జయకుమార్ మృతిపై దర్యాప్తు ముమ్మరం
తిరునెల్వేలి కాంగ్రెస్ తూర్పు జిల్లా అధ్యక్షుడు జయకుమార్ ధనసింగ్ మృతి వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
టీనగర్, న్యూస్టుడే: తిరునెల్వేలి కాంగ్రెస్ తూర్పు జిల్లా అధ్యక్షుడు జయకుమార్ ధనసింగ్ మృతి వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హత్యకు గురయ్యారనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. ఆయన రాసిన ఓ లేఖలో తనకు ప్రాణహాని ఉందని.. నాంగునేరి కాంగ్రెస్ ఎమ్మెల్యే రూబి మనోహరన్, టీఎన్సీసీ మాజీ అధ్యక్షుడు కేవీ తంగబాలు, ఇడయన్కుడి పంచాయతీ అధ్యక్షుడు, గాల్డ్వెల్ పాఠశాల ట్రస్టీ జేకర్తోపాటు మరికొందరి పేర్లు రాశారు. వారితో నగదు లావాదేవీల్లో గొడవలున్నట్లు పేర్కొన్నారు. కొందరు తనను మోసం చేయడాన్ని నిలదీయగా హత్య చేస్తానంటూ బెదిరించినట్లు తెలిపారు. రూబి మనోహరన్, తంగబాలుకు పోలీసులు సమన్లు పంపారు. జేకర్ తనకు రూ.30 లక్షలు చెల్లించాల్సి ఉందని జయకుమార్ పేర్కొన్న మేరకు ఆయన వద్ద పోలీసులు వివరాలు సేకరించారు. పాళయంగోటైలోని కేంద్ర మాజీ మంత్రి ధనుష్కోటి ఆదిత్తన్ ఇంట్లోనూ తనిఖీ చేసినట్లు సమాచారం. ఘటనాస్థలిలో జయకుమార్ శరీరం విద్యుత్తు తీగలతో చుట్టి కనిపించింది. ఆయన పక్కనే కిరోసిన్ సీసా పడి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
400 స్థానాలకు పైగా సాధిస్తాం: తమిళిసై
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల్లో 400 స్థానాలకు పైగా కైవసం చేసుకుని కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని మాజీ గవర్నరు తమిళిసై సౌందరరాజన్ ధీమా వ్యక్తం చేశారు. -
‘విడుదలై-2’లో అతిథిగా ఎస్జే సూర్య
[ 18-05-2024]
గత ఏడాది ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో ‘విడుదలై’ చిత్రం విడుదలై భారీ విజయం సాధించింది. -
విడాకుల్లో ఎవరి జోక్యం లేదు: గాయని సైంధవి
[ 18-05-2024]
తమ విడాకుల వ్యవహారంలో ఎవరి జోక్యం లేదని గాయని సైంధవి అన్నారు. -
బస్సులకేమైంది...?
[ 18-05-2024]
ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణమంటే పలు ప్రాంతాల్లో జనం భయపడే పరిస్థితులున్నాయి. కారణం.. కాలం చెల్లినవాటిని వివిధ రూట్లలో తిప్పుతుండటం, అవి ప్రమాదాలకు గురవుతుండటం. రెండు, మూడేళ్లుగా ఇవి మరిన్ని పెరిగాయి. -
3 రోజులు నీలగిరికి రాకండి: కలెక్టర్
[ 18-05-2024]
రాష్ట్రంలో పలు జిల్లాల్లో కొద్దిరోజులుగా వేసవి వర్షాలు కురుస్తున్నాయి -
మూడోదశ ఎన్నికల తర్వాత 400 సీట్లపై మాట్లాడటం మానేసిన మోదీ
[ 18-05-2024]
దేశంలో మూడోదశ ఎన్నికల తర్వాత 400 సీట్ల గురించి మోదీ మాట్లాడటం మానేశారని టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై అన్నారు. -
ప్రాంగణ నియామకాల్లో ఐఐటీఎం సత్తా
[ 18-05-2024]
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీఎం)లో ప్రాంగణ నియామకాల్లో సత్తా చాటుతోంది. -
జపాన్లో భారత రాయబారిగా విళుపురంవాసి
[ 18-05-2024]
జపాన్లో భారత్ రాయబారిగా తమిళనాడుకు చెందిన వ్యక్తి నియమితులయ్యారు. -
వ్యర్థాలను తొలగించండి: జలవనరుల శాఖ
[ 18-05-2024]
కూవం నదిలో నీటి మార్గాలను అడ్డుకునేలా జాతీయ రహదారుల శాఖ ఒప్పంద సంస్థ పోసిన మట్టి, భవన శిథిలాల తొలగింపునకు జలవనరుల శాఖ రూ.50 కోట్లు అడిగింది. -
ఇతరులను గమనించడం నా పనికాదు
[ 18-05-2024]
ఇతరులను గమనించడం తన పనికాదని, తన పనిపై తాను చాలా నిబద్ధతతో ఉన్నట్లు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
-
పుతిన్, జిన్పింగ్ ఆలింగనంపై.. వైట్హౌస్ జోకులు
-
ఇంటినుంచి ఓటేసిన మన్మోహన్ సింగ్, ఆడ్వాణీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ధోనీ వల్లే.. ఇలాంటి విరాట్ను చూస్తున్నాం: సునీల్ గావస్కర్
-
తనలాంటి వ్యక్తిని వైద్య పరీక్షలకు పంపి.. బెయిల్ కోసం ‘లావా’ బాస్ నిర్వాకం