పారిశుద్ధ్య పోస్టు @ రూ.2.50 లక్షలు
వైకాపా ప్రజాప్రతినిధులు కొందరు అవినీతిని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికుల పొట్టకొట్టి అందినంత దండుకోవాలని చూస్తున్నారు.
వైకాపా నేతల బేరం
కార్పొరేషన్, న్యూస్టుడే
వైకాపా ప్రజాప్రతినిధులు కొందరు అవినీతిని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికుల పొట్టకొట్టి అందినంత దండుకోవాలని చూస్తున్నారు. జీవీఎంసీ ప్రజారోగ్య విభాగంలో 300 మంది కార్మికులను కూలి ప్రాతిపదికన దొడ్డిదారిన నియమించడం దీనికి ఉదాహరణ అని పలువురు చెబుతున్నారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందించిన కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇతరులకు అమ్ముకుంటున్నారని వాపోతున్నారు. తక్షణమే కూలి ప్రాతిపదికన చేపట్టిన నియామకాలు రద్దు చేసి, కార్మికుల కుటుంబ సభ్యులను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు.
ఆ నలుగురే కీలకం
ఇప్పటికే 300 మంది కార్మికులను కూలి ప్రాతిపదికన నియామకానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వైకాపా ప్రజాప్రతినిధులు తాము సూచించిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలని గట్టిగా కోరుతున్నారు. తెర వెనుక ఒక్కో పోస్టుకు బేరం పెట్టి రూ.2.50లక్షల వరకు అమ్ముకుంటున్నారని పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారాన్ని జీవీఎంసీలో ఓ ఉన్నతాధికారి, పాలకవర్గంలోని నలుగురు నడుపుతున్నారని బహిరంగంగానే పలువురు కార్మికులు వ్యాఖ్యానిస్తున్నారు. కూలి ప్రాతిపదికన కార్మికులను తీసుకునే విధానానికి మేయరు అనుమతి ఇచ్చారా లేదా అనే విషయంపై ఇప్పటి వరకు స్పష్టత రాకపోవడం గమనార్హం.
316 కాదు.. కేవలం 77 మందే..
పాలకవర్గం ఏర్పడిన నాటి నుంచి కొత్తగా కార్మికులను నియమించాలని, తద్వారా నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని భావించిన కొందరు అధికార పార్టీ నేతల ఆలోచనలను పసిగట్టిన గత కమిషనర్లు ఆ అవకాశం ఇవ్వలేదు. ఒత్తిడి మరింత తీవ్రతరం కావడంతో ‘ఆప్కోస్’ ద్వారా కలెక్టర్ ఆధ్వర్యంలో నియామకాలు చేపట్టాలని భావించారు. అనంతరం కార్మిక సంఘాల ఒత్తిడితో... మృతి చెందిన, ఉద్యోగ విరమణ చేసిన 482 మంది కార్మికుల వారసులకు అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆప్కోస్ నిబంధనల ప్రకారం దరఖాస్తులు ఆహ్వానించగా 5012 వచ్చాయి. అందులో వారసత్వ నియామకాలకు 316 మంది అర్హులని ముగ్గురు కమిటీ సభ్యులు తేల్చారు. దాన్ని పక్కనపెట్టి కేవలం 77 మంది మాత్రమే అర్హులని అధికారులు ప్రకటించారు. దీని వెనుక అధికారపక్ష నాయకుల ఒత్తిడి ఉందనే వాదన వినిపిస్తోంది.
రూ.లక్ష నుంచి ప్రారంభమై...
‘మొదట ఒక్కో పోస్టుకు రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు అధికార పార్టీ నేతలు కొందరు తీసుకున్నారు. ఇప్పుడు ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో రూ.2.50లక్షలకు పెంచేశారు. గతంలో ఇచ్చిన పేర్లు కాదని, రూ.2.50లక్షలు చెల్లించిన వారి పేర్లను అధికారులకు పంపుతున్నారు. ఇలాంటి వారిలో ప్రజాప్రతినిధుల ఇళ్లల్లో పనిచేసే వారు కూడా ఉన్నారు. వీరు తమ ఇళ్లల్లో పనిచేస్తూ జీవీఎంసీ వేతనం పొందేలా చేయడం నేతల వ్యూహంగా కనిపిస్తోంది’ అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నీ పేరు పెట్టావ్.. ఒట్టు తీసి గట్టున పెట్టావ్
[ 02-05-2024]
తెదేపా హయాంలో ‘బీఆర్ అంబేడ్కర్’ పేరుతో అమలు చేసిన విదేశీ విద్య పథకానికి ముఖ్యమంత్రి జగన్ నీళ్లొదిలారు. ఈ పథకానికి తన పేరు పెట్టుకోవడం తప్ప చేసిందేమీ లేదు. -
పవన్ సభకు.. జన సునామీ!!
[ 02-05-2024]
పెందుర్తిలో ‘వారాహి విజయభేరి’ సభ జన సునామీని తలపించింది. బుధవారం రాత్రి నిర్వహించిన సభకు చిన్నారుల నుంచి పెద్దల వరకు భారీగా తరలివచ్చారు. -
చప్పగా సీఎం ప్రసంగం.. స్పందన అంతంతమాత్రం
[ 02-05-2024]
ఒకవైపు ఎండ.. మరోవైపు అంతంతమాత్రంగా వచ్చిన జనం.. వారిలోనూ కానరాని స్పందన.. మొత్తంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగంలో కొత్త విషయాలేవీ లేకుండా చప్పగా సాగింది. -
బాలకృష్ణకు ఘన స్వాగతం
[ 02-05-2024]
ఉత్తరాంధ్రలో నిర్వహించే ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బుధవారం మధ్యాహ్నం గన్నవరం నుంచి విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. -
పాడికుండకు చిల్లు.. జగన్కే చెల్లు!
[ 02-05-2024]
పల్లె జీవనంలో, గ్రామాల అభివృద్ధిలో పాడిది విడదీయరాని పాత్ర. క్షీరధారలు ఎంత పొంగిపొర్లితే పల్లెలు అంత పచ్చగా ఉన్నట్టు, అన్నదాత ఆనందంగా ఉన్నట్టు. ప్రతిపక్షం మీద కక్షతో జగన్ పాడిని పాడు చేశారు. -
మాటలు బడాయి.. పేదల వైద్యానికి బకాయి
[ 02-05-2024]
సంపూర్ణ ఆరోగ్యం ప్రతి ఒక్కరి హక్కు. అందుకు అనుగుణంగా ప్రభుత్వాలు కృషి చేయాలి. మెరుగైన వైద్య సేవలందించాలి. కానీ వైకాపా ప్రభుత్వం అవేవీ పట్టవన్నట్లు వ్యవహరిస్తోంది. -
మీ ఓటు ఎక్కడ ఉందో తెలుసా..
[ 02-05-2024]
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో ఓటు ఎక్కడ ఉంది? పోలింగ్ కేంద్రం ఎక్కడ? ఎలా చేరుకోవాలి? అనే సందేహాలు ఓటర్లలో తలెత్తుతున్నాయి. -
నేడు ‘దక్షిణం’లో పవన్ సభ
[ 02-05-2024]
దక్షిణ నియోజకవర్గ దుర్గాలమ్మ ఆలయం ప్రాంతంలో గురువారం సాయంత్రం ఆరుగంటలకు జనసేన అధినేత పవన్కల్యాణ్ బహిరంగ సభ జరగనుందని ఆ పార్టీ నగర అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గ జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. -
ఫలితాలు తేల్చేది వనితలే!
[ 02-05-2024]
జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఏప్రిల్ 25 నాటికి 12,89,371 మంది ఓటర్లు ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రవి గత శనివారం రాజకీయ పార్టీల సమావేశంలో ప్రకటించారు. -
కాపులకు మేలు చేసింది తెదేపానే: గంటా
[ 02-05-2024]
రాష్ట్రంలో కాపులకు మేలుచేసిన పార్టీ తెదేపా మాత్రమేనని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. -
ఆరోగ్యశ్రీ పథకానికి అనారోగ్యం
[ 02-05-2024]
జగనన్న పాలనలో ప్రజల ఆరోగ్యం గాల్లో దీపంలా మారింది. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామని ప్రకటించిన వైకాపా ప్రభుత్వం మాటలు నీటి మూటలయ్యాయి. -
విదేశీ విద్య.. అంతా మిథ్య
[ 02-05-2024]
విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదవాలన్న పేద విద్యార్థుల కలను జగన్ కల్లగానే మిగిల్చేశారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పేరిట అమలు చేస్తున్న ఈ పథకం లబ్ధిదారులకు కఠిన నిబంధనలు అడ్డుగా మారాయి. -
జనసేనానికి జన నీరాజనం
[ 02-05-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు పెందుర్తిలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా జనసేనానికి నీరాజనాలు పలికారు. -
ఎమ్మెల్యే సారూ.. జెట్టీ ఒట్టి మాటేనా..
[ 02-05-2024]
పరవాడ మండలం ముత్యాలమ్మలపాలెం పంచాయతీ పరిధిలోని దిబ్బపాలెం, జాలారిపేట, సమ్మెంగిపాలెంలోని మత్స్యకారులకు చేపల వేటే ప్రధాన ఆధారం. -
నోటా కోసమే ఒక బ్యాలెట్ యూనిట్
[ 02-05-2024]
జిల్లాలో ఇతర నియోజకవర్గాలతో పోల్చితే విశాఖ దక్షిణంలో పోలింగ్ ఈసారి కాస్త భిన్నంగా ఉండనుంది. ఇ -
స్వగ్రామానికి ఆర్మీ ఉద్యోగి మృతదేహం
[ 02-05-2024]
పశ్చిమబెంగాల్లో హఠాన్మరణం చెందిన ఆర్మీ హవల్దార్ చిల్ల త్రినాథరెడ్డి (36) మృతదేహాన్ని ఆయన స్వగ్రామమైన చిట్టివలస సమీప జీరుపేట గ్రామానికి బుధవారం తీసుకువచ్చారు. -
ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్యాయత్నం....
[ 02-05-2024]
ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స పొందుతూ కుమార్తె మృతి చెందింది. -
బాలికపై అత్యాచార యత్నం
[ 02-05-2024]
ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన వ్యక్తిపై ఎండాడ దిశా పోలీసు స్టేషన్లో పోక్సో చట్టం కింద కేసు నమోదైనట్లు భీమిలి సీఐ డి.రమేశ్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైకి షాక్ తప్పదా.. ఐదుగురు బౌలర్ల గైర్హాజరీపై ఫ్లెమింగ్ ఏమన్నాడంటే?
-
4 కంటైనర్లలో రూ.2వేల కోట్లు.. ఆర్బీఐకి చెందినవంటున్న అధికారులు!
-
సిద్ధార్థ్తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్అవుట్ నోటీసు
-
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇకపై ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు!