఆర్భాటంగా ప్రకటించిన బుడగట్లపాలెం హార్బర్ పరిస్థితి అతీగతీ లేకుండా ఉంది. ఒక హార్బర్ ఏర్పాటుకు చేసే వ్యయంలో నాలుగో వంతుతో నియోజకవర్గానికి ఒక జెట్టీ నిర్మించవచ్చు. తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేసే జెట్టీల ద్వారా రాత్రి, పగలు తేడా లేకుండా వేటకు అవకాశం ఏర్పడుతుంది. జెట్టీల వద్ద కెరటాల తీవ్రత ఉండకపోవడంతో వేట తర్వాత అక్కడ పరికరాలు ఉంచడం..ఇక్కడి నుంచే వేటకు వెళ్లొచ్చు. తుపాన్లు, ఇతర వైపరీత్యాల సమయంలో పడవలు, వేట పరికరాల రక్షణకు అవకాశం ఉంటుంది.
కనీస వసతులు కరవు..
- కె.వెంకటరావు, అధ్యక్షుడు, ఏపీ వలస మత్స్యకారుల సంఘం
జిల్లాలో వేటకు అనువైన కనీస వసతులు లేకపోవడంతో ఇతర ప్రాంతాల్లో కూలీలుగా అదే పని చేస్తున్నాం. 25 రోజుల పాటు సముద్రంపై ఉండటంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఏటా 70 మంది వరకు మత్స్యకారులు మృతి చెందుతున్నారు. మృతదేహాలను స్వగ్రామాలకు తెచ్చే పరిస్థితీ లేదు. ప్రాణాలకు తెగించి వేట సాగిస్తున్నా వచ్చే ఆదాయంలో మత్స్యకారులకు 10 శాతం దక్కడం లేదు. పాలకులు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చక పోవడంతో మత్స్యకారులకు వలస బతుకులే శరణ్యంగా మారాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆక్రమణలకు అడ్డేది.. అడిగేవారేరి..?
[ 19-05-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నేతలు అండదండలతో సహజ వనరులు అన్యాక్రాంతమయ్యాయి.. -
అన్నదాతను వీడని గండం..!
[ 19-05-2024]
వంశధార కుడి, ఎడమ కాలువలపై ఆధారపడి సాగు చేస్తున్న రైతులకు ఏటా కష్టాలు తప్పట్లేదు. గుర్రపుడెక్క రూపంలో గండం వారిని వేధిస్తోంది. -
నంబర్ 1 కుర్రోడు
[ 19-05-2024]
అకుంఠిత దీక్ష.. పట్టుదలతో శ్రమించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఉత్తమ ఇంజినీర్గా స్థిరపడాలనే ఉద్దేశంతో గమ్యం వైపు పయనిస్తున్నాడు ఈ సిక్కోలు కుర్రాడు. -
స్ట్రాంగ్రూంల వద్ద పటిష్ఠ భద్రతా చర్యలు తీసుకోవాలి
[ 19-05-2024]
ఎన్నికల అనంతరం ఈవీఎంలు, వీవీప్యాట్లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా అన్నారు. -
గోవిందా.. హరి గోవిందా..
[ 19-05-2024]
శ్రీకాకుళం నగరంలోని నారాయణ తిరుమల వెంకటేశ్వరస్వామి, నరసన్నపేటలోని వెంకన్న స్వామి ఆలయాలు శనివారం ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.. -
వైభవంగా శ్రీకూర్మనాథుని కొట్నం దంపు
[ 19-05-2024]
గార మండలం శ్రీకూర్మంలోని కూర్మనాథ క్షేత్రంలో వార్షిక కల్యాణోత్సవంలో భాగంగా శనివారం నిర్వహించిన సుగంధ ద్రవ్య మర్ధన (కొట్నం దంపు) కార్యక్రమం వైభవంగా జరిగింది. -
అటకెక్కిన ప్లాస్టిక్ నిషేధం..!
[ 19-05-2024]
పర్యావరణ పరిరక్షణ, భావితరాల మనుగడను దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పాటు పడుతున్నాయి. -
పారామెడికల్ ఫలితాల్లో ప్రతిభ
[ 19-05-2024]
పారామెడికల్ ఫలితాల్లో పలువురు విద్యార్థులు ప్రతిభ చూపారు. -
పట్టాలు తప్పిన ఇంజినీరింగ్ స్పెషల్ రైలు
[ 19-05-2024]
గంజాం జిల్లాలోని ఛత్రపురం-జగన్నాథపూర్ రైల్వే స్టేషన్ల మధ్యలో శనివారం ఖుర్దావైపు (డౌన్ లైను) వెళుతున్న ఓ ఇంజినీరింగ్ స్పెషల్ రైలు (పట్టాలు, ఇతర సామగ్రి ఉండే రైలు) మూడు చక్రాలు పట్టాలు తప్పాయి. -
విద్యార్థులు సురక్షితంగా స్వదేశానికి వచ్చేలా చూడండి
[ 19-05-2024]
కిర్గిజిస్థాన్లో ఉన్న జిల్లాకు చెందిన విద్యార్థులు సురక్షితంగా స్వదేశానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్కు శ్రీకాకుళం ఎంపీ కె.రామ్మోహన్నాయుడు శనివారం లేఖ రాశారు.
తాజా వార్తలు (Latest News)
-
హిందీ ‘గజనీ’.. మురుగదాస్ ఫస్ట్ ఛాయిస్ సల్మాన్
-
అత్యంత పొట్టి మహిళతో ది గ్రేట్ ఖలీ.. వీడియో వైరల్
-
ధోనీ కొట్టిన ఆ భారీ సిక్సే ఆర్సీబీని గెలిపించిందా..?
-
వైకాపా ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాలెట్ల తరలింపు.. కూటమి అభ్యర్థుల ఆందోళన
-
పార్లమెంటు భద్రత.. రంగంలోకి 3300 మంది ‘సీఐఎస్ఎఫ్’ సిబ్బంది
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM