పాల కల్తీని గుర్తించేందుకు పరికరం
పాలల్లో ఉండే కల్తీని 30 సెకన్లలో గుర్తించేందుకు పరికరాన్ని ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - మద్రాస్’ (ఐఐటీఎం) పరిశోధకులు అభివృద్ధి చేశారు. 3డీ కాగిత ఆధారంతో పొందికైన డిజైన్తో కూడిన పరికరంతో ఇళ్లలో కూడా పరీక్షలు చేసుకునే వీలుందని సోమవారం ఐఐటీ ఒక ప్రకటన విడుదల చేసింది
అభివృద్ధి చేసిన ఐఐటీఎం పరిశోధక బృందం
కల్తీ పాలను గుర్తించే పరికరం
వడపళని, న్యూస్టుడే: పాలల్లో ఉండే కల్తీని 30 సెకన్లలో గుర్తించేందుకు పరికరాన్ని ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - మద్రాస్’ (ఐఐటీఎం) పరిశోధకులు అభివృద్ధి చేశారు. 3డీ కాగిత ఆధారంతో పొందికైన డిజైన్తో కూడిన పరికరంతో ఇళ్లలో కూడా పరీక్షలు చేసుకునే వీలుందని సోమవారం ఐఐటీ ఒక ప్రకటన విడుదల చేసింది. యూరియా, డిటర్జెంట్లు, సబ్బు, గంజి, హైడ్రోజన్ పెరాక్సైడు, సోడియం హైడ్రోజన్ కార్బొనేట్, ఉప్పు వంటి కల్తీతో కూడిన పాలను పరికరం గుర్తించగలదు. పాలతో పాటు నీళ్లు, తాజా పళ్లరసాలు, మిల్క్ షేక్స్ వంటి ఇతర ద్రవాలలో కూడా కల్తీని గుర్తించేందుకు పరికరం ఉపయోగకరంగా ఉంటుంది. ఐఐటీ మెకానికల్ ఇంజినీరింగు విభాగ అసోసియేట్ ఆచార్యులు, డాక్టర్ పల్లబ్ సిన్హా మహాపాత్ర ఆధ్వర్యంలోని రీసెర్చి స్కాలర్లు సుభాషిస్ పటారి, డాక్టర్ ప్రియాంకన్ దత్త పరిశోధనలు చేశారు. ప్రముఖ సమీక్షా పత్రిక ‘నేచర్’లో ప్రచురితమైన పరిశోధన వ్యాసానికి సుభాషిస్ పటారి, ప్రియాంకన్ దత్త సహ రచయితలుగా వ్యవహరించారు. డాక్టర్ పల్లబ్ సిన్హా మహాపాత్ర మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన జీవన శైలికి దారి తీసే ముఖ్యమైన ఆహారాలలో పాలు ఒకటన్నారు. కల్తీ పాల వినియోగం వల్ల మూత్రపిండాల సమస్యలు, శిశు మరణాలు, ఉదర సమస్యలు, అతిసారంతో పాటు క్యాన్సర్ వంటి వైద్య సమస్యలు కూడా ప్రబలే అవకాశాలున్నాయని పల్లబ్ సిన్హా అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తండ్రిని చంపిన కుమార్తె అరెస్టు
[ 02-05-2024]
కన్నియాకుమరి జిల్లా పూదప్పాండికి చెందిన సురేష్కుమార్ (46). ఇతనికి వివాహమై ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సురేష్కుమార్కి మద్యం అలవాటు ఉండటంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. -
సన్ పిక్చర్స్కు ఇళయరాజా నోటీసు
[ 02-05-2024]
రజనీకాంత్ నటిస్తున్న ‘కూలి’ చిత్రం టైటిల్ టీజర్లో తన సంగీతాన్ని అనుమతిలేకుండా వాడినట్టు సన్ పిక్చర్స్కు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా నోటీసు పంపారు. -
కునుకు పాట్లు..
[ 02-05-2024]
చేసెందుకు పనెక్కువ ఉంటుంది. శరీరం సహకరించదు, కళ్లు మూసుకుపోతుంటాయి, ఎప్పుడు కునుకేద్దామా అని మనసు లాగేస్తుంటుంది. అటు పని.. ఇటు కాస్తయినా నిద్రపోతే బాగుండనే ఆలోచనలు. -
వృద్ధాప్యం విజయానికి అడ్డుకాలేదు
[ 02-05-2024]
ఆటలాడేందుకు వృద్ధాప్యం అడ్డుకాదని, ముసలితనం శరీరానికేగాని ఆత్మవిశ్వాసానికి కాదని చాటిచెప్పుతున్నారు 76 ఏళ్ల సెల్వరాజ్. ఈ వయసులోనూ ఆయన ఆత్మవిశ్వాసంతో యువకుడిలా క్రీడల్లో సత్తాచాటుతున్నారు. -
పరమత్తిలో 42.5 డిగ్రీలు
[ 02-05-2024]
రాష్ట్రంలో మూడు రోజుల పాటు వేడిగాలుల ప్రభావం ఉంటుందని వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. తమిళనాట ఎప్పుడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. -
ఎదురెదురుగా ఢీకొన్న కార్లు ఒకే కుటుంబానికి చెందిన నలుగురి దుర్మరణం
[ 02-05-2024]
కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాతపడ్డారు. ఈ విషాద ఘటన ఈరోడ్లో చోటుచేసుకుంది. -
మెట్రో రెండోదశలో 300 మలుపులు
[ 02-05-2024]
నగరంలోని మెట్రో రెండోదశలో మూడు వేర్వేరు మార్గాల్లో పనులు శరవేగంగా సాగుతున్నాయి. పూనమల్లి నుంచి పోరూరు కూడలి వరకు ట్రాక్ పనులు ప్రారంభమయ్యాయి. -
వీక్లీ ప్రత్యేక రైళ్లు
[ 02-05-2024]
తాంబరం - సంత్రాగచ్చికి వేసవి రద్దీ కారణంగా వీక్లీ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ రైల్వే మంగళవారం ఓప్రకటనలో తెలిపింది. -
వాహన చోదకులకు మజ్జిగ సరఫరా
[ 02-05-2024]
వేసవి ఎండలు తీవ్రరూపం దాల్చడంతో పలువురు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కాంచీపురం ట్రాఫిక్ పోలీసు విభాగం తరఫున వాహన చోదకుల కోసం బుధవారం పట్టణంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. -
బన్రుట్టి బస్టాండులో దాహం కేకలు
[ 02-05-2024]
కడలూర్ జిల్లా బన్రుట్టి నుంచి చెన్నై, కుంబÅకోణం, తంజావూర్, విళుపురం, నాగపట్టిణం, పేరావూరణి, చిదంబరం, సీర్గాళి, వేలూర్, చిత్తూరు, తిరువణ్ణామలై, తిరుచ్చి తదితర ప్రాంతాలకు సుమారు 200కు పైగా ప్రభుత్వ, ప్రైవేటు బస్సు లు నడుస్తున్నాయి. -
రాతి క్వారీలో పేలుడు
[ 02-05-2024]
విరుదునగర్ జిల్లా కారియాపట్టి సమీప ఆవియూర్ కడంబన్కుళంలో అదే ప్రాంతానికి చెందిన సేతు, రాజపాళయం శ్రీరామ్లకు చెందిన రాళ్ల క్వారీ ఉంది. -
మళ్లీ విశాల్, ముత్తైయ కాంబో?
[ 02-05-2024]
‘మరుదు’లో కలసి పనిచేసిన నటుడు విశాల్, దర్శకుడు ముతైయ కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనున్నట్టు కోలీవుడ్ సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..
-
TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి