ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది సమ్మె
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ క్యాబిన్ సిబ్బంది సమ్మె గురువారం రెండోరోజు కూడా కొనసాగింది. సింగపూర్, కోల్కతా, తిరువనంతపురం తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఎనిమిది విమానాలు రద్దయ్యాయి.
పలు విమానాలు రద్దు
వడపళని, న్యూస్టుడే: ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ క్యాబిన్ సిబ్బంది సమ్మె గురువారం రెండోరోజు కూడా కొనసాగింది. సింగపూర్, కోల్కతా, తిరువనంతపురం తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఎనిమిది విమానాలు రద్దయ్యాయి. పైలట్లు, ఇంజినీర్లు ఎవరూ విధులకు హాజరు కాలేదు. ముందుగా సమాచారం తెలియక విమానాశ్రయానికి వచ్చిన తర్వాత రద్దయినట్టు తెలియడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, టాటా గ్రూపునకు చెందిన 60 విమానాలు గురువారం రద్దు చేశారు. మంగళవారం రాత్రి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది 200 మంది మూకుమ్మడిగా సెలవులు పెట్టి యాజమాన్యం నిర్వహణ సరిగా లేదని డిమాండు చేస్తూ సమ్మె బాట పట్టారు. పైలట్లు, ఇంజినీర్ల కొరత కూడా తోడవటంతలో 90 పైచిలుకు విమానాలు రద్దు చేశారు.
గురువారం కోల్కతాలో బయలుదేరి మధ్యాహ్నం 12.30కు చెన్నైకి రావాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, రాత్రి 7.30కు రావాల్సిన సర్వీసులు రద్దయ్యాయి. చెన్నై నుంచి కోల్కతా వెళ్లాల్సిన నాలుగు, రావాల్సిన నాలుగింటిని కూడా రద్దు చేశారు. చెన్నై- తిరువనంతపురం, చెన్నై-సింగపూర్తో పాటు ఉదయం నడవాల్సిన చెన్నై- కోల్కతా యుటిలిటీ సర్వీసు కూడా రద్దయింది. బుధవారం సింగపూర్ నుంచి బయలుదేరి అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో చెన్నై రావాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, తిరువనంతపురం నుంచి చెన్నై వచ్చే విమానం రద్దు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాత గూటికి పన్నీర్?
[ 20-05-2024]
లోక్సభ ఎన్నికల ఫలితాల విడుదల తర్వాత అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్సెల్వాన్ని మళ్లీ అన్నాడీఎంకేలోకి చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. -
రూ.100కే మెట్రోలో అపరిమిత ప్రయాణం.. వారాంతపు రోజుల్లో అవకాశం
[ 20-05-2024]
చెన్నై నగరానికి వచ్చే పర్యాటకులు, వారాంతపు రోజుల్లో షాపింగుకు వెళ్లాలనుకునే స్థానికులకు చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్) రూ.100తో సరికొత్త పథకాన్ని శనివారం ప్రకటించింది. -
కాలుష్య కోరల్లో కెలవరప్పళ్ళి జలాశయం
[ 20-05-2024]
కృష్ణగిరి జిల్లా హోసూర్లోని సిప్కాట్ 1, 2లో వేలాది సూక్ష్మ, లఘు, మధ్య తరగతి కర్మాగారాలు పని చేస్తున్నాయి. -
రోబోటిక్ యంత్రాలతో పారిశుద్ధ్య పనులు
[ 20-05-2024]
మ్యాన్ హోల్స్లో మనుషులు లోపలికి దిగి శుభ్రం చేస్తుంటారు. ఈ క్రమంలో విషవాయువులు సోకి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. -
దిండుక్కల్కు భారీ వర్ష సూచన
[ 20-05-2024]
దిండుక్కల్ జిల్లాలో సోమవారం భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. -
శివకార్తికేయన్తో జతకట్టనున్న రష్మిక
[ 20-05-2024]
కొత్త దర్శకుడు శిబి చక్రవర్తి, శివకార్తికేయన్ కాంబినేషన్లో 2022లో వచ్చిన సినిమా ‘డాన్’. -
భాజపాది తిరుగుబాటు రాజకీయం: సెల్వపెరుంతగై
[ 20-05-2024]
భాజపా తిరుగుబాటు రాజకీయాలు చేస్తోందని టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై విమర్శించారు. -
ఊటీ మౌంటైన్ రైలు 2 రోజులు రద్దు
[ 20-05-2024]
నీలగిరి జిల్లా కున్నూర్, బర్లియార్ ప్రాంతాలలో ఈ నెల 17వ తేదీ కురిసిన భారీ వర్షానికి కున్నూర్-మేట్టుపాలయం మౌంటైన్ రైలు మార్గంలోని హిల్గ్రోవ్ ప్రాంతంలో పట్టాలపై కొండచరియలు విరిగిపడ్డాయి.
తాజా వార్తలు (Latest News)
-
మళ్లీ వచ్చేది మోదీ సర్కార్.. పీవోకే విలీనం పక్కా: అమిత్ షా
-
మాపై బురద జల్లే ప్రయత్నమిది: రేవ్పార్టీ రూమర్స్పై జానీ మాస్టర్
-
ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలివే..
-
నా కాల్ డేటా చూసుకోండి.. విచారణకు సిద్ధం: లావు శ్రీకృష్ణదేవరాయులు
-
చివరి రోజుల్లో నా తల్లికి ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స: మోదీ
-
నెతన్యాహుపై అరెస్టు వారెంట్.. కోరిన ఐసీసీ ప్రాసిక్యూటర్