logo

వివాహానికి జాతకానికంటే రక్తపరీక్షే ముఖ్యం

వివాహానికి జాతక అనుకూలత కంటే రక్తపరీక్షే ముఖ్యమని ప్రముఖ నటి సుహాసిని తెలిపారు. రక్తహీనత దినం సందర్భంగా తలసేమియా నల సంఘం ప్రజల్లో అవగాహన కల్పించేలా అపోలోలో కార్యక్రమం ఏర్పాటు చేసింది.

Published : 09 May 2024 00:47 IST

సుహాసిని

కార్యక్రమంలో సుహాసిని తదితరులు

సైదాపేట, న్యూస్‌టుడే: వివాహానికి జాతక అనుకూలత కంటే రక్తపరీక్షే ముఖ్యమని ప్రముఖ నటి సుహాసిని తెలిపారు. రక్తహీనత దినం సందర్భంగా తలసేమియా నల సంఘం ప్రజల్లో అవగాహన కల్పించేలా అపోలోలో కార్యక్రమం ఏర్పాటు చేసింది. దేశంలో రక్తహీనత ప్రభావం, దానిని గుర్తించే పద్ధతులు, చికిత్స విధానాలు, నివారణపై నిపుణులు ప్రసంగించారు. సుహాసిని మాట్లాడుతూ.. నాలుగైదేళ్లుగా తలసేమియా గురించి తనకు తెలిసిందన్నారు. ప్రతి ఆరు నెలలకోసారి తాను రక్తదానం చేస్తున్నానని తెలిపారు. ప్రస్తుతకాలంలో జాతకం చూడటం కంటే రక్తపరీక్ష చేసుకోవటం ఎంత ముఖ్యమనేది అందరూ గుర్తించాలన్నారు. మాల్దీవుల్లో వధూవరులకు రక్తపరీక్ష చేసుకుంటేనే సర్టిఫికేట్‌ ఇస్తారని తెలిపారు. తలసేమియాపై తప్పుడు అభిప్రాయాలు వ్యాపిస్తున్నాయని తెలిపారు. వాటిని నమ్మకుండా వైద్యుల సూచనల మేరకు నడుచుకోవాలన్నారు. గతంలో పెద్దోళ్లు, ఉపాధ్యాయులు చెప్పినట్లు నడుచుకున్నామని, ఇకపై వైద్యులు చెప్పినట్లే మన జీవన విధానం ఉండాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని