logo

రైళ్లకు అదనపు బోగీలు

ప్రయాణికుల సౌకర్యార్థం పలు రైళ్లకు అదనపు బోగీలు జత చేస్తున్నామని వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. 

Published : 13 Oct 2022 04:10 IST

రైల్వేస్టేషన్‌, న్యూస్‌టుడే: ప్రయాణికుల సౌకర్యార్థం పలు రైళ్లకు అదనపు బోగీలు జత చేస్తున్నామని వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు.  12 (బుధవారం) నుంచే విశాఖ- సికింద్రాబాద్‌ (08579)రైలుకు జత చేయగా... 13 నుంచి సికింద్రాబాద్‌- విశాఖ(08580) ప్రత్యేక రైలుకు ఒక థర్డ్‌ ఏసీ, ఒక స్లీపర్‌ క్లాస్‌ బోగీ అదనంగా ఉంటాయన్నారు. బీ ఈ నెల 15 నుంచి విశాఖ-దుర్గ్‌ (18530), 16 నుంచి దుర్గ్‌-విశాఖ (18529), 17 నుంచి విశాఖ-కిరండూల్‌ (18514), 18 నుంచి కిరండూల్‌-విశాఖ (18513) రైళ్లు.. ఒక సెకండ్‌ ఏసీ, 2 థర్డ్‌ ఏసీ, 5 స్లీపర్‌, 2 సాధారణ రెండో తరగతి, 2 సాధారణ రెండో తరగతి కమ్‌ లగేజి బోగీలతో రాకపోకలు సాగిస్తాయని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని