చర్చనీయంగా ఏ.ఆర్.రెహమాన్ పోస్టు
దివంగత హాస్యనటుడు కుమరిముత్తు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ వీడియోను ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ తన ఎక్స్ పేజీలో షేర్ చేశారు.
చెన్నై: దివంగత హాస్యనటుడు కుమరిముత్తు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ వీడియోను ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ తన ఎక్స్ పేజీలో షేర్ చేశారు. కొందరు అభ్యాసకుల వ్యాఖ్యలూ మధురమే అంటూ దానికి వ్యాఖ్యను జోడించారు. ఆ వీడియోలో ‘అన్నీ నేర్చుకున్నామంటూ ఎవరూ తమను తామే గొప్పగా భావించకూడదు. అంత పెద్ద సూర్యుడి నుంచి చేతిలోని గొడుగు కాపాడి నీడ ఇస్తుంది. అలాగే ఎక్కువగా చదువుకున్నవారికీ తక్కువ చదువుకున్న వారూ ఇరుసుగా ఉంటారు. లేకుంటే బండి నడవదు’ అనే పాట చరణాలనూ ఉటంకిస్తూ కుమరిముత్తు మాట్లాడారు. ఈ వీడియోను ఏ.ఆర్.రెహమాన్ పోస్టు చేయడంపై నెటిజన్లు పలు అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. తన పాటలకు హక్కులు కోరుతూ ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కోర్టును ఆశ్రయించడాన్ని ఉటంకిస్తూ ఈ వీడియో పోస్టు చేసినట్టు కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.\\
కృతజ్ఞతలు తెలిపిన త్రిష
త్రిష పోస్టు చేసిన ఫొటో
చెన్నై: నటి త్రిష 41వ జన్మదిన వేడుకలు శనివారం జరిగిన విషయం తెలిసిందే. ఆమెకు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో తనకు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ఎక్స్ పేజీ వేదికగా ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. తన పుట్టినరోజు సంబరాల ఫొటోలనూ పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
24న ‘వడక్కన్’ విడుదల
చెన్నై, న్యూస్టుడే: మాటల రచయిత భాస్కర్ శక్తి దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘వడక్కన్’. చిత్రంలో కుంగుమ రాజ్, వైరమాల హీరోహీరోయిన్లుగా నటించారు. కర్ణాటక సంగీత కళాకారిణి ఎస్.జె.జనని సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి తేని ఈశ్వర్ ఛాయగ్రాహకుడిగా పనిచేశారు. రాష్ట్రంలో పనిచేసే వలస కూలీల ఇతివృత్తంతో హాస్యభరితంగా చిత్రం రూపొందింది. ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. ఈ మేరకు పోస్టరును విడుదల చేసింది
17న ‘ఇంగ నాన్తాన్ కింగు’...
చెన్నై: ఆనంత్ నారాయణన్ దర్శకత్వంలో సంతానం ప్రధానపాత్ర పోషించిన చిత్రం ‘ఇంగ నాన్తాన్ కింగు’. ప్రియాలయ, మనోబాలా, తంబి రామయ్య, మునిశ్కాంత్, బాల శరవణన్ తదితరులు ఇతర నటీనటులు. ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానుందని చిత్రబృందం ఇదివరకే ప్రకటించింది. ఈ నేపథ్యంలో చిత్రం 17న విడుదల కానున్నట్టు విడుదల తేదీలో మార్పు చేసింది. మరోవైపు చిత్రంలోని మూడో పాట ‘మాలు మాలు’ పాటను సోమవారం మధ్యాహ్నం విడుదల చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పురుషులకు ప్రత్యేక తిరునాల
[ 19-05-2024]
మదురై జిల్లా తిరుమంగళం సమీపం పెరుమాళ్ కోవిల్పట్టి గ్రామంలోని కరుంపారై ముత్తయ్య ఆలయంలో పురుషులు మాత్రమే పాల్గొనే తిరునాల శనివారం వైభవంగా జరిగింది. -
చిరుధాన్యం.. చక్కటి పోషకం
[ 19-05-2024]
సంప్రదాయ వంటకాల రుచే వేరు. వాటితో కలిగే ఆరోగ్యం.. అమోఘం. ఇప్పటికీ ఈ తరహా ఆహారం ముందంజలో ఉంటూ వస్తోంది. మారుతున్న ఆహార అలవాట్లు, సులువుగా దొరికే ఫాస్ట్ఫుడ్పై మోజు పెరుగుతున్న ఈ రోజుల్లో ఆరోగ్యాలు పాడవుతున్నాయనేది నిపుణుల అభిప్రాయం. -
అవాస్తవ ప్రచారం తగదు: ముఖ్యమంత్రి స్టాలిన్
[ 19-05-2024]
విజయబాటలో ఇండియా కూటమి వెళ్తున్నందున ఓటమి భయంతో మోదీ అవాస్తవ ప్రచారాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శించారు. ఆయన విడుదల చేసిన ప్రకటనలో.. వెనుకబడిన, అణగారిన, షెడ్యుల్డ్ తెగల జీవితాల్లో వెలుగు నింపేందుకు 50శాతం రిజర్వేషన్ల పరిమితి తొలగించాలని రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ కోరుతున్నాయన్నారు. -
కోవైలో కుండపోత
[ 19-05-2024]
కోయంబత్తూరులో శనివారం కుండపోత వర్షం కురిసింది. రహదారులు జలమయమవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. లోతట్టు ప్రాంతాలైన ఆలందురై, సెమ్మెడు, గౌండంపాళ్యంలో మోకాళ్ల లోతుకు నీరు చేరడంతో ఆ ప్రాంతవాసులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. -
కంచిలో జాతీయ సదస్సు
[ 19-05-2024]
కాంచీపురం సమీప ఏణాత్తూర్లోని పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహా విద్యాలయం ప్రాంగణంలో అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. -
ప్రధాని మోదీ బయోపిక్లో సత్యరాజ్?
[ 19-05-2024]
ప్రధాని మోదీ బయోపిక్లో ప్రముఖ నటుడు సత్యరాజ్ నటించనున్నట్లు సమాచారం. శుక్రవారం ఆయన నటించిన వెప్పన్ సినిమా ట్రైలర్ విడుదలైంది. -
రాధికను పరామర్శించిన శివకుమార్
[ 19-05-2024]
కాలుకు దెబ్బతగిలి కోలుకుంటున్న రాధికను సీనియర్ నటుడు శివకుమార్ పరామర్శించారు. పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చేలా ఆయన గీసిన పెయింటింగ్స్ రాధికకు ఇచ్చారు. -
వైభవంగా వాసవి జయంతి మహోత్సవం
[ 19-05-2024]
జార్జిటౌన్లోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం (ఎస్కేపీడీ)లో శనివారం నిర్వహించిన శ్రీ వాసవి జయంతి (వైశాఖ, శుక్ల, దశమి) మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మూలమూర్తి, ఉత్సవమూర్తులకు త్రికాల అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు, ఆరాధనలు నిర్వహించారు. -
శ్రీవారి సేవలో ప్రముఖులు
[ 19-05-2024]
శ్రీవారిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. -
ఉద్యోగం పేరుతో నగదు మోసం
[ 19-05-2024]
చెన్నై వళసరవాక్కానికి చెందిన శరవణన్ భార్య సెంతమిళ్ అరిసి (31) ఉద్యోగం కోసం ఆన్లైన్లో వెతకసాగింది. ఈ క్రమంలో ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం ఉన్నట్లు వచ్చిన ప్రకటనలు చూసి అందులో ఉన్న ఫోన్ నెంబరుకి కాల్ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
బలహీనపడిన ఆవర్తనం.. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు
-
తెలంగాణ కేబినెట్ భేటీ.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ
-
అందుకే భారత్తో వాణిజ్య బంధం తెగిపోయింది: పాక్
-
పట్టభద్రులారా ఆలోచించి ఓటు వేయండి: కేటీఆర్
-
ఎంపీగా గెలిస్తే.. బాలీవుడ్ను వీడుతారా? కంగనా ఏం చెప్పారంటే..
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా