ప్రజల జీవనాధారం ప్రశ్నార్థకం: ప్రేమలత
డీఎంకే మూడేళ్ల పాలనలో ప్రజల జీవనాధారం ప్రశ్నార్థకంగా మారిందని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత తెలిపారు.
చెన్నై, న్యూస్టుడే: డీఎంకే మూడేళ్ల పాలనలో ప్రజల జీవనాధారం ప్రశ్నార్థకంగా మారిందని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత తెలిపారు. దివంగత నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు విజయకాంత్కు ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారం పొందేందుకు దిల్లీ వెళ్తున్న సందర్భంగా ఆమె చెన్నై విమానాశ్రయంలో విలేకర్లతో మాట్లాడారు. పదో తేదీ దిల్లీ తమిళ సంఘం తరఫున నిర్వహించే సన్మాన కార్యక్రమంలోనూ పాల్గొంటామని తెలిపారు. మూడేళ్ల డీఎంకే పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నట్లు సీఎం స్టాలిన్ చెబుతున్నారని, ఆయన నేరుగా ప్రజల వద్దకు వెళ్లి చూశారా అని ప్రశ్నించారు. రైతులు దారిద్య్రంలో ఉన్నారని, రిజిస్ట్రేషన్ల సేవా పన్నును అకస్మాత్తుగా పెంచారని, ఆస్తిపన్ను, పాలు, బస్సు ఛార్జీలువంటివి పెరిగాయని విమర్శించారు. ప్రజల జీవనాధారం ప్రశ్నార్థకమైందని తెలిపారు. నీట్ పరీక్షలు రద్దు చేయిస్తామన్నారని, రాష్ట్రంలో ఇప్పటివరకు ఆ పరీక్షలు జరుగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. విజయకాంత్ బతికున్నప్పుడే పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసి ఉంటే బాగుండేదన్నారు. దేశంలోని అన్ని పురస్కారాలకు ఆయన అర్హుడని, భారతరత్న ప్రకటించినా ప్రజలకు అంకితం చేస్తామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాత గూటికి పన్నీర్?
[ 20-05-2024]
లోక్సభ ఎన్నికల ఫలితాల విడుదల తర్వాత అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్సెల్వాన్ని మళ్లీ అన్నాడీఎంకేలోకి చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. -
రూ.100కే మెట్రోలో అపరిమిత ప్రయాణం.. వారాంతపు రోజుల్లో అవకాశం
[ 20-05-2024]
చెన్నై నగరానికి వచ్చే పర్యాటకులు, వారాంతపు రోజుల్లో షాపింగుకు వెళ్లాలనుకునే స్థానికులకు చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్) రూ.100తో సరికొత్త పథకాన్ని శనివారం ప్రకటించింది. -
కాలుష్య కోరల్లో కెలవరప్పళ్ళి జలాశయం
[ 20-05-2024]
కృష్ణగిరి జిల్లా హోసూర్లోని సిప్కాట్ 1, 2లో వేలాది సూక్ష్మ, లఘు, మధ్య తరగతి కర్మాగారాలు పని చేస్తున్నాయి. -
రోబోటిక్ యంత్రాలతో పారిశుద్ధ్య పనులు
[ 20-05-2024]
మ్యాన్ హోల్స్లో మనుషులు లోపలికి దిగి శుభ్రం చేస్తుంటారు. ఈ క్రమంలో విషవాయువులు సోకి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. -
దిండుక్కల్కు భారీ వర్ష సూచన
[ 20-05-2024]
దిండుక్కల్ జిల్లాలో సోమవారం భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. -
శివకార్తికేయన్తో జతకట్టనున్న రష్మిక
[ 20-05-2024]
కొత్త దర్శకుడు శిబి చక్రవర్తి, శివకార్తికేయన్ కాంబినేషన్లో 2022లో వచ్చిన సినిమా ‘డాన్’. -
భాజపాది తిరుగుబాటు రాజకీయం: సెల్వపెరుంతగై
[ 20-05-2024]
భాజపా తిరుగుబాటు రాజకీయాలు చేస్తోందని టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై విమర్శించారు. -
ఊటీ మౌంటైన్ రైలు 2 రోజులు రద్దు
[ 20-05-2024]
నీలగిరి జిల్లా కున్నూర్, బర్లియార్ ప్రాంతాలలో ఈ నెల 17వ తేదీ కురిసిన భారీ వర్షానికి కున్నూర్-మేట్టుపాలయం మౌంటైన్ రైలు మార్గంలోని హిల్గ్రోవ్ ప్రాంతంలో పట్టాలపై కొండచరియలు విరిగిపడ్డాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
మరో హామీని తుంగలో తొక్కారు.. కాంగ్రెస్ సర్కార్పై హరీశ్రావు విమర్శ
-
నలుగురు ఐసీస్ అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల