ఆత్మవిశ్వాసానికి చిరునామా.. తాన్సెన్
పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే చేయలేని పని ఏదీ ఉండదని ఓ యువకుడు నిరూపించాడు. చేతులు లేకపోయినా కారు డ్రైవింగ్ నేర్చుకున్నాడు.
రాష్ట్రంలో డ్రైవింగ్ లైసెన్సు పొందిన తొలి దివ్యాంగుడు
కారు నడుపుతూ..
పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే చేయలేని పని ఏదీ ఉండదని ఓ యువకుడు నిరూపించాడు. చేతులు లేకపోయినా కారు డ్రైవింగ్ నేర్చుకున్నాడు. లైసెన్స్ కూడా అందుకున్నాడు. రాష్ట్రంలోనే మొదటి లైసెన్స్ పొందిన దివ్యాంగుడిగా ఘనత సాధించాడు.
-ఆర్కేనగర్, న్యూస్టుడే
చెన్నై వ్యాసార్పాడి పెరియార్నగర్లోని తాన్సెన్కు 10ఏళ్ల ప్రాయంలో విద్యుదాఘాతం కారణంగా రెండు చేతులు మోచేయి వరకు తీసేయాల్సి వచ్చింది. కుమారుడిని చూసి కన్నవారు తల్లడిల్లిపోయారు. తాన్సెన్ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా రోజువారీ పనులు స్వయంగా చేసుకోవడం మొదలుపెట్టాడు. కాళ్లతోనే రాయడం, ఈతకొట్టడం, డ్రమ్స్ వాయించడం కూడా నేర్చుకున్నాడు. ఇంజినీరింగ్ ముగించి బీఎల్ పూర్తి చేసిన తాన్సెన్ ప్రస్తుతం ఎంఎల్ చదువుతున్నాడు. వివాహమై ఏడాదిన్నర కుమార్తె ఉంది.
వాహనం డిజైన్లో మార్పులు..
తాన్సెన్కు కారు నడపాలనే కోరిక కలిగింది. ఇదే విషయాన్ని వ్యాపారవేత్త శ్రీవారి శంకర్, నటుడు రాఘవలారెన్స్కు తెలిపాడు. వారి సాయంతో డ్రైవింగ్ నేర్చుకున్నాడు. లైసెన్స్కు దరఖాస్తు చేసుకున్నప్పుడు సమస్యలు తలెత్తాయి. చెన్నై కేకేనగర్లోని పునరావాస ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ అతనికి అనుగుణంగా కారు మార్చుకోవాలని సూచించారు. ఆస్పత్రి ఫిజియోథెరపీ, రిహాబిలిటేషన్ డైరెక్టర్ తిరునావుక్కరసు, వైద్యుల సిఫారసు మేరకు రోటేరి ఆర్టీవో కార్యాలయంలో డ్రైవింగ్ లైసెన్సు పొందాడు. రాష్ట్రంలోనే తొలిసారిగా, దేశంలోనే మూడోవ్యక్తిగా రెండు చేతుల్లేని దివ్యాంగుడు తాన్సెన్ ఏప్రిల్ 22న లైసెన్సు తీసుకున్నాడు.
మూడు నెలలు పరిశీలించి..
తిరునావుక్కరసు మాట్లాడుతూ తాన్సెన్ కారు నడపడం చూసి సంతోషపడిన తాము మిగిలినవారి భద్రత దృష్టిలో పెట్టుకున్నామన్నారు. మోచేయి వరకు ఉన్న చేతులతోనే స్టీరింగ్ పట్టుకొని నడిపిన అతనికి బ్యాలెన్స్ సరిగా ఉందా అని పరిశీలించామన్నారు. మోచేతులు, కాళ్లతో కారు నడిపి చూపించాడని, స్వయంగా డోర్ తెరిచాడని, సీట్బెల్ట్ వేసుకున్నాడని చెప్పారు. అవసరమైన సమయంలో బ్రేక్ వేశాడని తెలిపారు. మూడు నెలలు పర్యవేక్షించిన అనంతరం కొన్ని శిక్షణలు కూడా ఇచ్చామని పేర్కొన్నారు. అతని కారు డిజైన్లో కొన్ని మార్పులు చేసిన తర్వాత ఇంకా బాగా నడిపాడని, అందుకే లైసెన్సు పొందేందుకు సిఫారసు చేశామని వివరించారు.
తిరుమల కొండపైకి..
తాన్సెన్ మాట్లాడుతూ.. నటుడు రాఘవా లారెన్స్ నిర్వహించే కచేరి, ఇతర కార్యక్రమాల్లో డ్రమ్స్ వాయిస్తానని చెప్పాడు. చేతుల గురించి ఎవరైనా అడిగే వరకు దివ్యాంగుడనే భావన తనకు లేదన్నారు. కారు నడపాలనే ఆశతో పునరావాస వైద్యసంస్థలోని వైద్యులను కలిశానని, వైద్యులు, రాఘవా లారెన్స్ సహాయపడ్డారని చెప్పాడు. కారులో ఆటోమేటిక్ గేర్, బ్రేక్ ఫీచర్ ఉందని, అందుకే తిరుమల కొండపైకి స్వయంగా కారు నడిపానన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాత గూటికి పన్నీర్?
[ 20-05-2024]
లోక్సభ ఎన్నికల ఫలితాల విడుదల తర్వాత అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్సెల్వాన్ని మళ్లీ అన్నాడీఎంకేలోకి చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. -
రూ.100కే మెట్రోలో అపరిమిత ప్రయాణం.. వారాంతపు రోజుల్లో అవకాశం
[ 20-05-2024]
చెన్నై నగరానికి వచ్చే పర్యాటకులు, వారాంతపు రోజుల్లో షాపింగుకు వెళ్లాలనుకునే స్థానికులకు చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్) రూ.100తో సరికొత్త పథకాన్ని శనివారం ప్రకటించింది. -
కాలుష్య కోరల్లో కెలవరప్పళ్ళి జలాశయం
[ 20-05-2024]
కృష్ణగిరి జిల్లా హోసూర్లోని సిప్కాట్ 1, 2లో వేలాది సూక్ష్మ, లఘు, మధ్య తరగతి కర్మాగారాలు పని చేస్తున్నాయి. -
రోబోటిక్ యంత్రాలతో పారిశుద్ధ్య పనులు
[ 20-05-2024]
మ్యాన్ హోల్స్లో మనుషులు లోపలికి దిగి శుభ్రం చేస్తుంటారు. ఈ క్రమంలో విషవాయువులు సోకి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. -
దిండుక్కల్కు భారీ వర్ష సూచన
[ 20-05-2024]
దిండుక్కల్ జిల్లాలో సోమవారం భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. -
శివకార్తికేయన్తో జతకట్టనున్న రష్మిక
[ 20-05-2024]
కొత్త దర్శకుడు శిబి చక్రవర్తి, శివకార్తికేయన్ కాంబినేషన్లో 2022లో వచ్చిన సినిమా ‘డాన్’. -
భాజపాది తిరుగుబాటు రాజకీయం: సెల్వపెరుంతగై
[ 20-05-2024]
భాజపా తిరుగుబాటు రాజకీయాలు చేస్తోందని టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై విమర్శించారు. -
ఊటీ మౌంటైన్ రైలు 2 రోజులు రద్దు
[ 20-05-2024]
నీలగిరి జిల్లా కున్నూర్, బర్లియార్ ప్రాంతాలలో ఈ నెల 17వ తేదీ కురిసిన భారీ వర్షానికి కున్నూర్-మేట్టుపాలయం మౌంటైన్ రైలు మార్గంలోని హిల్గ్రోవ్ ప్రాంతంలో పట్టాలపై కొండచరియలు విరిగిపడ్డాయి.
తాజా వార్తలు (Latest News)
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్
-
అయిదో దశ ఎన్నికలు.. ముగిసిన పోలింగ్!
-
మళ్లీ వచ్చేది మోదీ సర్కార్.. పీవోకే విలీనం పక్కా: అమిత్ షా
-
మాపై బురద జల్లే ప్రయత్నమిది: రేవ్పార్టీ రూమర్స్పై జానీ మాస్టర్
-
ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. TG కేబినెట్ కీలక నిర్ణయాలివే..