ఐఐటీఎంలో బీఎస్ కోర్సు ప్రారంభం
‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ -మద్రాస్’ (ఐఐటీఎం)లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్) నాలుగేళ్ల ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ కోర్సును కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆన్లైన్లో సోమవారం ప్రారంభించారు.
కోర్సు బుక్లెట్తో డైరెక్టర్ వి.కామకోటి తదితరులు
వడపళని, న్యూస్టుడే: ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ -మద్రాస్’ (ఐఐటీఎం)లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్) నాలుగేళ్ల ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ కోర్సును కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆన్లైన్లో సోమవారం ప్రారంభించారు. విద్యార్థులు ఫౌండేషనల్ లెవల్ సర్టిఫికెట్, డిప్లొమా లేదా బీఎస్ డిగ్రీని పొందవచ్చు. అంతర్జాతీయంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు, డిజైన్లకు ఈ కోర్సు ఉపయోగకరంగా ఉండనుంది. గతంలో డాటా సైన్స్ అండ్ అప్లికేషన్స్ కోర్సును ఆన్లైన్లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో 17వేల మంది చదువుతున్నారు. ఆ తర్వాత సోమవారం ప్రారంభించిన బీఎస్ రెండో ఆన్లైన్ కోర్సు అని పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి కె.సంజయ్కుమార్, ఐఐటీ మద్రాస్, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఛైర్మన్, డాక్టర్ పవన్ కె.గోయెంక ఆన్లైన్లో పాల్గొనగా, ఐఐట డైరెక్టరు వి.కామకోటి, పారిశ్రామిక వేత్తలు, ఇతర బోధనా సిబ్బంది హాజరయ్యారు. అందరికీ ఐఐటీలో విద్య అందాలనే లక్ష్యంతో బీఎస్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్లో ఫీజుతోపాటు ఉపకార వేతనాలు ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ కేటగిరీలకు చెందిన, ఏడాదికి రూ. అయిదు లక్షలలోపు ఆదాయమున్న కుటుంబాల వారికి అందజేస్తారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ ఈ కోర్సును ప్రారంభించడం అందరికీ ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఎన్ఈపీ అమలు చేసేందుకు ఇదే సరైన సమయమని అన్నారు. ఈ కోర్సును పూర్తి చేసిన వారికి పలు ఉద్యోగాలు లభించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా బీఎస్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్లో చేరొచ్చు. అభ్యర్థులు ప్లస్టూలో గణితం, ఫిజిక్స్ చదివి ఉండాలి. కోర్సు బోధన ఆన్లైన్లో ఉంటుందన్నారు. క్విజ్, ఇతర పరీక్షలు మాత్రం వ్యక్తిగతంగానే నిర్వహిస్తామని కామకోటి అన్నారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగు విభాగ ఆచార్యులు బాబి జార్జి తదితరులు కోర్సు గురించి వివరించారు. 2023లో ప్లస్టూలో ఉన్న వారు, ఏదేని యూజీసీ నిబంధనల మేరకు వేరే కోర్సులు చేస్తున్న వారు, ఉద్యోగాల్లో ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు https:///study.iitm.ac.in/es/ వెబ్సైట్లో చూడవచ్చు.
మాట్లాడుతున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తండ్రిని చంపిన కుమార్తె అరెస్టు
[ 02-05-2024]
కన్నియాకుమరి జిల్లా పూదప్పాండికి చెందిన సురేష్కుమార్ (46). ఇతనికి వివాహమై ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సురేష్కుమార్కి మద్యం అలవాటు ఉండటంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. -
సన్ పిక్చర్స్కు ఇళయరాజా నోటీసు
[ 02-05-2024]
రజనీకాంత్ నటిస్తున్న ‘కూలి’ చిత్రం టైటిల్ టీజర్లో తన సంగీతాన్ని అనుమతిలేకుండా వాడినట్టు సన్ పిక్చర్స్కు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా నోటీసు పంపారు. -
కునుకు పాట్లు..
[ 02-05-2024]
చేసెందుకు పనెక్కువ ఉంటుంది. శరీరం సహకరించదు, కళ్లు మూసుకుపోతుంటాయి, ఎప్పుడు కునుకేద్దామా అని మనసు లాగేస్తుంటుంది. అటు పని.. ఇటు కాస్తయినా నిద్రపోతే బాగుండనే ఆలోచనలు. -
వృద్ధాప్యం విజయానికి అడ్డుకాలేదు
[ 02-05-2024]
ఆటలాడేందుకు వృద్ధాప్యం అడ్డుకాదని, ముసలితనం శరీరానికేగాని ఆత్మవిశ్వాసానికి కాదని చాటిచెప్పుతున్నారు 76 ఏళ్ల సెల్వరాజ్. ఈ వయసులోనూ ఆయన ఆత్మవిశ్వాసంతో యువకుడిలా క్రీడల్లో సత్తాచాటుతున్నారు. -
పరమత్తిలో 42.5 డిగ్రీలు
[ 02-05-2024]
రాష్ట్రంలో మూడు రోజుల పాటు వేడిగాలుల ప్రభావం ఉంటుందని వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. తమిళనాట ఎప్పుడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. -
ఎదురెదురుగా ఢీకొన్న కార్లు ఒకే కుటుంబానికి చెందిన నలుగురి దుర్మరణం
[ 02-05-2024]
కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాతపడ్డారు. ఈ విషాద ఘటన ఈరోడ్లో చోటుచేసుకుంది. -
మెట్రో రెండోదశలో 300 మలుపులు
[ 02-05-2024]
నగరంలోని మెట్రో రెండోదశలో మూడు వేర్వేరు మార్గాల్లో పనులు శరవేగంగా సాగుతున్నాయి. పూనమల్లి నుంచి పోరూరు కూడలి వరకు ట్రాక్ పనులు ప్రారంభమయ్యాయి. -
వీక్లీ ప్రత్యేక రైళ్లు
[ 02-05-2024]
తాంబరం - సంత్రాగచ్చికి వేసవి రద్దీ కారణంగా వీక్లీ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ రైల్వే మంగళవారం ఓప్రకటనలో తెలిపింది. -
వాహన చోదకులకు మజ్జిగ సరఫరా
[ 02-05-2024]
వేసవి ఎండలు తీవ్రరూపం దాల్చడంతో పలువురు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కాంచీపురం ట్రాఫిక్ పోలీసు విభాగం తరఫున వాహన చోదకుల కోసం బుధవారం పట్టణంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. -
బన్రుట్టి బస్టాండులో దాహం కేకలు
[ 02-05-2024]
కడలూర్ జిల్లా బన్రుట్టి నుంచి చెన్నై, కుంబÅకోణం, తంజావూర్, విళుపురం, నాగపట్టిణం, పేరావూరణి, చిదంబరం, సీర్గాళి, వేలూర్, చిత్తూరు, తిరువణ్ణామలై, తిరుచ్చి తదితర ప్రాంతాలకు సుమారు 200కు పైగా ప్రభుత్వ, ప్రైవేటు బస్సు లు నడుస్తున్నాయి. -
రాతి క్వారీలో పేలుడు
[ 02-05-2024]
విరుదునగర్ జిల్లా కారియాపట్టి సమీప ఆవియూర్ కడంబన్కుళంలో అదే ప్రాంతానికి చెందిన సేతు, రాజపాళయం శ్రీరామ్లకు చెందిన రాళ్ల క్వారీ ఉంది. -
మళ్లీ విశాల్, ముత్తైయ కాంబో?
[ 02-05-2024]
‘మరుదు’లో కలసి పనిచేసిన నటుడు విశాల్, దర్శకుడు ముతైయ కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనున్నట్టు కోలీవుడ్ సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..
-
TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి