దగ్గు సిరప్తో కొవిడ్ నియంత్రణ సాధ్యం
కొవిడ్-19 ఉద్ధృతి తగ్గిందన్న ఊరట కాస్త ఉన్నా.. అది మళ్లీ ఏదో ఒకవిధంగా ముంచుకొస్తుందేమోనన్న భయాలు మాత్రం జనాల్లో ఉన్నాయి. ఈ వైరస్ తీవ్రతను కట్టడి చేయడానికి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా పరిశోధనలు జరుగుతున్నాయి.
ప్రతిపాదించిన 3 వర్సిటీల పరిశోధకులు
ఊపిరితిత్తుల రక్షణకు వ్యాక్సినేషన్ మంచిదని వెల్లడి
ఈనాడు-చెన్నై: కొవిడ్-19 ఉద్ధృతి తగ్గిందన్న ఊరట కాస్త ఉన్నా.. అది మళ్లీ ఏదో ఒకవిధంగా ముంచుకొస్తుందేమోనన్న భయాలు మాత్రం జనాల్లో ఉన్నాయి. ఈ వైరస్ తీవ్రతను కట్టడి చేయడానికి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. చెన్నైలోని ఐఐటీ మద్రాస్ కూడా విభిన్న కోణాల్లో పరిశోధన చేస్తోంది. కొవిడ్ వైరస్ తీవ్రతను దగ్గు సిరప్ ద్వారా, ఎక్స్పెక్టోరంట్్స మందుల ద్వారా తగ్గించొచ్చని వారు ప్రతిపాదిస్తున్నారు. జాదవ్పూర్, నార్త్వెస్టర్న్ యూనివర్సిటీల పరిశోధకులతో కలిసి జరిపిన పరిశోధనలో ఈ విషయాల్ని వెల్లడించారు. ఐఐటీ మద్రాస్కు చెందిన డీన్, అప్లైడ్ మెకానిక్స్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ మహష్ పంచగ్నుల, జాదవ్పూర్ వర్సిటీ న్యూక్లియర్ స్టడీస్ అండ్ అప్లికేషన్ విభాగానికి చెందిన సహాయ ప్రొఫెసర్ డాక్టర్ అరణ్యక్ చక్రవర్తి, నార్త్వెస్టర్న్ యూనివర్సిటీ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ నీలేష్ ఎ.పటంకర్ ఈ పరిశోధన బృందంలో ఉన్నారు. కొవిడ్-19 వైరస్ ముక్కు, గొంతు నుంచి ఊపిరితిత్తులకు వెళ్లే విధానాలపై వీరు పరిశోధించారు. తద్వారా వ్యాధి తీవ్రత ఎలా మారుతోందన్నదానిపై, ఆ తర్వాత ఆ తీవ్రతను ఎలా నియంత్రించొచ్చన్న దానిపై గణితశాస్త్ర నమూనాల్ని ఉపయోగించి ఒక అవగాహనకు వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనల్ని బట్టి.. మ్యూకస్ ద్వారా వైరస్ కదులుతూ శ్వాసనాళాల్లోకి వెళ్తోందని, ఈ వైరస్ రక్తం ద్వారా ఊపరితిత్తుల లోతుల్లోకి చేరుతోందని చెబుతున్నారు. వీటిని సైతం తాజా పరిశోధనలో పరిగణలోకి తీసుకున్నారు. ఐఐటీ మద్రాస్కు చెందిన ప్రొఫెసర్ మహష్ పంచగ్నుల మాట్లాడుతూ.. ‘కొవిడ్-19 మొదటి లక్షణం బయటపడిన తర్వాత రెండున్నర నుంచి ఏడు రోజుల్లో అది నియోనియా, ఇతర ఊపిరితిత్తుల సంబంధ ఇబ్బందులకు దారితీస్తోంది. ఇన్ఫెక్షన్కు గురైన మ్యూకస్ తుంపర్లు ముక్కు, గొంతుద్వారా ఊపిరితిత్తులకు వెళ్లినప్పుడు ఇది సంభవిస్తోంది. మ్యూకస్ తుంపర్లను ఆదిలోనే తగ్గించగలిగితే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అంచనా వేస్తున్నాం. దగ్గు సిరప్, ఎక్స్పెక్టోరంట్్స మందుల ద్వారా తుంపర్లను నియంత్రించవచ్చని ప్రతిపాదిస్తున్నాం. పైగా ఈ ప్రక్రియ గాలిలో కలిసే స్వీయ ఎరోసోలైజ్డ్ బిందువులు వచ్చే మూలాల్ని కూడా నియంత్రించవచ్చు’ అని ఆయన అన్నారు. ఇన్ఫెక్షన్ పెరుగుదల, వ్యాధి తీవ్రత అనేది రోగిలోని ఇమ్యూన్ స్పందన మీద ఆధారపడి ఉంటుందని మరో పరిశోధకులు డాక్టర్ అరణ్యక్ చక్రవర్తి అంటున్నారు. ఇన్ఫెక్షన్కు గురైన మ్యూకస్ తుంపర్లు ముక్కు, గొంతు నుంచి ఊపిరితిత్తుల లోపలి భాగాల్లోకి వెళ్లకుండా మందుల ద్వారా నియంత్రించవచ్చని, నిమోనియా ఇతర ఊపిరితిత్తుల సంబంధ వ్యాధుల్ని వ్యాక్సినేషన్ ద్వారా నియంత్రించవచ్చని ఈ పరిశోధకులు ప్రతిపాదిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తండ్రిని చంపిన కుమార్తె అరెస్టు
[ 02-05-2024]
కన్నియాకుమరి జిల్లా పూదప్పాండికి చెందిన సురేష్కుమార్ (46). ఇతనికి వివాహమై ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సురేష్కుమార్కి మద్యం అలవాటు ఉండటంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. -
సన్ పిక్చర్స్కు ఇళయరాజా నోటీసు
[ 02-05-2024]
రజనీకాంత్ నటిస్తున్న ‘కూలి’ చిత్రం టైటిల్ టీజర్లో తన సంగీతాన్ని అనుమతిలేకుండా వాడినట్టు సన్ పిక్చర్స్కు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా నోటీసు పంపారు. -
కునుకు పాట్లు..
[ 02-05-2024]
చేసెందుకు పనెక్కువ ఉంటుంది. శరీరం సహకరించదు, కళ్లు మూసుకుపోతుంటాయి, ఎప్పుడు కునుకేద్దామా అని మనసు లాగేస్తుంటుంది. అటు పని.. ఇటు కాస్తయినా నిద్రపోతే బాగుండనే ఆలోచనలు. -
వృద్ధాప్యం విజయానికి అడ్డుకాలేదు
[ 02-05-2024]
ఆటలాడేందుకు వృద్ధాప్యం అడ్డుకాదని, ముసలితనం శరీరానికేగాని ఆత్మవిశ్వాసానికి కాదని చాటిచెప్పుతున్నారు 76 ఏళ్ల సెల్వరాజ్. ఈ వయసులోనూ ఆయన ఆత్మవిశ్వాసంతో యువకుడిలా క్రీడల్లో సత్తాచాటుతున్నారు. -
పరమత్తిలో 42.5 డిగ్రీలు
[ 02-05-2024]
రాష్ట్రంలో మూడు రోజుల పాటు వేడిగాలుల ప్రభావం ఉంటుందని వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. తమిళనాట ఎప్పుడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. -
ఎదురెదురుగా ఢీకొన్న కార్లు ఒకే కుటుంబానికి చెందిన నలుగురి దుర్మరణం
[ 02-05-2024]
కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాతపడ్డారు. ఈ విషాద ఘటన ఈరోడ్లో చోటుచేసుకుంది. -
మెట్రో రెండోదశలో 300 మలుపులు
[ 02-05-2024]
నగరంలోని మెట్రో రెండోదశలో మూడు వేర్వేరు మార్గాల్లో పనులు శరవేగంగా సాగుతున్నాయి. పూనమల్లి నుంచి పోరూరు కూడలి వరకు ట్రాక్ పనులు ప్రారంభమయ్యాయి. -
వీక్లీ ప్రత్యేక రైళ్లు
[ 02-05-2024]
తాంబరం - సంత్రాగచ్చికి వేసవి రద్దీ కారణంగా వీక్లీ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ రైల్వే మంగళవారం ఓప్రకటనలో తెలిపింది. -
వాహన చోదకులకు మజ్జిగ సరఫరా
[ 02-05-2024]
వేసవి ఎండలు తీవ్రరూపం దాల్చడంతో పలువురు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కాంచీపురం ట్రాఫిక్ పోలీసు విభాగం తరఫున వాహన చోదకుల కోసం బుధవారం పట్టణంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. -
బన్రుట్టి బస్టాండులో దాహం కేకలు
[ 02-05-2024]
కడలూర్ జిల్లా బన్రుట్టి నుంచి చెన్నై, కుంబÅకోణం, తంజావూర్, విళుపురం, నాగపట్టిణం, పేరావూరణి, చిదంబరం, సీర్గాళి, వేలూర్, చిత్తూరు, తిరువణ్ణామలై, తిరుచ్చి తదితర ప్రాంతాలకు సుమారు 200కు పైగా ప్రభుత్వ, ప్రైవేటు బస్సు లు నడుస్తున్నాయి. -
రాతి క్వారీలో పేలుడు
[ 02-05-2024]
విరుదునగర్ జిల్లా కారియాపట్టి సమీప ఆవియూర్ కడంబన్కుళంలో అదే ప్రాంతానికి చెందిన సేతు, రాజపాళయం శ్రీరామ్లకు చెందిన రాళ్ల క్వారీ ఉంది. -
మళ్లీ విశాల్, ముత్తైయ కాంబో?
[ 02-05-2024]
‘మరుదు’లో కలసి పనిచేసిన నటుడు విశాల్, దర్శకుడు ముతైయ కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనున్నట్టు కోలీవుడ్ సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..
-
TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి