ఐఐటీఎం ఆచార్యుడికి ‘ఎన్ఏఈ’ సభ్యత్వం
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీఎం) ఆచార్యులు ఆర్ఐ సుజిత్ ‘యునైటెడ్ స్టేట్స్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజినీరింగ్’ (ఎన్ఏఈ)కి అంతర్జాతీయ సభ్యుడు (ఇంటర్నేషనల్ మెంబర్)గా ఎంపికయ్యారు.
సుజిత్
చెన్నై (వడపళని), న్యూస్టుడే: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీఎం) ఆచార్యులు ఆర్ఐ సుజిత్ ‘యునైటెడ్ స్టేట్స్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజినీరింగ్’ (ఎన్ఏఈ)కి అంతర్జాతీయ సభ్యుడు (ఇంటర్నేషనల్ మెంబర్)గా ఎంపికయ్యారు. ఇంజినీరింగులో అప్లికేషన్స్ ఆఫ్ డైనమికల్ సిస్టమ్స్ థియరీ అర్థం చేసుకోవడం, ఇంజినీరింగ్ సిస్టమ్స్ నిర్వహణలో అందించిన సేవలకు గుర్తుగా ఆయనకు సభ్యత్వం లభించినట్లు ఐఐటీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అంతర్జాతీయంగా ఎంపికైన 18 మందిలో ఆయన ఒకరు. ప్రస్తుతం సుజిత్.. ఐఐటీలోని ఏరోస్పేస్ ఇంజినీరింగు విభాగంలో ప్రధాన ఆచార్యులుగా ఉన్నారు. ఈ సందర్భంగా సుజిత్ను గ్లోబల్ ఎంగేజ్మెంట్ డీన్ ఆచార్యులు రఘునాథన్ రంగస్వామి ప్రత్యేకంగా అభినందించారు. 2003 - 07 వరకు విక్రమ్ సారాబాయ్ అంతరిక్ష కేంద్రంలో డైరెక్టరుగా పనిచేసిన డాక్టర్ బీఎన్ సురేష్ ఎన్ఏఈ సభ్యత్వం పొందారు. ఆ తర్వాత ఎంపికైన రెండో వ్యక్తి సుజిత్ కావడం గమనార్హం. 1988లో ఐఐటీ మద్రాస్లో ఏరో స్పేస్ ఇంజినీరింగులో డిగ్రీ పూర్తి చేసిన ఈయన 1990లో ఎంఎస్ చేశారు. యూఎస్ఏ అట్లాంటాలోని జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి 1994లో పీహెచ్డీ పట్టా పొందారు. కంబస్టన్ ఎక్స్పర్ట్, ప్రిన్స్టన్ ఆచార్యులు సీకే లా, ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ ఆచార్యులు చెన్నుపత్తి జగదీశ్, నెట్వర్క్ సిస్టమ్స్ సైన్స్ అండ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (ఎన్ఎస్ఎస్ఏసీ) డివిజన్ డైరెక్టరు, వర్జీనియా వర్సిటీ బయోకాంప్లెక్సిటీ ఆచార్యులు మాధవ్ మరతే, పలు విభాగాల పరిశోధకులు సుజిత్కు అభినందనలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తండ్రిని చంపిన కుమార్తె అరెస్టు
[ 02-05-2024]
కన్నియాకుమరి జిల్లా పూదప్పాండికి చెందిన సురేష్కుమార్ (46). ఇతనికి వివాహమై ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సురేష్కుమార్కి మద్యం అలవాటు ఉండటంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. -
సన్ పిక్చర్స్కు ఇళయరాజా నోటీసు
[ 02-05-2024]
రజనీకాంత్ నటిస్తున్న ‘కూలి’ చిత్రం టైటిల్ టీజర్లో తన సంగీతాన్ని అనుమతిలేకుండా వాడినట్టు సన్ పిక్చర్స్కు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా నోటీసు పంపారు. -
కునుకు పాట్లు..
[ 02-05-2024]
చేసెందుకు పనెక్కువ ఉంటుంది. శరీరం సహకరించదు, కళ్లు మూసుకుపోతుంటాయి, ఎప్పుడు కునుకేద్దామా అని మనసు లాగేస్తుంటుంది. అటు పని.. ఇటు కాస్తయినా నిద్రపోతే బాగుండనే ఆలోచనలు. -
వృద్ధాప్యం విజయానికి అడ్డుకాలేదు
[ 02-05-2024]
ఆటలాడేందుకు వృద్ధాప్యం అడ్డుకాదని, ముసలితనం శరీరానికేగాని ఆత్మవిశ్వాసానికి కాదని చాటిచెప్పుతున్నారు 76 ఏళ్ల సెల్వరాజ్. ఈ వయసులోనూ ఆయన ఆత్మవిశ్వాసంతో యువకుడిలా క్రీడల్లో సత్తాచాటుతున్నారు. -
పరమత్తిలో 42.5 డిగ్రీలు
[ 02-05-2024]
రాష్ట్రంలో మూడు రోజుల పాటు వేడిగాలుల ప్రభావం ఉంటుందని వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. తమిళనాట ఎప్పుడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. -
ఎదురెదురుగా ఢీకొన్న కార్లు ఒకే కుటుంబానికి చెందిన నలుగురి దుర్మరణం
[ 02-05-2024]
కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాతపడ్డారు. ఈ విషాద ఘటన ఈరోడ్లో చోటుచేసుకుంది. -
మెట్రో రెండోదశలో 300 మలుపులు
[ 02-05-2024]
నగరంలోని మెట్రో రెండోదశలో మూడు వేర్వేరు మార్గాల్లో పనులు శరవేగంగా సాగుతున్నాయి. పూనమల్లి నుంచి పోరూరు కూడలి వరకు ట్రాక్ పనులు ప్రారంభమయ్యాయి. -
వీక్లీ ప్రత్యేక రైళ్లు
[ 02-05-2024]
తాంబరం - సంత్రాగచ్చికి వేసవి రద్దీ కారణంగా వీక్లీ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ రైల్వే మంగళవారం ఓప్రకటనలో తెలిపింది. -
వాహన చోదకులకు మజ్జిగ సరఫరా
[ 02-05-2024]
వేసవి ఎండలు తీవ్రరూపం దాల్చడంతో పలువురు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కాంచీపురం ట్రాఫిక్ పోలీసు విభాగం తరఫున వాహన చోదకుల కోసం బుధవారం పట్టణంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. -
బన్రుట్టి బస్టాండులో దాహం కేకలు
[ 02-05-2024]
కడలూర్ జిల్లా బన్రుట్టి నుంచి చెన్నై, కుంబÅకోణం, తంజావూర్, విళుపురం, నాగపట్టిణం, పేరావూరణి, చిదంబరం, సీర్గాళి, వేలూర్, చిత్తూరు, తిరువణ్ణామలై, తిరుచ్చి తదితర ప్రాంతాలకు సుమారు 200కు పైగా ప్రభుత్వ, ప్రైవేటు బస్సు లు నడుస్తున్నాయి. -
రాతి క్వారీలో పేలుడు
[ 02-05-2024]
విరుదునగర్ జిల్లా కారియాపట్టి సమీప ఆవియూర్ కడంబన్కుళంలో అదే ప్రాంతానికి చెందిన సేతు, రాజపాళయం శ్రీరామ్లకు చెందిన రాళ్ల క్వారీ ఉంది. -
మళ్లీ విశాల్, ముత్తైయ కాంబో?
[ 02-05-2024]
‘మరుదు’లో కలసి పనిచేసిన నటుడు విశాల్, దర్శకుడు ముతైయ కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనున్నట్టు కోలీవుడ్ సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..
-
TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి