తేయాకు తోటల కార్మికులతో ముచ్చటించిన రాహుల్
నీలగిరిలో తేయాకు తోటల కార్మికులతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ముచ్చటించారు. సోమవారం తాలూరు దేవాలయానికి వెళ్లిన రాహుల్ అక్కడి సమావేశహాలులో వారితో మాట్లాడారు.
విద్యార్థినులతో కరచాలనం చేస్తున్న రాహుల్
సైదాపేట, న్యూస్టుడే: నీలగిరిలో తేయాకు తోటల కార్మికులతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ముచ్చటించారు. సోమవారం తాలూరు దేవాలయానికి వెళ్లిన రాహుల్ అక్కడి సమావేశహాలులో వారితో మాట్లాడారు. కళాశాల విద్యార్థినులతో కూడా ముచ్చటించారు. నీలగిరి డీఎంకే అభ్యర్థి ఎ.రాజాకు మద్దతుగా ప్రచారం చేసేందుకు సోమవారం రాహుల్గాంధీ గూడలూరు దగ్గర బందలూరులోని ప్రైవేటు కళాశాలకు హెలికాప్టర్లో చేరుకున్నారు. ఆయన్ను స్వాగతించేందుకు కాంగ్రెస్, డీఎంకే నేతలు గూడలూరు హెలికాప్టర్ బేస్లో వేచి ఉన్నారు. రాహుల్ను కలిసేందుకు అధికారులు నిర్వాహకులను అనుమతించకపోవటంతో వాగ్వాదం జరిగింది. పోలీసులు వారిని సమాధానపరిచి అక్కడ నుంచి పంపేశారు. అనంతరం బందలూరులో జరిగిన కార్యక్రమంలో ఎ.రాజాకు మద్దతుగా రాహుల్గాంధీ ప్రచారం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!