దేశానికి మోదీ.. ఏపీకి చంద్రబాబు అవసరం
ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ప్రధాని మోదీ.. ఆంధ్రప్రదేశ్కు నారా చంద్రబాబు నాయుడి సారథ్యం అవసరమని కేంద్ర మాజీ మంత్రి అన్బుమణి రామదాస్ అన్నారు.
కేంద్ర మాజీ మంత్రి అన్బుమణి రామదాస్
మాట్లాడుతున్న అన్బుమణి రామదాస్, చిత్రంలో చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు తదితరులు
కుప్పం పట్టణం, న్యూస్టుడే: ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ప్రధాని మోదీ.. ఆంధ్రప్రదేశ్కు నారా చంద్రబాబు నాయుడి సారథ్యం అవసరమని కేంద్ర మాజీ మంత్రి అన్బుమణి రామదాస్ అన్నారు. కుప్పం పట్టణంలోని తెదేపా కార్యాలయ ఆవరణలో గురువారం జరిగిన వన్నియకుల క్షత్రియుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశం మెచ్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని, అలాంటి నాయకుడిని కుప్పం ప్రజలు ఓట్లు వేయడం వారి అదృష్టమన్నారు. కుప్పం ప్రజలు వేసే ఓటు రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దే ముఖ్యమంత్రికి వేస్తున్నామని గుర్తుంచుకోవాలన్నారు. లక్ష ఓట్ల ఆధిక్యత అందించేందుకు వన్నియకుల క్షత్రియ కుటుంబ సభ్యులను ఏకం చేసేందుకు కుప్పం వచ్చినట్లు ఆయన వివరించారు. కేంద్ర మంత్రిగా అనేక నగరాలు, ప్రాంతాల్లో పర్యటించానని హైదరాబాద్కు వెళ్లినప్పుడు వచ్చిన అనుభూతి వేరన్నారు. ఆ నగరాభివృద్ధి ఘనత చంద్రబాబుదేనని కొనియాడారు. తెదేపా హయాంలోనే హంద్రీ-నీవా ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తి చేయగా.. మిగిలిన వాటిని పూర్తి చేయలేక ఇన్నాళ్లు ఈ ప్రాంతానికి నీరు రాలేదన్నారు. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే గోదావరి-కావేరీ అనుసంధానం చేసి హంద్రీ-నీవా ద్వారా జలాలు ఆంధ్రతో పాటు తమిళనాడు ప్రాంతానికి నీరు అందిస్తామన్నారు. తెదేపా ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావుకు భారీ మెజారిటీ ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడారు. తెదేపా చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు సీఆర్ రాజన్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు, ఇన్ఛార్జి పీఎస్ మునిరత్నం, చంద్రశేఖర్, బిఎం రాజు, తమిళనాడు మాజీ ఎమ్మెల్యేలు రాజ, నటరాజన్, ఇళవలవన్, మేఘనాథన్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాత గూటికి పన్నీర్?
[ 20-05-2024]
లోక్సభ ఎన్నికల ఫలితాల విడుదల తర్వాత అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్సెల్వాన్ని మళ్లీ అన్నాడీఎంకేలోకి చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. -
రూ.100కే మెట్రోలో అపరిమిత ప్రయాణం.. వారాంతపు రోజుల్లో అవకాశం
[ 20-05-2024]
చెన్నై నగరానికి వచ్చే పర్యాటకులు, వారాంతపు రోజుల్లో షాపింగుకు వెళ్లాలనుకునే స్థానికులకు చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్) రూ.100తో సరికొత్త పథకాన్ని శనివారం ప్రకటించింది. -
కాలుష్య కోరల్లో కెలవరప్పళ్ళి జలాశయం
[ 20-05-2024]
కృష్ణగిరి జిల్లా హోసూర్లోని సిప్కాట్ 1, 2లో వేలాది సూక్ష్మ, లఘు, మధ్య తరగతి కర్మాగారాలు పని చేస్తున్నాయి. -
రోబోటిక్ యంత్రాలతో పారిశుద్ధ్య పనులు
[ 20-05-2024]
మ్యాన్ హోల్స్లో మనుషులు లోపలికి దిగి శుభ్రం చేస్తుంటారు. ఈ క్రమంలో విషవాయువులు సోకి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. -
దిండుక్కల్కు భారీ వర్ష సూచన
[ 20-05-2024]
దిండుక్కల్ జిల్లాలో సోమవారం భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. -
శివకార్తికేయన్తో జతకట్టనున్న రష్మిక
[ 20-05-2024]
కొత్త దర్శకుడు శిబి చక్రవర్తి, శివకార్తికేయన్ కాంబినేషన్లో 2022లో వచ్చిన సినిమా ‘డాన్’. -
భాజపాది తిరుగుబాటు రాజకీయం: సెల్వపెరుంతగై
[ 20-05-2024]
భాజపా తిరుగుబాటు రాజకీయాలు చేస్తోందని టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై విమర్శించారు. -
ఊటీ మౌంటైన్ రైలు 2 రోజులు రద్దు
[ 20-05-2024]
నీలగిరి జిల్లా కున్నూర్, బర్లియార్ ప్రాంతాలలో ఈ నెల 17వ తేదీ కురిసిన భారీ వర్షానికి కున్నూర్-మేట్టుపాలయం మౌంటైన్ రైలు మార్గంలోని హిల్గ్రోవ్ ప్రాంతంలో పట్టాలపై కొండచరియలు విరిగిపడ్డాయి.
తాజా వార్తలు (Latest News)
-
అయిదో దశ ఎన్నికలు.. ముగిసిన పోలింగ్!
-
మళ్లీ వచ్చేది మోదీ సర్కార్.. పీవోకే విలీనం పక్కా: అమిత్ షా
-
మాపై బురద జల్లే ప్రయత్నమిది: రేవ్పార్టీ రూమర్స్పై జానీ మాస్టర్
-
ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలివే..
-
నా కాల్ డేటా చూసుకోండి.. విచారణకు సిద్ధం: లావు శ్రీకృష్ణదేవరాయులు
-
చివరి రోజుల్లో నా తల్లికి ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స: మోదీ