కూటమి విజయంతోనే అభివృద్ధి
కూటమి విజయంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని పెందుర్తి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబు అన్నారు.
పరవాడలో పంచకర్లను సత్కరిస్తున్న తెదేపా నాయకులు పైలా సన్యాసిరావు తదితరులు
పరవాడ, న్యూస్టుడే: కూటమి విజయంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని పెందుర్తి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబు అన్నారు. పరవాడ మండలంలో వాడచీపురుపల్లి, నాయుడుపాలెం, ఉక్కునగరం 8, 9, 10, 11, 12 సెక్టారుల్లో సోమవారం ఆయన తెదేపా, జనసేన, భాజపా నాయకులతో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామస్థులు, కార్యకర్తలు పంచకర్లకు స్వాగతం పలికారు. మహిళలు హారతులిచ్చి బ్రహ్మరథం పట్టారు. పంచకర్ల మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్టీలుప్లాంటు ప్రయివేటీరణను నిలిపివేయాలని తనతో పాటు గాజువాక అసెంబ్లీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు, అనకాపల్లి, విశాఖ ఎంపీ అభ్యర్థులు సీఎం రమేశ్, భరత్ అంతా కలిసి చిత్తశుద్ధితో పని చేస్తామన్నారు. ఎన్టీపీసీ కాలుష్య సమస్య పరిష్కారంతో పాటు ఎన్టీపీసీలో స్థానికులకే ఉపాధి అవకాశాలను కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు మాసరవపు అప్పలనాయుడు, పైలా జగన్నాథరావు, నాయకులు కన్నూరు వెంకటరమణ, కూండ్రపు సన్యాసినాయుడు, కూండ్రపు శ్రీరామ్మూర్తి, మధు, బుగిడి గోవింద, మోటూరు సన్యాసినాయుడు, తదితరులు పాల్గొన్నారు. బీ మండల కేంద్రం పరవాడలోని తెదేపా నాయకులు, కార్యకర్తలతో సోమవారం పంచకర్ల రమేశ్బాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం పంచకర్లను తెదేపా నాయకులు సత్కరించారు. కార్యక్రమంలో పైలా సన్యాసిరావు, పైలా చినఅక్కునాయుడు, పైలా రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు
వాడచీపురుపల్లిలో మాట్లాడుతున్న పెందుర్తి అసెంబ్లీ అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనసేనకు ‘దక్షిణం’ జై!
[ 03-05-2024]
యువతకు, రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు దక్కాలంటే వైకాపా ప్రభుత్వం కూలిపోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి పేర్కొన్నారు. -
జగమొండి.. పథకాలకు గండి
[ 03-05-2024]
అయిదేళ్ల పాలనలో వైకాపా మైనార్టీలకు తీవ్ర అన్యాయం చేసింది. ముస్లింల అభివృద్ధికి కృషి చేస్తామంటూ హామీలు గుప్పించిన జగన్ వారిని ఓటు బ్యాంకుగానే చూశారు. -
నేడు బాలకృష్ణ రోడ్షో
[ 03-05-2024]
సినీ నటుడు బాలకృష్ణ రోడ్షో శుక్రవారం సాయంత్రం నగరంలో జరగనుందని తెదేపా వర్గాలు తెలిపాయి. -
ఆలయ భూమి హాంఫట్
[ 03-05-2024]
గ్రామదేవతకు భక్తులు అందించిన భూమిని నాయకులతో కలిసి ఒకరు కారుచౌకగా కొట్టేశారు. -
మౌలిక వసతులతో ఇళ్లిస్తాం: అయ్యన్న
[ 03-05-2024]
కూటమి విజయం ఖాయం. అధికార పగ్గాలు చేపట్టిన కొద్దిరోజుల్లోనే నర్సీపట్నంలోని టిడ్కో గృహ సముదాయంలో మౌలిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు ఇళ్లు అందజేస్తామని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. -
జగన్కు యూఎల్సీ ఝలక్..!
[ 03-05-2024]
నగరంలోని యూఎల్సీ (పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం) ద్వారా ప్రభుత్వానికి సంక్రమించిన భూముల్లో వెలిసిన ఆక్రమణలను క్రమబద్ధీకరిస్తామంటూ ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ నీరుగారి పోయింది. -
కూటమితోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాధ్యం
[ 03-05-2024]
కూటమితోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందని జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ అన్నారు. -
అధ్వాన రహదారులతో అనకాపల్లి జిల్లా
[ 03-05-2024]
అనకాపల్లి జిల్లాకు చెందిన మేధావులతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం వేపగుంటలో సమావేశం నిర్వహించారు. -
కూటమితో బీసీలకు రాజ్యాధికారం: శ్రీభరత్
[ 03-05-2024]
ప్రజా విశ్వాసం కోల్పోయిన వైకాపాను గద్దె దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, తెదేపా కూటమితోనే బీసీలకు రాజ్యాధికారం దక్కుతుందని విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం తెదేపా కూటమి అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. -
వైకాపా ప్రభుత్వాన్ని తరిమికొట్టండి: గంటా
[ 03-05-2024]
ప్రస్తుత ఎన్నికల్లో దుర్మార్గ వైకాపా సర్కారును తరిమికొట్టి సమర్థుడైన చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన చారిత్రక అవసరం అందరిపైన ఉందని భీమిలి నియోజకవర్గ కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. -
నేటి నుంచి నిజరూప దర్శనం టికెట్ల విక్రయం
[ 03-05-2024]
అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 10వ తేదీన సింహాద్రి అప్పన్న చందనోత్సవం వైభవోపేతంగా జరగనుంది. -
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి : గణబాబు
[ 03-05-2024]
ఆంధ్రరాష్ట్రం అభివృద్ధి, ప్రజా సంక్షేమం చంద్రబాబునాయుడుతోనే సాధ్యమవుతుందని విశాఖ పశ్చిమం తెదేపా అభ్యర్థి పి.గణబాబు అన్నారు. -
పట్టాదారు పుస్తకం మీద సీఎం బొమ్మ ఉంటే ఏం?: బొత్స
[ 03-05-2024]
రైతుల పట్టాదారు పాసు పుస్తకం మీద సీఎం చిత్రం ఉంటే అది చట్టపరంగా చెల్లకపోవడమంటూ ఏమీ లేదు కదా? అని మంత్రి బొత్స సత్యనారాయణ భూ హక్కుదారులను అపహాస్యం చేశారు. -
అవయవదానంతో దాతృత్వం చాటారు!
[ 03-05-2024]
చనిపోయిన వ్యక్తి అవయవదానానికి ముందుకు వచ్చి ఆ కుటుంబ సభ్యులు దాతృత్వం చాటారు. -
నకిలీ నోట్లు, బంగారం ముఠా గుట్టురట్టు
[ 03-05-2024]
తక్కువ కాలంలో డబ్బు, బంగారం సంపాదించాలని ఆశపడే వారిని లక్ష్యంగా చేసుకుని నకిలీ నోట్లు, బంగారంతో మోసగిస్తున్న ఓ ముఠా గుట్టు రట్టు చేసినట్లు మధురవాడ ఏసీపీ గురువారం తెలిపారు. -
‘సిద్ధం’ తాయిలాల టోకెన్లకు ఘర్షణ
[ 03-05-2024]
విశాఖ తూర్పు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వి.వి.సత్యనారాయణ సిద్ధం సభకు సిద్ధం చేసిన టోకెన్లపై ఆ పార్టీలోనే ఇద్దరు నాయకులు తీవ్రంగా ఘర్షణ పడటంతో పాటు ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
రక్షకభటులపై కక్ష
[ 03-05-2024]
ఉద్యోగులకు అది చేస్తాం.. ఇది చేస్తాం అని మాటలు చెప్పి.. వారికి తీరని అన్యాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుంది. నెత్తిన టోపీతో శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమించేవారికి జగన్ పెద్ద టోపీయే పెట్టారు. -
ఎండలో పండుటాకులు.. బ్యాంకులో పడిగాపులు.. నరకం చూపించారు...!
[ 03-05-2024]
పింఛను సొమ్ము తీసుకునేందుకు వృద్ధులు, దివ్యాంగుల అవస్థలు వర్ణనాతీతం. అధిక శాతం మంది పింఛనుదారుల బ్యాంక్ అకౌంట్లు యాక్టివ్లో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
వైకాపా సమర్పించు ‘అస్తవ్యస్త విస్తరణ’
[ 03-05-2024]
అనకాపల్లి జిల్లా రంగస్థల కళాకారులకు పుట్టినిల్లు. జిల్లాలోని వైకాపాకు చెందిన పాలకులు ఈ కళాకారుల సృజనను తలదన్నేలా చాలా సిత్రాలే చేశారు. పట్టణాలనే నాటకరంగంగా మార్చేసుకుని తెగ నటించేశారు. -
ఎక్కడికెళ్లినా రోడ్ల దుర్గతే చెబుతున్నారు!
[ 03-05-2024]
అనకాపల్లి జిల్లాకు చెందిన మేధావులతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి గురువారం వేపగుంటలో సమావేశం నిర్వహించారు. -
ప్రజా సంక్షేమం కూటమితోనే సాధ్యం
[ 03-05-2024]
రాష్ట్రం అభివృద్ధి కావాలంటే వైకాపా ప్రభుత్వాన్ని గద్దెదించాలని పేట కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత అన్నారు. -
ఓటరు స్లిప్పులు వచ్చేశాయి..
[ 03-05-2024]
ఈనెల 13న నిర్వహించనున్న ఎన్నికకు సంబంధించి ఓటర్లకు స్లిప్పులు వచ్చేశాయి. -
జనసేన కార్యకర్తపై వైకాపా నాయకుడి దాడి
[ 03-05-2024]
ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న జనసేన కార్యకర్తపై వైకాపా నాయకుడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో సూచీలు.. 75,000 ఎగువకు సెన్సెక్స్.. 22,750 పైన నిఫ్టీ
-
భారత్పై బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
ఎండలిలా.. ప్రచారమెలా..!: ప్రజలను కలిసేందుకు నేతల రకరకాల యత్నాలు
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక
-
రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరత్కుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?