పీటీ మాస్టర్ పాట వీడియో విడుదల
సంగీత దర్శకుడు, నటగాయకుడు హిప్హాప్ ఆది నటిస్తున్న చిత్రం ‘పీటీ మాస్టర్’. వేల్స్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి కార్తిక్ వేణుగోపాలన్ దర్శకత్వం వహించగా హిప్హాప్ ఆది సంగీతం సమకూర్చారు.
పాట వీడియో పోస్టరు
చెన్నై, న్యూస్టుడే: సంగీత దర్శకుడు, నటగాయకుడు హిప్హాప్ ఆది నటిస్తున్న చిత్రం ‘పీటీ మాస్టర్’. వేల్స్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి కార్తిక్ వేణుగోపాలన్ దర్శకత్వం వహించగా హిప్హాప్ ఆది సంగీతం సమకూర్చారు. చిత్రంలో హిప్హాప్ ఆది పీటీ మాస్టర్ పాత్ర పోషించారు. కాశ్మిర, అనికా సురేంద్రన్, పాండియరాజన్, త్యాగరాజన్, మునిశ్కాంత్ తదితరులు ఇతర నటీనటులు. చిత్రంలోని ‘కుట్టి పిశాసే’ పాట వీడియోను చిత్రబృందం యూట్యూబ్లో విడుదల చేసింది.
చిన్నదురైను అభినందించిన పా.రంజిత్
చిన్నదురైకు పుస్తకాలు అందిస్తున్న పా.రంజిత్
చెన్నై, న్యూస్టుడే: తిరునెల్వేలి జిల్లా నాంగునేరికి చెందిన ప్లస్ టూ విద్యార్థి చిన్నదురై గత ఏడాది సహచర విద్యార్థులతో కులవివక్ష దాడికి గురయ్యాడు. సోమవారం విడుదలైన పరీక్షా ఫలితాల్లో 469 మార్కులు పొందాడు. మంగళవారం ఆ విద్యార్థిని ముఖ్యమంత్రి నగరానికి రప్పించి అభినందించారు. సినీ దర్శకుడు పా.రంజిత్ కూడా పిలిపించి అభినందించారు. పుస్తకాలు కానుకగా అందించారు. చిన్నదురై కళాశాల ఫీజులు, ఇతర సహాయాలను తన ‘నీలం పణ్బాట్టు మైయం’ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు.
డీఎన్ఏ ఫస్ట్లుక్ పోస్టరు విడుదల
చెన్నై, న్యూస్టుడే: నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో అధర్వ నటిస్తున్న చిత్రం ‘డీఎన్ఏ’. ఒలింపియా మూవీస్ పతాకంపై ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్నట్లు సమాచారం. చిత్రం టైటిల్ గత ఏడాది విడుదలైన నేపథ్యంలో ప్రస్తుతం ఫస్ట్లుక్ పోస్టరును మంగళవారం చిత్రబృందం విడుదల చేసింది. అధర్వ పుట్టినరోజు సందర్భంగా పోస్టరు విడుదల చేయడం గమనార్హం. ఆధర్వకు సినీరంగ ప్రముఖులు, చిత్ర నిర్మాణ సంస్థలు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టర్లు విడుదల చేశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాత గూటికి పన్నీర్?
[ 20-05-2024]
లోక్సభ ఎన్నికల ఫలితాల విడుదల తర్వాత అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్సెల్వాన్ని మళ్లీ అన్నాడీఎంకేలోకి చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. -
రూ.100కే మెట్రోలో అపరిమిత ప్రయాణం.. వారాంతపు రోజుల్లో అవకాశం
[ 20-05-2024]
చెన్నై నగరానికి వచ్చే పర్యాటకులు, వారాంతపు రోజుల్లో షాపింగుకు వెళ్లాలనుకునే స్థానికులకు చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్) రూ.100తో సరికొత్త పథకాన్ని శనివారం ప్రకటించింది. -
కాలుష్య కోరల్లో కెలవరప్పళ్ళి జలాశయం
[ 20-05-2024]
కృష్ణగిరి జిల్లా హోసూర్లోని సిప్కాట్ 1, 2లో వేలాది సూక్ష్మ, లఘు, మధ్య తరగతి కర్మాగారాలు పని చేస్తున్నాయి. -
రోబోటిక్ యంత్రాలతో పారిశుద్ధ్య పనులు
[ 20-05-2024]
మ్యాన్ హోల్స్లో మనుషులు లోపలికి దిగి శుభ్రం చేస్తుంటారు. ఈ క్రమంలో విషవాయువులు సోకి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. -
దిండుక్కల్కు భారీ వర్ష సూచన
[ 20-05-2024]
దిండుక్కల్ జిల్లాలో సోమవారం భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. -
శివకార్తికేయన్తో జతకట్టనున్న రష్మిక
[ 20-05-2024]
కొత్త దర్శకుడు శిబి చక్రవర్తి, శివకార్తికేయన్ కాంబినేషన్లో 2022లో వచ్చిన సినిమా ‘డాన్’. -
భాజపాది తిరుగుబాటు రాజకీయం: సెల్వపెరుంతగై
[ 20-05-2024]
భాజపా తిరుగుబాటు రాజకీయాలు చేస్తోందని టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై విమర్శించారు. -
ఊటీ మౌంటైన్ రైలు 2 రోజులు రద్దు
[ 20-05-2024]
నీలగిరి జిల్లా కున్నూర్, బర్లియార్ ప్రాంతాలలో ఈ నెల 17వ తేదీ కురిసిన భారీ వర్షానికి కున్నూర్-మేట్టుపాలయం మౌంటైన్ రైలు మార్గంలోని హిల్గ్రోవ్ ప్రాంతంలో పట్టాలపై కొండచరియలు విరిగిపడ్డాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఒట్టేశారు.. ఓటేశారు!
-
నాడు మిత్రులు నేడు ప్రత్యర్థులు.. ఆసక్తికరంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోరు
-
ఆటల్లోనూ జగన్నాటకం.. వేసవిలో కనిపించని క్రీడా శిబిరాలు
-
సార్వత్రిక సమరం.. ఐదో విడత పోలింగ్ ప్రారంభం.. ఆ 2 స్థానాలపై అందరి దృష్టి
-
రోజూ రూ.కోటిన్నర.. మరి నష్టాలెలా?.. మెట్రోకు భారమవుతున్న వడ్డీలు
-
‘నైరుతి’ ప్రయాణం మొదలైంది..