వివాహానికి జాతకానికంటే రక్తపరీక్షే ముఖ్యం
వివాహానికి జాతక అనుకూలత కంటే రక్తపరీక్షే ముఖ్యమని ప్రముఖ నటి సుహాసిని తెలిపారు. రక్తహీనత దినం సందర్భంగా తలసేమియా నల సంఘం ప్రజల్లో అవగాహన కల్పించేలా అపోలోలో కార్యక్రమం ఏర్పాటు చేసింది.
సుహాసిని
కార్యక్రమంలో సుహాసిని తదితరులు
సైదాపేట, న్యూస్టుడే: వివాహానికి జాతక అనుకూలత కంటే రక్తపరీక్షే ముఖ్యమని ప్రముఖ నటి సుహాసిని తెలిపారు. రక్తహీనత దినం సందర్భంగా తలసేమియా నల సంఘం ప్రజల్లో అవగాహన కల్పించేలా అపోలోలో కార్యక్రమం ఏర్పాటు చేసింది. దేశంలో రక్తహీనత ప్రభావం, దానిని గుర్తించే పద్ధతులు, చికిత్స విధానాలు, నివారణపై నిపుణులు ప్రసంగించారు. సుహాసిని మాట్లాడుతూ.. నాలుగైదేళ్లుగా తలసేమియా గురించి తనకు తెలిసిందన్నారు. ప్రతి ఆరు నెలలకోసారి తాను రక్తదానం చేస్తున్నానని తెలిపారు. ప్రస్తుతకాలంలో జాతకం చూడటం కంటే రక్తపరీక్ష చేసుకోవటం ఎంత ముఖ్యమనేది అందరూ గుర్తించాలన్నారు. మాల్దీవుల్లో వధూవరులకు రక్తపరీక్ష చేసుకుంటేనే సర్టిఫికేట్ ఇస్తారని తెలిపారు. తలసేమియాపై తప్పుడు అభిప్రాయాలు వ్యాపిస్తున్నాయని తెలిపారు. వాటిని నమ్మకుండా వైద్యుల సూచనల మేరకు నడుచుకోవాలన్నారు. గతంలో పెద్దోళ్లు, ఉపాధ్యాయులు చెప్పినట్లు నడుచుకున్నామని, ఇకపై వైద్యులు చెప్పినట్లే మన జీవన విధానం ఉండాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాత గూటికి పన్నీర్?
[ 20-05-2024]
లోక్సభ ఎన్నికల ఫలితాల విడుదల తర్వాత అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్సెల్వాన్ని మళ్లీ అన్నాడీఎంకేలోకి చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. -
రూ.100కే మెట్రోలో అపరిమిత ప్రయాణం.. వారాంతపు రోజుల్లో అవకాశం
[ 20-05-2024]
చెన్నై నగరానికి వచ్చే పర్యాటకులు, వారాంతపు రోజుల్లో షాపింగుకు వెళ్లాలనుకునే స్థానికులకు చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్) రూ.100తో సరికొత్త పథకాన్ని శనివారం ప్రకటించింది. -
కాలుష్య కోరల్లో కెలవరప్పళ్ళి జలాశయం
[ 20-05-2024]
కృష్ణగిరి జిల్లా హోసూర్లోని సిప్కాట్ 1, 2లో వేలాది సూక్ష్మ, లఘు, మధ్య తరగతి కర్మాగారాలు పని చేస్తున్నాయి. -
రోబోటిక్ యంత్రాలతో పారిశుద్ధ్య పనులు
[ 20-05-2024]
మ్యాన్ హోల్స్లో మనుషులు లోపలికి దిగి శుభ్రం చేస్తుంటారు. ఈ క్రమంలో విషవాయువులు సోకి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. -
దిండుక్కల్కు భారీ వర్ష సూచన
[ 20-05-2024]
దిండుక్కల్ జిల్లాలో సోమవారం భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. -
శివకార్తికేయన్తో జతకట్టనున్న రష్మిక
[ 20-05-2024]
కొత్త దర్శకుడు శిబి చక్రవర్తి, శివకార్తికేయన్ కాంబినేషన్లో 2022లో వచ్చిన సినిమా ‘డాన్’. -
భాజపాది తిరుగుబాటు రాజకీయం: సెల్వపెరుంతగై
[ 20-05-2024]
భాజపా తిరుగుబాటు రాజకీయాలు చేస్తోందని టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై విమర్శించారు. -
ఊటీ మౌంటైన్ రైలు 2 రోజులు రద్దు
[ 20-05-2024]
నీలగిరి జిల్లా కున్నూర్, బర్లియార్ ప్రాంతాలలో ఈ నెల 17వ తేదీ కురిసిన భారీ వర్షానికి కున్నూర్-మేట్టుపాలయం మౌంటైన్ రైలు మార్గంలోని హిల్గ్రోవ్ ప్రాంతంలో పట్టాలపై కొండచరియలు విరిగిపడ్డాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఒట్టేశారు.. ఓటేశారు!
-
నాడు మిత్రులు నేడు ప్రత్యర్థులు.. ఆసక్తికరంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోరు
-
ఆటల్లోనూ జగన్నాటకం.. వేసవిలో కనిపించని క్రీడా శిబిరాలు
-
సార్వత్రిక సమరం.. ఐదో విడత పోలింగ్ ప్రారంభం.. ఆ 2 స్థానాలపై అందరి దృష్టి
-
రోజూ రూ.కోటిన్నర.. మరి నష్టాలెలా?.. మెట్రోకు భారమవుతున్న వడ్డీలు
-
‘నైరుతి’ ప్రయాణం మొదలైంది..