వంటింటిపై జగనన్న బాదుడు
అసలే అరకొర ఆదాయం.. ఆపై రోజు రోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలతో సగటు జీవి కుదేలవుతున్నాడు.
మండుతున్న నిత్యావసరాల ధరలు
గగ్గోలు పెడుతున్న జనాలు
పెందుర్తి, సబ్బవరం, పరవాడ, వేపగుంట, న్యూస్టుడే
అసలే అరకొర ఆదాయం.. ఆపై రోజు రోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలతో సగటు జీవి కుదేలవుతున్నాడు. ప్రయివేటు ఉద్యోగులు, కూలీలు, ఇతర రంగాలపై ఆధారపడిన వారి కుటుంబాల జీవనం కష్టతరంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగులు సైతం నెలావారీ జీతాలు సక్రమంగా అందక పెరుగుతున్న ధరలకు బాధితులుగా మారిపోయారు. బియ్యం, వంట నూనెల ధరల్లో స్థిరత్వం లేకపోవడంతో నెలా నెలా మారుతూ భారాన్ని రెట్టింపు చేస్తున్నాయి. పప్పుల ధరలు మరింత దారుణంగా ఉన్నాయి. గతంలో రూ.200తో కూరగాయలు కొనుగోలు చేస్తే వారమంతా సరిపోయేవి. ఇప్పుడు రూ.500 వరకు ఖర్చవుతోంది. ఇలా ఇంట్లోకి ఏ వస్తువు కావాలన్నా పట్టుకుంటే మండిపోయేంత ధరలు సామాన్యులను కన్నీరు పెట్టిస్తున్నాయి.
ఇదంతా చూస్తున్న జగనన్న చిరునవ్వులు చిందిస్తూ జనాలకు సంక్షేమ పథకాలు అందించానని బీరాలు పలుకుతున్నారు.
ధరలు చూస్తే వామ్మో
నిత్యావసర సరకుల ధరలు చూస్తే గుండె గుబేలుమంటోంది. నెలానెలా మారిపోతున్నాయి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆదాయంలో వృద్ధి ఉండట్లేదు. ఫలితంగా పిల్లల చదువులు, ఇతర అవసరాలపై ప్రభావం పడుతోంది.
పి.గాయత్రి, గృహిణి
రెండింతలు పెరిగాయి
నాలుగేళ్లలో రెండింతలు పెరిగిపోయాయి. ప్రభుత్వం తెచ్చిన సంక్షేమ పథకాలు ధరల మంటల్లో ఎక్కడా ఉపయోగపడినట్టు లేదు. ధరలను తగ్గించడానికి ప్రభుత్వం ఏ రోజూ మాట్లాడలేదు.
ఎస్.వీ.రాణి, వేపగుంట
ఇళ్లు గడవాలంటే కష్టమే
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత పప్పులు, బియ్యం, నూనె, గ్యాస్, ఇంటి అద్దెలు, కూరగాయలు తదితర ధరలు అమాంతం పెరిగిపోయాయి. రేషన్ దుకాణాల్లో బియ్యం, పంచŸదార తప్ప ఏమీ ఇవ్వడం లేదు. నాలుగేళ్ల క్రితం నెలకు రూ.4 వేలు అయ్యే కిరాణా బిల్లు ఇప్పుడు ఏకంగా రూ.8 వేలు వరకు అవుతోంది.
జి.సునీత
అమాంతం పెరిగిపోయాయి
వైకాపా పాలనలో ధరలు అమాంతంగా పెరిగిపోతున్నా నియంత్రించడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కందిపప్పు గతంలో కిలో రూ.80 ఉంటే ఇప్పుడు రూ.160 దాటింది. సామాన్యులు అల్లాడిపోతున్నారు. విద్యుత్తు బిల్లు, పన్నులు, ఆర్టీసీ ఛార్జీలు, పెట్రోలు, డీజిల్, ఇసుక ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.
కాకి శ్రీను
ఆకాశాన్నంటుతున్నాయి..
వైకాపా ప్రభుత్వంలో పెరగని వస్తువు ధరంటూ ఏదీ లేదు. ఉప్పు, పప్పు, చింతపండు, బియ్యం, మసాలాలు ఇలా ఏ వస్తువు చూసినా ఆకాశాన్నంటుతున్నాయి. గతంలో రూ.20 ఉన్న కిలో సాధారణ బియ్యం ఇప్పుడు రూ.50 నుంచి రూ.60 వరకు ఉంది.
నక్కా ఈశ్వరరావు గొట్టివాడ
గతంలో రూ.100కే సంచి నిండేది
తెదేపా ప్రభుత్వం ఉన్నప్పుడు రూ.100కే సంచి నిండా కూరగాయలు వచ్చేవి. అదే సంచి ఇప్పుడు నిండాలంటే రూ.500 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. మళ్లీ వైకాపా ప్రభుత్వం వస్తే ఇక తినడానికి, ఉండడానికి ఏదీ మిగలదు.
పల్లా సన్యాసిరావు, గొల్లలపాలెం
ఈ ప్రభావం పిల్లలపై పడుతోంది
పేద, మధ్య తరగతి కుటుంబాలు సంపాదించిన సంపాదనలో కొంత పిల్లల పేరున పొదుపు చేయాలంటే తప్పకుండా ధరలు అదుపులో ఉండాలి. గత ఐదేళ్లలో ఏ రోజూ నిత్యావసర ధరలు తగ్గిన సందర్భాలు లేవు.
సంబాన రాజు, వేపగుంట
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నీ పేరు పెట్టావ్.. ఒట్టు తీసి గట్టున పెట్టావ్
[ 02-05-2024]
తెదేపా హయాంలో ‘బీఆర్ అంబేడ్కర్’ పేరుతో అమలు చేసిన విదేశీ విద్య పథకానికి ముఖ్యమంత్రి జగన్ నీళ్లొదిలారు. ఈ పథకానికి తన పేరు పెట్టుకోవడం తప్ప చేసిందేమీ లేదు. -
పవన్ సభకు.. జన సునామీ!!
[ 02-05-2024]
పెందుర్తిలో ‘వారాహి విజయభేరి’ సభ జన సునామీని తలపించింది. బుధవారం రాత్రి నిర్వహించిన సభకు చిన్నారుల నుంచి పెద్దల వరకు భారీగా తరలివచ్చారు. -
చప్పగా సీఎం ప్రసంగం.. స్పందన అంతంతమాత్రం
[ 02-05-2024]
ఒకవైపు ఎండ.. మరోవైపు అంతంతమాత్రంగా వచ్చిన జనం.. వారిలోనూ కానరాని స్పందన.. మొత్తంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగంలో కొత్త విషయాలేవీ లేకుండా చప్పగా సాగింది. -
బాలకృష్ణకు ఘన స్వాగతం
[ 02-05-2024]
ఉత్తరాంధ్రలో నిర్వహించే ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బుధవారం మధ్యాహ్నం గన్నవరం నుంచి విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. -
పాడికుండకు చిల్లు.. జగన్కే చెల్లు!
[ 02-05-2024]
పల్లె జీవనంలో, గ్రామాల అభివృద్ధిలో పాడిది విడదీయరాని పాత్ర. క్షీరధారలు ఎంత పొంగిపొర్లితే పల్లెలు అంత పచ్చగా ఉన్నట్టు, అన్నదాత ఆనందంగా ఉన్నట్టు. ప్రతిపక్షం మీద కక్షతో జగన్ పాడిని పాడు చేశారు. -
మాటలు బడాయి.. పేదల వైద్యానికి బకాయి
[ 02-05-2024]
సంపూర్ణ ఆరోగ్యం ప్రతి ఒక్కరి హక్కు. అందుకు అనుగుణంగా ప్రభుత్వాలు కృషి చేయాలి. మెరుగైన వైద్య సేవలందించాలి. కానీ వైకాపా ప్రభుత్వం అవేవీ పట్టవన్నట్లు వ్యవహరిస్తోంది. -
మీ ఓటు ఎక్కడ ఉందో తెలుసా..
[ 02-05-2024]
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో ఓటు ఎక్కడ ఉంది? పోలింగ్ కేంద్రం ఎక్కడ? ఎలా చేరుకోవాలి? అనే సందేహాలు ఓటర్లలో తలెత్తుతున్నాయి. -
నేడు ‘దక్షిణం’లో పవన్ సభ
[ 02-05-2024]
దక్షిణ నియోజకవర్గ దుర్గాలమ్మ ఆలయం ప్రాంతంలో గురువారం సాయంత్రం ఆరుగంటలకు జనసేన అధినేత పవన్కల్యాణ్ బహిరంగ సభ జరగనుందని ఆ పార్టీ నగర అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గ జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. -
ఫలితాలు తేల్చేది వనితలే!
[ 02-05-2024]
జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఏప్రిల్ 25 నాటికి 12,89,371 మంది ఓటర్లు ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రవి గత శనివారం రాజకీయ పార్టీల సమావేశంలో ప్రకటించారు. -
కాపులకు మేలు చేసింది తెదేపానే: గంటా
[ 02-05-2024]
రాష్ట్రంలో కాపులకు మేలుచేసిన పార్టీ తెదేపా మాత్రమేనని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. -
ఆరోగ్యశ్రీ పథకానికి అనారోగ్యం
[ 02-05-2024]
జగనన్న పాలనలో ప్రజల ఆరోగ్యం గాల్లో దీపంలా మారింది. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామని ప్రకటించిన వైకాపా ప్రభుత్వం మాటలు నీటి మూటలయ్యాయి. -
విదేశీ విద్య.. అంతా మిథ్య
[ 02-05-2024]
విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదవాలన్న పేద విద్యార్థుల కలను జగన్ కల్లగానే మిగిల్చేశారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పేరిట అమలు చేస్తున్న ఈ పథకం లబ్ధిదారులకు కఠిన నిబంధనలు అడ్డుగా మారాయి. -
జనసేనానికి జన నీరాజనం
[ 02-05-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు పెందుర్తిలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా జనసేనానికి నీరాజనాలు పలికారు. -
ఎమ్మెల్యే సారూ.. జెట్టీ ఒట్టి మాటేనా..
[ 02-05-2024]
పరవాడ మండలం ముత్యాలమ్మలపాలెం పంచాయతీ పరిధిలోని దిబ్బపాలెం, జాలారిపేట, సమ్మెంగిపాలెంలోని మత్స్యకారులకు చేపల వేటే ప్రధాన ఆధారం. -
నోటా కోసమే ఒక బ్యాలెట్ యూనిట్
[ 02-05-2024]
జిల్లాలో ఇతర నియోజకవర్గాలతో పోల్చితే విశాఖ దక్షిణంలో పోలింగ్ ఈసారి కాస్త భిన్నంగా ఉండనుంది. ఇ -
స్వగ్రామానికి ఆర్మీ ఉద్యోగి మృతదేహం
[ 02-05-2024]
పశ్చిమబెంగాల్లో హఠాన్మరణం చెందిన ఆర్మీ హవల్దార్ చిల్ల త్రినాథరెడ్డి (36) మృతదేహాన్ని ఆయన స్వగ్రామమైన చిట్టివలస సమీప జీరుపేట గ్రామానికి బుధవారం తీసుకువచ్చారు. -
ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్యాయత్నం....
[ 02-05-2024]
ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స పొందుతూ కుమార్తె మృతి చెందింది. -
బాలికపై అత్యాచార యత్నం
[ 02-05-2024]
ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన వ్యక్తిపై ఎండాడ దిశా పోలీసు స్టేషన్లో పోక్సో చట్టం కింద కేసు నమోదైనట్లు భీమిలి సీఐ డి.రమేశ్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్
-
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం: నెట్వర్క్ ఆసుపత్రుల లేఖ
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM