మేము రాలేం.. మీరు వెళ్లండి..!
శ్రీకాకుళం నియోజకవర్గంలో మంత్రి ధర్మాన ప్రచార కార్యక్రమాలకు ఆదరణ తగ్గుతోంది. నిత్యం ఆయన వెంట తిరిగే భజన బృందాలే ప్రచారాల్లో కనిపిస్తున్నాయి. స్థానిక ప్రజలు మాత్రం దూరంగా ఉంటున్నారు.
ధర్మాన ప్రచారానికి జనాలు దూరం
గుజరాతీపేటలో స్థానికులు లేక వెలవెలబోతున్న ధర్మాన ప్రచారం
అరసవల్లి, న్యూస్టుడే: శ్రీకాకుళం నియోజకవర్గంలో మంత్రి ధర్మాన ప్రచార కార్యక్రమాలకు ఆదరణ తగ్గుతోంది. నిత్యం ఆయన వెంట తిరిగే భజన బృందాలే ప్రచారాల్లో కనిపిస్తున్నాయి. స్థానిక ప్రజలు మాత్రం దూరంగా ఉంటున్నారు. ఈ నెల 7న గుజరాతీపేటలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో మంత్రి ధర్మాన మాట్లాడుతూ..‘ఇక్కడున్న నాయకత్వం నన్ను వదిలివెళ్లినా మీరంతా నా వెంటే ఉన్నారు’. అని మాజీ మున్సిపల్ ఛైర్మన్ అంధవరపు వరం కుటుంబసభ్యులను ఉద్దేశించి ప్రసగించారు. వాస్తవానికి ఆరోజు ప్రచారానికి స్థానిక నేతలు, అక్కడ ఉండే ప్రజలు పెద్దగా హాజరుకాలేదు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారే ఎక్కువగా కనిపించారు. వరం కుటుంబం పార్టీని వీడిన నేపథ్యంలో ప్రణాళికా బద్ధంగా కార్యక్రమాన్ని వారి వీధిలో పెట్టించి ఆర్భాటం చేయాలనుకున్న ప్రయత్నం స్థానికులు రాకపోవడంతో బెడిసికొట్టింది. ఇటీవల దండివీధి, మంగువారితోట, బలగ, ఆదివారంపేట, చిత్తరంజన్వీధి సమీపప్రాంతాలు, రామకృష్ణ థియేటర్ పరిసర ప్రాంతాల్లో జరిగిన ప్రచారాల్లోనూ స్థానికుల కంటే స్థానికేతరులు, రాజీనామాలు చేసిన వాలంటీర్లే పాల్గొనడం గమనార్హం.
ప్రణాళికాబద్ధంగా ఆర్భాటాలు..
ధర్మాన ప్రచారానికి అరగంట ముందు ఒక ఆటో పూలదండలు, శాలువాలతో ప్రత్యక్షమవుతుంది. కొందరు నాయకులు ఆ వీధిలోని ఇంటింటికి ఆటోలో వచ్చిన పూలదండలు, శాలువా, హారతి పట్టడానికి కర్పూరం అందజేస్తారు. మంత్రి ప్రచారానికి వచ్చిన వెంటనే అనుకున్నట్లు స్థానికులతో బలవంతంగా ఆర్భాటాలు చేయిస్తున్నారు. కార్యక్రమం అనంతరం ఈ తతంగం చూసినవారంతా నవ్వుకునే పరిస్థితి కనిపిస్తోంది. ప్రజల్లో ఇంత ఆదరణ తగ్గడానికి మంత్రి ధర్మాన వ్యవహార శైలే కారణమనే చర్చ సాగుతోంది. ఎమ్మెల్మేగా ధర్మాన గెలిచిన తరువాత మంత్రి పదవి ఇవ్వలేదని ఆయన అలకబూని సామాన్యులను దగ్గరకు రానివ్వలేదని, ఆ ప్రభావం ఇప్పుడు కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్రీడా రంగంపై నీలినీడలు
[ 20-05-2024]
క్రీడాకారులను ప్రోత్సహించాలన్న మంచి ఉద్దేశంతో తెదేపా హయాంలో అన్ని వసతులు కల్పించి క్రీడా వికాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. -
మండేకాలం.. వీడాలి నిర్లక్ష్యం..!
[ 20-05-2024]
శ్రీకాకుళం గ్రామీణ మండలం కిల్లిపాలెంలో ఈ నెల 8న స్థానిక తోటల్లో ఎండ తీవ్రతకు మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచార మివ్వగా.. -
నిశీధి వేళ.. చిట్టి తాబేళ్లకు రక్ష..!
[ 20-05-2024]
జిల్లాలో సువిశాల సముద్ర తీరం పొడవునా పెద్ద ఇసుక తిన్నెలు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతం ఆలీవ్ రిడ్లే తాబేళ్లకు ఎంతో అనువైన ప్రదేశం. -
సచివాలయ ఉద్యోగిని అవయవదానం
[ 20-05-2024]
పుట్టెడు దుఃఖంలోనూ ఆ కుటుంబ సభ్యులు ఔదార్యాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్కు గురైన సచివాలయ ఉద్యోగిని అవయవ దానం చేసి మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపేందుకు మందుకు వచ్చారు. -
నైపుణ్యం పెంచుకో.. ఉపాధి అవకాశాలు పట్టుకో..!
[ 20-05-2024]
పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించుకొంటూ ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకొనేందుకు ఐటీఐ కోర్సులు దోహదపడుతున్నాయి. -
4,35,049 మంది ఓటుకు దూరం..!
[ 20-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో జిల్లాకు చెందిన మహిళా ఓటర్ల ప్రభంజనం స్పష్టంగా కనిపించింది. అన్నింటా తామే ముందు అని నిరూపించారు. -
పోలీసులమని చెప్పి గుత్తేదారుకు బురిడీ
[ 20-05-2024]
పోలీసులమని చెప్పి గుత్తేదారును బురిడీ కొట్టించిన ఉదంతమిది. ఎస్సై జి.అప్పారావు ఆదివారం తెలిపిన వివరాల మేరకు అనకాపల్లి జిల్లా మామిడిపల్లికి చెందిన ఎన్.మణికంఠ గుత్తేదారుగా విశాఖపట్నంలో పని చేస్తున్నారు. -
హామీలకే పరిమితం..!
[ 20-05-2024]
ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలో వేల ఎకరాలకు సాగునీరు అందించే గ్రోయిన్ల రూపురేఖలు మారడంతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. -
కమనీయం..కూర్మనాథుని కల్యాణం
[ 20-05-2024]
మండల పరిధి శ్రీకూర్మంలోని కూర్మనాథ క్షేత్రంలో ఆదివారం రాత్రి స్వామి వార్షిక కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. -
ఆదిత్యా.. ఎన్నాళ్లీ అవస్థలు?
[ 20-05-2024]
అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వైశాఖ మాసంలో చివరి ఆదివారం, ఏకాదశి పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసి పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
మరో హామీని తుంగలో తొక్కారు.. కాంగ్రెస్ సర్కార్పై హరీశ్రావు విమర్శ
-
నలుగురు ఐసీస్ అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల
-
ప్రశాంతమైన పల్నాడుని వల్లకాడు చేశారు: ధూళిపాళ్ల