Andhra News: అమరావతి పెళ్లికి ఊరంతా ఏకమై..!
‘అడగందే అమ్మయినా అన్నం పెట్టదు’ అనేది సామెత...అయితే చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన మాదాబత్తుల అమరావతి విషయంలో ఆ ఊరివాళ్లు అడక్కముందే అన్నీ సమకూర్చారు. పదేళ్లగా ఆమెని అక్కున చేర్చుకున్నారు. కల్యాణ ఘడియలు రావడంతో అత్తింటికి వెళ్లేటప్పుడు ఏం పంపాలో
విశాఖ జిల్లా గుండుపాల గ్రామస్థుల ఆదర్శం
‘అడగందే అమ్మయినా అన్నం పెట్టదు’ అనేది సామెత...అయితే చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన మాదాబత్తుల అమరావతి విషయంలో ఆ ఊరివాళ్లు అడక్కముందే అన్నీ సమకూర్చారు. పదేళ్లగా ఆమెని అక్కున చేర్చుకున్నారు. కల్యాణ ఘడియలు రావడంతో అత్తింటికి వెళ్లేటప్పుడు ఏం పంపాలో అవన్నీ ఊళ్లోవాళ్లే సమకూర్చారు. ఆదివారం ఉదయం లింగంపేటలో ‘కల్యాణం’. ఈ వేడుకలో పాల్గొని అక్షింతలు వేసి ఆశీర్వదించేందుకు ఊరంతా బయలుదేరుతున్నారు.
నర్సీపట్నానికి సమీపంలోని గుండుపాల గ్రామానికి చెందిన అమరావతితో విధి చెలగాటమాడింది. ఆమెకు పదేళ్లప్పుడే తల్లీతండ్రి కన్నుమూశారు. ఇప్పుడామె వయసు 20 ఏళ్లు. ఇన్నాళ్లూ ఆమెని చుట్టుపక్కల వారే ఆదరించారు. ఎనిమిదో తరగతి వరకు చదువుకున్న ఆమె మధ్యాహ్నం వేళ స్కూల్లో భోజనం చేసేది. రాత్రి ఆకలయ్యే సమయానికి చుట్టుపక్కల వారే భోజనం పంపేవారు. సిమెంట్ ఇటుకలు పేర్చి ఇనుపరేకుల కప్పు కింద నిద్రిస్తూ అందరి ఆడపిల్లల్లానే కలలు కనేది. అవి నిజమయ్యే దారి కనిపించక కలవరపడేది.
పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయం అవుతాయంటారు.. విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ట్రాన్స్పోర్టులో డ్రైవర్గా పనిచేస్తున్న గొలుగొండ మండలం లింగంపేట నివాసి బొద్దిన సురేష్ తొలిచూపులోనే అమరావతిపై మనసు పారేసుకున్నాడు. కట్నం లేకుండా పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చాడు. ఆమెకు పెళ్లి కుదరడంతో ఊళ్లో వాళ్లంతా సంతోషించారు. ఉపాధ్యాయుడు రాము ముందుకొచ్చి మన ఊరి ఆడపడుచుకు మనందరం దగ్గరుండి కల్యాణం జరిపిద్దామన్నారు. అందరు మద్దతు తెలిపారు. ఆ తరువాత అన్నీ చకచకా జరిగిపోయాయి. వీధిలోని చేనేత సామాజికవర్గానికి చెందిన మహిళలంతా కలిసి బంగారు చెవి బుట్టలు తయారు చేయించారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు కలిసి టేకు మంచం, కార్యదర్శి పరుపు, దిండ్లు, సచివాలయ ఓ మహిళా పోలీసు బీరువా కొన్నారు. ఊళ్లోని ఆటో వాళ్లంతా ఆదివారం పూర్తిగా పెళ్లిపనుల్లోనే ఉండాలని నిర్ణయించారు. కొందరు చీరలు కొన్నారు. కొందరు ఖర్చులకు డబ్బులిచ్చారు.
వారే దేవుళ్లు..
కడుపున పెట్టుకునే అమ్మలేదు. చేయిపట్టుకు నడిపించే నాన్నలేడు. చేనేత కార్మికులైన అమ్మానాన్న వయోభారంతో చనిపోయారు. అప్పుడప్పుడు ఫిట్స్ వస్తుండటంతో ఎనిమిదో తరగతి మించి చదువుకోలేకపోయా. చుట్టుపక్కల వారే ఆకలి తీర్చేవారు. అనారోగ్యంగా ఉంటే సపర్యలు చేశారు. విధి చిన్నచూపు చూసినా ఊళ్లో వాళ్లంతా దేవుళ్లలా ఆదుకున్నారు. వారందరి దయతోనే పెళ్లవుతోంది.
- మాదాబత్తుల అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనసేనకు ‘దక్షిణం’ జై!
[ 03-05-2024]
యువతకు, రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు దక్కాలంటే వైకాపా ప్రభుత్వం కూలిపోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి పేర్కొన్నారు. -
జగమొండి.. పథకాలకు గండి
[ 03-05-2024]
అయిదేళ్ల పాలనలో వైకాపా మైనార్టీలకు తీవ్ర అన్యాయం చేసింది. ముస్లింల అభివృద్ధికి కృషి చేస్తామంటూ హామీలు గుప్పించిన జగన్ వారిని ఓటు బ్యాంకుగానే చూశారు. -
నేడు బాలకృష్ణ రోడ్షో
[ 03-05-2024]
సినీ నటుడు బాలకృష్ణ రోడ్షో శుక్రవారం సాయంత్రం నగరంలో జరగనుందని తెదేపా వర్గాలు తెలిపాయి. -
ఆలయ భూమి హాంఫట్
[ 03-05-2024]
గ్రామదేవతకు భక్తులు అందించిన భూమిని నాయకులతో కలిసి ఒకరు కారుచౌకగా కొట్టేశారు. -
మౌలిక వసతులతో ఇళ్లిస్తాం: అయ్యన్న
[ 03-05-2024]
కూటమి విజయం ఖాయం. అధికార పగ్గాలు చేపట్టిన కొద్దిరోజుల్లోనే నర్సీపట్నంలోని టిడ్కో గృహ సముదాయంలో మౌలిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు ఇళ్లు అందజేస్తామని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. -
జగన్కు యూఎల్సీ ఝలక్..!
[ 03-05-2024]
నగరంలోని యూఎల్సీ (పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం) ద్వారా ప్రభుత్వానికి సంక్రమించిన భూముల్లో వెలిసిన ఆక్రమణలను క్రమబద్ధీకరిస్తామంటూ ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ నీరుగారి పోయింది. -
కూటమితోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాధ్యం
[ 03-05-2024]
కూటమితోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందని జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ అన్నారు. -
అధ్వాన రహదారులతో అనకాపల్లి జిల్లా
[ 03-05-2024]
అనకాపల్లి జిల్లాకు చెందిన మేధావులతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం వేపగుంటలో సమావేశం నిర్వహించారు. -
కూటమితో బీసీలకు రాజ్యాధికారం: శ్రీభరత్
[ 03-05-2024]
ప్రజా విశ్వాసం కోల్పోయిన వైకాపాను గద్దె దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, తెదేపా కూటమితోనే బీసీలకు రాజ్యాధికారం దక్కుతుందని విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం తెదేపా కూటమి అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. -
వైకాపా ప్రభుత్వాన్ని తరిమికొట్టండి: గంటా
[ 03-05-2024]
ప్రస్తుత ఎన్నికల్లో దుర్మార్గ వైకాపా సర్కారును తరిమికొట్టి సమర్థుడైన చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన చారిత్రక అవసరం అందరిపైన ఉందని భీమిలి నియోజకవర్గ కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. -
నేటి నుంచి నిజరూప దర్శనం టికెట్ల విక్రయం
[ 03-05-2024]
అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 10వ తేదీన సింహాద్రి అప్పన్న చందనోత్సవం వైభవోపేతంగా జరగనుంది. -
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి : గణబాబు
[ 03-05-2024]
ఆంధ్రరాష్ట్రం అభివృద్ధి, ప్రజా సంక్షేమం చంద్రబాబునాయుడుతోనే సాధ్యమవుతుందని విశాఖ పశ్చిమం తెదేపా అభ్యర్థి పి.గణబాబు అన్నారు. -
పట్టాదారు పుస్తకం మీద సీఎం బొమ్మ ఉంటే ఏం?: బొత్స
[ 03-05-2024]
రైతుల పట్టాదారు పాసు పుస్తకం మీద సీఎం చిత్రం ఉంటే అది చట్టపరంగా చెల్లకపోవడమంటూ ఏమీ లేదు కదా? అని మంత్రి బొత్స సత్యనారాయణ భూ హక్కుదారులను అపహాస్యం చేశారు. -
అవయవదానంతో దాతృత్వం చాటారు!
[ 03-05-2024]
చనిపోయిన వ్యక్తి అవయవదానానికి ముందుకు వచ్చి ఆ కుటుంబ సభ్యులు దాతృత్వం చాటారు. -
నకిలీ నోట్లు, బంగారం ముఠా గుట్టురట్టు
[ 03-05-2024]
తక్కువ కాలంలో డబ్బు, బంగారం సంపాదించాలని ఆశపడే వారిని లక్ష్యంగా చేసుకుని నకిలీ నోట్లు, బంగారంతో మోసగిస్తున్న ఓ ముఠా గుట్టు రట్టు చేసినట్లు మధురవాడ ఏసీపీ గురువారం తెలిపారు. -
‘సిద్ధం’ తాయిలాల టోకెన్లకు ఘర్షణ
[ 03-05-2024]
విశాఖ తూర్పు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వి.వి.సత్యనారాయణ సిద్ధం సభకు సిద్ధం చేసిన టోకెన్లపై ఆ పార్టీలోనే ఇద్దరు నాయకులు తీవ్రంగా ఘర్షణ పడటంతో పాటు ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
రక్షకభటులపై కక్ష
[ 03-05-2024]
ఉద్యోగులకు అది చేస్తాం.. ఇది చేస్తాం అని మాటలు చెప్పి.. వారికి తీరని అన్యాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుంది. నెత్తిన టోపీతో శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమించేవారికి జగన్ పెద్ద టోపీయే పెట్టారు. -
ఎండలో పండుటాకులు.. బ్యాంకులో పడిగాపులు.. నరకం చూపించారు...!
[ 03-05-2024]
పింఛను సొమ్ము తీసుకునేందుకు వృద్ధులు, దివ్యాంగుల అవస్థలు వర్ణనాతీతం. అధిక శాతం మంది పింఛనుదారుల బ్యాంక్ అకౌంట్లు యాక్టివ్లో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
వైకాపా సమర్పించు ‘అస్తవ్యస్త విస్తరణ’
[ 03-05-2024]
అనకాపల్లి జిల్లా రంగస్థల కళాకారులకు పుట్టినిల్లు. జిల్లాలోని వైకాపాకు చెందిన పాలకులు ఈ కళాకారుల సృజనను తలదన్నేలా చాలా సిత్రాలే చేశారు. పట్టణాలనే నాటకరంగంగా మార్చేసుకుని తెగ నటించేశారు. -
ఎక్కడికెళ్లినా రోడ్ల దుర్గతే చెబుతున్నారు!
[ 03-05-2024]
అనకాపల్లి జిల్లాకు చెందిన మేధావులతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి గురువారం వేపగుంటలో సమావేశం నిర్వహించారు. -
ప్రజా సంక్షేమం కూటమితోనే సాధ్యం
[ 03-05-2024]
రాష్ట్రం అభివృద్ధి కావాలంటే వైకాపా ప్రభుత్వాన్ని గద్దెదించాలని పేట కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత అన్నారు. -
ఓటరు స్లిప్పులు వచ్చేశాయి..
[ 03-05-2024]
ఈనెల 13న నిర్వహించనున్న ఎన్నికకు సంబంధించి ఓటర్లకు స్లిప్పులు వచ్చేశాయి. -
జనసేన కార్యకర్తపై వైకాపా నాయకుడి దాడి
[ 03-05-2024]
ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న జనసేన కార్యకర్తపై వైకాపా నాయకుడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.
తాజా వార్తలు (Latest News)
-
శంషాబాద్లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
-
లాభాల్లో సూచీలు.. 75,000 ఎగువకు సెన్సెక్స్.. 22,750 పైన నిఫ్టీ
-
భారత్పై బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
ఎండలిలా.. ప్రచారమెలా..!: ప్రజలను కలిసేందుకు నేతల రకరకాల యత్నాలు
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక